Income tax: డెట్ ఫండ్ మదుపర్లకు పన్ను ప్రయోజనాలు దూరం
డెట్ మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేసే వారికి పన్ను ప్రయోజనాలు దూరం కానున్నాయి. ఈ ఫండ్లు తమ నిర్వహణలో ఉన్న ఆస్తుల్లో (ఏయూఎం) 35 శాతం కన్నా తక్కువగా ఈక్విటీల్లో మదుపు చేస్తే ఇక నుంచి పన్ను పరిధిలోకి రానున్నాయి.
ఆర్థిక బిల్లు-సవరణలు
2023-24 ఏడాదికి అమలు
దిల్లీ: డెట్ మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేసే వారికి పన్ను ప్రయోజనాలు దూరం కానున్నాయి. ఈ ఫండ్లు తమ నిర్వహణలో ఉన్న ఆస్తుల్లో (ఏయూఎం) 35 శాతం కన్నా తక్కువగా ఈక్విటీల్లో మదుపు చేస్తే ఇక నుంచి పన్ను పరిధిలోకి రానున్నాయి. ఈ మేరకు ఆర్థిక బిల్లు 2023కు ప్రభుత్వం సవరణలు చేసింది. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తాయి.
ప్రస్తుతం ఇలా..: ప్రస్తుతం డెట్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టి, మూడేళ్లలోపు వెనక్కి తీసుకుంటే.. స్వల్పకాలిక మూలధన లాభంగా పరిగణిస్తున్నారు. ఇలా వచ్చిన లాభాన్ని మొత్తం ఆదాయంలో కలిపి చూపించి, వర్తించే శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాల్సి వస్తుంది. డెట్ ఫండ్లలో మూడేళ్లకు మించి కొనసాగి, ఆ తర్వాత పెట్టుబడులను వెనక్కి తీసుకుంటే ద్రవ్యోల్బణ సూచీకి సర్దుబాటు చేసి 20 శాతం దీర్ఘకాలిక మూలధన పన్ను (ఎల్టీసీజీ)ను చెల్లిస్తే సరిపోతుంది. సూచీకి సర్దుబాటు చేయకపోతే 10 శాతం పన్ను చెల్లించాలి.
సవరణల వల్ల ఇలా..: ఇప్పుడు చేసిన సవరణల వల్ల డెట్ ఫండ్ మదుపరులకు ఈ దీర్ఘకాలిక పన్ను ప్రయోజనం దూరం కానుంది. నిర్వహణలో ఉన్న ఆస్తుల్లో 35 శాతంకన్నా భారతీయ ఈక్విటీల్లో తక్కువ మదుపు చేసే డెట్ ఫండ్లపై వచ్చిన లాభాలకు వర్తించే శ్లాబును బట్టి, పన్ను చెల్లించాల్సిందే. దీనివల్ల మార్కెట్ ఆధారిత డిబెంచర్లు- మ్యూచువల్ ఫండ్ల మధ్య పన్నులో సమానత్వం రానుంది. ఇక నుంచి ఈక్విటీల్లో 35 శాతం కన్నా తక్కువగా మదుపు చేసే డెట్ ఫండ్లల ద్వారా వచ్చిన లాభాలను ఆదాయంలో కలిపి చూపించి, వర్తించే పన్నును చెల్లించాలి.
బ్యాంకు డిపాజిట్ల వైపు మొగ్గు?: సాధారణంగా అధిక పన్ను శ్లాబులో ఉన్నవారు బ్యాంకు డిపాజిట్లకు బదులు డెట్ ఫండ్లను ఎక్కువగా ఎంచుకుంటారు. మూడేళ్లకు మించి కొనసాగినప్పుడు దీర్ఘకాలిక మూలధన రాబడిపై పన్ను ప్రయోజనం వల్ల వచ్చిన ఆదాయానికి అంతగా పన్ను భారం ఉండేది కాదు. బ్యాంకు డిపాజిట్లపై వచ్చిన వడ్డీకి వర్తించే కాలంతో సంబంధం లేకుండా మొత్తం ఆదాయంలో కలిపి, వర్తించే పన్ను శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాలి. దీనివల్ల చాలామంది డెట్ పథకాల వైపు మొగ్గు చూపేవారు. ఇప్పుడు ఈక్విటీల్లో తక్కువగా పెట్టుబడి పెట్టిన ఫండ్లలో మదుపు చేస్తే, నష్టభయం పెరుగుతుంది. పన్ను పరంగానూ కలిసి రాదు. కాబట్టి, మళ్లీ బ్యాంకు డిపాజిట్లకు ఆదరణ పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
ఆప్షన్ విక్రయాలపై పన్ను పెంపు
ఆప్షన్ల అమ్మకాలకు సంబంధించి ‘సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను(ఎస్టీటీ)’ను పెంచుతున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఆర్థిక బిల్లు సవరణల్లో దీన్ని చేర్చింది. ఇప్పటివరకూ ఆప్షన్ అమ్మకాలపై 0.05 శాతం ఎస్టీటీ ఉండగా, ఇప్పుడు దాన్ని 0.0625 శాతానికి చేర్చింది. అంటే, రూ.లక్ష లావాదేవీకి ఇప్పటి వరకూ రూ.50 పన్ను వర్తించేది. ఏప్రిల్ 1 నుంచి ఇది రూ.62.5గా మారుతుంది.
ఆదాయ పన్ను చెల్లింపుదార్లకు ఊరట
దిల్లీ: కొత్త పన్ను విధానాన్ని ఎంపిక చేసుకున్న పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం కొంత ఊరట కల్పిస్తూ ఆర్థిక బిల్లు 2023లో సవరణలు చేసింది. బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం పన్ను వర్తించే ఆదాయం రూ.7 లక్షల వరకూ ఉన్నప్పుడు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ ఆదాయం రూ. 100 అధికంగా ఉన్నా అంటే.. రూ.7,00,100 ఉన్నా ఆ వ్యక్తి రూ.25,010 వరకూ పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఈ ఇబ్బందిని తొలగిస్తూ కొత్త సవరణ తీసుకొచ్చింది. అయితే, ఈ అదనపు ఆదాయానికి మినహాయింపు ఎంత వరకూ అన్నదానిపై స్పష్టత లేదు. పన్ను నిపుణుల లెక్కల ప్రకారం రూ.7,27,777 వరకూ ఆదాయం ఉన్నా పన్ను భారం ఉండకపోవచ్చు.
* రీట్స్, ఇన్విట్స్లకు ఉపశమనం: శుక్రవారం ప్రతిపాదించిన ఆర్థిక బిల్లులో రీట్స్, ఇన్విట్లకు ఉపశమనం లభించింది. మూలధన ప్రతిఫలాలుగా వ్యాపారాలను పరిగణించనున్నట్లు తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.