Gold: పసిడి విక్రయాలు.. అంతంతే
అక్షయ తృతీయ నాడు పసిడిని కొనుగోలు చేస్తే మరింత సంపద జత చేరుతుందన్నది నమ్మకం. తప్పనిసరి అవసరం లేకపోయినా సెంటిమెంటుగా భావించి బంగారు నాణేలు, బిస్కెట్ల రూపంలో మేలిమి బంగారాన్ని పలువురు కొనుగోలు చేస్తుంటారని వ్యాపారులు చెబుతున్నారు.
అక్షయ తృతీయపై అధిక ధర ప్రభావం
తేలికపాటి వస్తువుల కొనుగోలుకే మొగ్గు
ముంబయి: అక్షయ తృతీయ నాడు పసిడిని కొనుగోలు చేస్తే మరింత సంపద జత చేరుతుందన్నది నమ్మకం. తప్పనిసరి అవసరం లేకపోయినా సెంటిమెంటుగా భావించి బంగారు నాణేలు, బిస్కెట్ల రూపంలో మేలిమి బంగారాన్ని పలువురు కొనుగోలు చేస్తుంటారని వ్యాపారులు చెబుతున్నారు. ఈసారి అక్షయ తృతీయ శని, ఆదివారాలు రెండు రోజులు వచ్చింది. కొనుగోలుదార్లు భారీగా దుకాణాలకు తరలి వచ్చినా శనివారం నాడు కొనుగోళ్లు మందకొడిగా సాగాయని విక్రేతలు పేర్కొన్నారు. దీనికి ప్రధాన కారణం పసిడి ధర అధికంగా ఉండటమే అని వారు తెలిపారు.
10 శాతం తగ్గొచ్చు: గత ఏడాది అక్షయ తృతీయ నాటితో పోలిస్తే ఈసారి విక్రయాల పరిమాణం సుమారు 10 శాతం తగ్గే అవకాశం కనిపిస్తోందని వర్తకులు భావిస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి పసిడి ధర సుమారు 20 శాతం మేర పెరిగింది. దీంతో కొనుగోలుదార్లు టోకెన్ కొనుగోళ్లకు లేదా తేలికపాటి వస్తువులను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారని వారు వెల్లడించారు. ఆదివారం నాడు విక్రయాలు పుంజుకుంటాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
1-2 గ్రాముల పసిడి నాణేల కొనుగోలు: శనివారం ఉదయం నుంచే ఆభరణాల రిటైల్ విక్రయశాలలకు కొనుగోలుదార్లు భారీగా తరలి వచ్చినా, తేలికపాటి ఆభరణాలు లేదా 1-2 గ్రాముల పసిడి నాణేలు కొనుగోలు చేశారని ఆభరణాల విక్రేతలు తెలిపారు. ‘ప్రజల నుంచి ఈసారి సానుకూల స్పందన వచ్చింది. దక్షిణాది నుంచి ప్రోత్సాహకరంగా ఉంది. 2-8 గ్రాముల తేలికపాటి ఆభరణాల కొనుగోళ్లకు ఎక్కువ మంది ప్రజలు మొగ్గు చూపారు. హాల్మార్కింగ్ కూడా విక్రయాలకు దన్నుగా నిలిచింద’ని ఆలిండియా రత్నాభరణాల దేశీయ మండలి జీజేసీ ఛైర్మన్ సాయమ్ మెహ్రా వెల్లడించారు. అధిక పసిడి ధర కారణంగా ఈసారి విక్రయాలు పరిమాణం పరంగా 5-7 శాతం తగ్గే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.
20 శాతం పెరిగిన ధర: 24 క్యారెట్ల పసిడి ధర శనివారం 10 గ్రాములు రూ.60,800గా ఉంది. జీఎస్టీతో కలిపి 10 గ్రాముల ధర రూ.61,500. గత ఏడాది అక్షయ తృతీయ నాడు జీఎస్టీతో కలిపి 10 గ్రాముల పసిడి ధర రూ.50,800 మాత్రమే. ‘విక్రయశాలలకు ప్రజలు భారీగా తరలివచ్చారు. టోకెన్ కొనుగోళ్లు ఎక్కువగా జరిగాయి. అధిక ధర వల్ల విక్రయాల పరిమాణం తగ్గింద’ని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) ఇండియా ఎండీ సోమసుందరమ్ పీఆర్ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక