పొరుగుకూ సాయం!

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు రూ.22,154 కోట్లను కేటాయించారు. గత బడ్జెట్‌(రూ.18,050 కోట్లు)తో పోలిస్తే ఈ నిధులు ఎక్కువ. పొరుగు దేశాలతో బంధాన్ని బలోపేతం చేసేందుకు నిర్మలా సీతారామన్‌ ప్రాధాన్యం ఇచ్చారు.

Updated : 02 Feb 2024 05:42 IST

దిల్లీ: విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు రూ.22,154 కోట్లను కేటాయించారు. గత బడ్జెట్‌(రూ.18,050 కోట్లు)తో పోలిస్తే ఈ నిధులు ఎక్కువ. పొరుగు దేశాలతో బంధాన్ని బలోపేతం చేసేందుకు నిర్మలా సీతారామన్‌ ప్రాధాన్యం ఇచ్చారు. మన దేశం అవలంబిస్తున్న ‘పొరుగుకే తొలి ప్రాధాన్యం’ విధానంలో భాగంగా సరిహద్దు దేశమైన భూటాన్‌ అభివృద్ధికి రూ.2,068 కోట్లను కేటాయించారు. మాల్దీవులకు అభివృద్ధి సాయంగా రూ.600 కోట్లను ప్రకటించారు. నేపాల్‌కు రూ.700 కోట్లు, అఫ్గానిస్థాన్‌కు రూ.200 కోట్లు, బంగ్లాదేశ్‌కు రూ.120 కోట్లను అభివృద్ధి సాయంగా కేటాయించారు. ఇరాన్‌తో అనుసంధాన ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టిన కేంద్రం ఆ దేశంలోని చాబహార్‌ పోర్టు నిర్వహణకు రూ.100 కోట్లను ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు