రూ.599 పోస్ట్‌పెయిడ్‌పై అపరిమిత డేటా: జియో

కొత్తగా పోస్ట్‌పెయిడ్‌ పథకాలను ప్రారంభించిన రిలయన్స్‌ జియో, అపరిమిత డేటా పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది.

Published : 01 Apr 2023 02:34 IST

హైదరాబాద్‌: కొత్తగా పోస్ట్‌పెయిడ్‌ పథకాలను ప్రారంభించిన రిలయన్స్‌ జియో, అపరిమిత డేటా పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. నెలకు రూ.599 అద్దె చెల్లించే వారికి అపరిమిత కాల్స్‌తో పాటు రోజువారీ 4జీ డేటా అపరిమితంగా వినియోగించుకోవచ్చని తెలిపింది. 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన ప్రాంతాల్లో 5జీ డేటాను కూడా పరిమితి లేకుండా వాడుకోవచ్చు. రోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా ఉచితమని పేర్కొంది. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌ సేవలు కూడా వినియోగించుకోవచ్చు. ప్రీపెయిడ్‌ నుంచి పోస్ట్‌పెయిడ్‌కు మారాలనుకునే వారికి 30 రోజుల పాటు ఈ సేవలు ఉచితమని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని