ఒడుదొడుకుల్లో నష్టాలు
రెండు రోజుల వరుస లాభాలకు గురువారం అడ్డుకట్ట పడింది. ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురైంది.
సమీక్ష
రెండు రోజుల వరుస లాభాలకు గురువారం అడ్డుకట్ట పడింది. ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. దీంతో సెన్సెక్స్ మళ్లీ 58000 పాయింట్ల కిందకు చేరింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటను 0.25% పెంచిన నేపథ్యంలో అంతర్జాతీయ సంకేతాలు మిశ్రమంగా మారాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 39 పైసలు పెరిగి 82.20 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు 0.90% తగ్గి 76 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో జపాన్ మినహా మిగతావి రాణించాయి. ఐరోపా సూచీలు నష్టాల్లో కదలాడాయి.
సెన్సెక్స్ ఉదయం బలహీనంగా ప్రారంభమై, ఒకదశలో 57,838.85 వద్ద కనిష్ఠానికి పడిపోయింది. మళ్లీ కోలుకుని లాభాల్లోకి వచ్చిన సూచీ 58,396.17 వద్ద గరిష్ఠానికి చేరింది. మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు రావడంతో చివరకు 289.31 పాయింట్ల నష్టంతో 57,925.28 వద్ద ముగిసింది. నిఫ్టీ 75 పాయింట్లు కోల్పోయి 17,076.90 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 17,045.30- 17,205.40 పాయింట్ల మధ్య కదలాడింది.
* గ్లోబల్ సర్ఫేసెస్ షేరు బీఎస్ఈలో ఇష్యూ ధర రూ.140తో పోలిస్తే 16.42% లాభంతో రూ.163 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 22.25% దూసుకెళ్లి రూ.171.15 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 22.07% పెరిగి రూ.170.90 వద్ద ముగిసింది.
* సెన్సెక్స్ 30 షేర్లలో 17 డీలాపడ్డాయి. ఎస్బీఐ 1.69%, ఏషియన్ పెయింట్స్ 1.49%, కోటక్ బ్యాంక్ 1.49%, హెచ్సీఎల్ టెక్ 1.40%, విప్రో 1.34%, ఇండస్ఇండ్ బ్యాంక్ 1.28%, రిలయన్స్ 1.28%, ఇన్ఫోసిస్ 1.08%, పవర్గ్రిడ్ 0.94% చొప్పున డీలాపడ్డాయి. నెస్లే 1.11%, మారుతీ 1.07%, భారతీ ఎయిర్టెల్ 0.99%, టాఆ మోటార్స్ 0.73% లాభపడ్డాయి. రంగాల వారీ సూచీల్లో స్థిరాస్తి, బ్యాంకింగ్, ఐటీ, ఆర్థిక సేవలు, టెక్ పడ్డాయి. ఎఫ్ఎమ్సీజీ, ఆరోగ్య సంరక్షణ, టెలికాం, యుటిలిటీస్, విద్యుత్ పెరిగాయి. బీఎస్ఈలో 2137 షేర్లు నష్టాల్లో ముగియగా, 1379 స్క్రిప్లు లాభపడ్డాయి. 118 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.
* బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వడ్డీ రేట్ల పెంపు: ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు వరుసగా 11వ సారీ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వడ్డీ రేట్లను పెంచింది. అంతర్జాతీయంగా బ్యాంకింగ్ సంక్షోభం నెలకొన్నా, వడ్డీ రేట్ల పెంపు విషయంలో అమెరికా ఫెడ్ బాటలోనే నడిచింది. తాజాగా వడ్డీ రేట్లను 0.25% పెంచి 4.25% చేసింది.
* ఇన్ఫోసిస్ బోర్డులో స్వతంత్ర డైరెక్టర్గా ఉన్న కిరణ్ మజుందార్ షా పదవీ విరమణ పొందినట్లు కంపెనీ ప్రకటించింది. మార్చి 22న ఆమె పదవీకాలం ముగిసింది. కంపెనీ లీడ్ స్వతంత్ర డైరెక్టర్గా డి.సుందరం నియమితులయ్యారు.
* వాటా విక్రయ వార్తలను అనిల్ అగర్వాల్ నేతృత్వంలోని వేదాంతా కొట్టిపారేసింది. ఈ వార్తలన్నీ అవాస్తమని స్పష్టం చేసింది.
* గుజరాత్లో కొత్త తయారీ కేంద్రాలను రూ.1000 కోట్ల పెట్టుబడితో పెట్టేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో స్పెషాలిటీ రసాయనాల సంస్థ అథెర్ ఇండస్ట్రీస్ ఒప్పందం కుదుర్చుకుంది.
* ఉదయ్శివకుమార్ ఇన్ఫ్రా ఐపీఓ చివరి రోజు ముగిసేసరికి 30.63 రెట్ల స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 2 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా, 61.26 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. ఎన్ఐఐల నుంచి 60.42 రెట్లు, క్యూఐబీల నుంచి 40.47 రెట్లు, రిటైల్ విభాగంలో14.10 రెట్ల స్పందన కనిపించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.