IT Employees: ఐటీ ఉద్యోగులకు తనిఖీల ముప్పు
ఉద్యోగ కోతలు అమలు చేయడంతో పాటు నూతన నియామకాలు తగ్గించుకుంటున్న ఐటీ సంస్థలు.. పనిచేస్తున్న ఉద్యోగుల నైపుణ్యాలు, సామర్థ్యాలనూ నిశితంగా గమనిస్తున్నాయి.
ఈ ఏడాది వేతన పెంపులు కష్టమే
ఉద్యోగ కోతలు అమలు చేయడంతో పాటు నూతన నియామకాలు తగ్గించుకుంటున్న ఐటీ సంస్థలు.. పనిచేస్తున్న ఉద్యోగుల నైపుణ్యాలు, సామర్థ్యాలనూ నిశితంగా గమనిస్తున్నాయి. కొవిడ్ పరిణామాల సమయంలో అధిక వేతనాలు ఇచ్చి నియమించుకున్న సీనియర్ ఉద్యోగుల పనితీరును ఇంకా తీక్షణంగా విశ్లేషిస్తున్నట్లు సమాచారం. ఉత్పాదకతలో తమ సామర్థ్యాన్ని చూపాలని వారిని మానవ వనరుల విభాగాధికారులు కోరుతున్నట్లు చెబుతున్నారు.
అధిక వ్యయాలు, మార్జిన్ల క్షీణతే కారణం: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తున్న నేపథ్యంలో ఐటీ కంపెనీల మార్జిన్లు తగ్గుతున్నాయి. దీంతో వ్యయాల నియంత్రణ కోసం, ఎక్కువ వేతనాలు పొందుతున్న ఉద్యోగులపై సంస్థలు దృష్టి సారించినట్లు సమాచారం. ఈ ఏడాది వేతన పెంపులను కూడా నిలిపివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అధిక వేతనాలతోనే సమస్య: కొవిడ్ పరిణామాల్లో ప్రాజెక్టులు అధికంగా రావడంతో, 5-12 ఏళ్ల అనుభవం కలిగిన నిపుణులను గత రెండేళ్లలో పెద్ద ఐటీ కంపెనీలు భారీ స్థాయిలో నియమించుకున్నాయి. కంపెనీల మొత్తం ఉద్యోగుల్లో ఇటువంటి వారు 70% ఉన్నారు. ‘అధిక వేతనాలకు అప్పుడు ఉద్యోగులను నియమించుకోవడం ఇప్పుడు సమస్యగా మారింది. సాధారణ వేతనాలతో పోలిస్తే, 50-60 శాతం అధికమొత్తం ఆఫర్ చేసి మరీ, అప్పట్లో కావాల్సిన నిపుణులను సంస్థలు చేర్చుకున్నాయి’ అని టీమ్ లీజ్ డిజిటల్ సీఈఓ సునీల్ చెమ్మన్కోటిల్ తెలిపారు. వీరిలో ఎక్కువమందిలో అద్భుత నైపుణ్యాలున్నాయని, వీరిని వేరే వాళ్లతో భర్తీ చేయడం కష్టమని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మార్జిన్లు తగ్గాయనే భావనతో, అధిక వేతనాలున్న నిపుణులను వదులుకోకుండా, కంపెనీలు కొనసాగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రస్తుత తనిఖీలు/స్క్రూటినీ వల్ల ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు.
* అధిక వేతనాలపై నియమితులైన మధ్యస్థాయి ఉద్యోగులకూ తనిఖీల ముప్పు ఉందని, వీరు కూడా తమ సామర్థ్యాలను నిరూపించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. తగిన సామర్థ్యం లేని ఈ స్థాయి వారిని తొలగిస్తే, సాధారణ వేతనాలకు లభించే కొత్తవారితో భర్తీ చేయొచ్చన్నది కంపెనీల అభిప్రాయంగా పేర్కొన్నారు.
అంతర్జాతీయంగా ఇదే ధోరణి
కొవిడ్ తర్వాత ఆశావహంగా కనిపించిన రంగాల్లో ఐటీ ఒకటి. అయితే ఆర్థిక మందగమన భయాలతో పరిస్థితులు ఒక్కసారిగా మారాయి. అధిక వేతనాలకు సరిపడా పనిలేదంటూ సీనియర్ ఉద్యోగులను తొలగిస్తున్న కంపెనీలు, ‘శిక్షణ అనంతరమూ సంతృప్తికర పనితీరు లేదంటూ’ కొత్త ఉద్యోగులనూ ఇంటికి పంపిస్తుండటం గమనార్హం. ఇటీవల అంతర్గత మదింపులో విఫలమైన 600 మంది ఫ్రెషర్స్ను ఇన్ఫోసిస్ తొలగించింది. 2022 జులై నుంచి చూస్తే.. టెక్ దిగ్గజాలు గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ సహా ఐటీ కంపెనీలు దాదాపు 2,00,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి.
బోయింగ్లో 2000 ఉద్యోగాల కోత: ఈ ఏడాది ఫైనాన్స్, మానవ వనరుల విభాగాల్లో 2,000 మంది ఉద్యోగులను తొలగించడానికి విమాన తయారీ సంస్థ బోయింగ్ సిద్ధమవుతోంది. అయితే మొత్తం ఉద్యోగుల సంఖ్యను పెంచుకోనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఏడాది చివరకు 15,000 మందిని, వచ్చే ఏడాది మరో 10,000 మందిని నియమించుకోనున్నట్లు వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
Raymond group: రేమండ్ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ సింఘానియా, ఆయన భార్య నవాజ్ మోదీ విడాకుల అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. తాజాగా ఆమెను గ్రూప్నకు చెందిన పలు కంపెనీల నుంచి డైరెక్టర్గా తొలగించారు. -
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
ICICI Credit Cards: కొత్తగా జారీ చేసిన దాదాపు 17 వేల క్రెడిట్ కార్డుల వివరాలు పొరపాటున ఇతరుల ఖాతాలకు అనుసంధానమైనట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 94 పాయింట్ల లాభంతో 74,434 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 22,599 దగ్గర కొనసాగుతోంది. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!