పేటీఎం మీద ఈడీ దర్యాప్తు జరగట్లేదు
ప్రస్తుతమైతే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు జరగడం లేదని రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా తెలిపారు.
రెవెన్యూ కార్యదర్శి స్పష్టత
ఆర్బీఐ నుంచి నివేదిక కోరిన ఈడీ, ఎఫ్ఐయూ
దిల్లీ: ప్రస్తుతమైతే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు జరగడం లేదని రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా తెలిపారు. పేటీఎం మనీల్యాండరింగ్కు పాల్పడినట్లుగా మీడియా కథనాలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ స్పష్టతను ఇవ్వడం గమనార్హం. ‘ఒకవేళ చర్యలు తీసుకోవాల్సి వస్తే.. ఎన్ఫోర్స్మెంట్ సంస్థలు తీసుకుంటాయి. ప్రస్తుతానికి అటువంటిదేమీ జరగడం లేద’ని ఓ ఆంగ్ల వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మల్హోత్రా తెలిపారు. పేటీఎం కూడా తమపై వచ్చిన మనీలాండరింగ్ ఆరోపణలను తోసిపుచ్చుతూ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. మరో వైపు, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)పై తాజాగా విధించిన ఆంక్షలకు సంబంధించిన నివేదికను ఇవ్వాల్సిందిగా ఆర్బీఐను ఈడీ, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ)లు కోరాయి. ఈ నివేదిక ఆధారంగా పీపీబీఎల్పై దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఉందా? లేదా అనే విషయాన్ని పరిశీలిస్తామని ఈడీ తెలిపినట్లు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చర్చలు: ఆర్బీఐ విధించిన ప్రస్తుత ఆంక్షల నుంచి బయటపడేందుకు పేటీఎం మార్గాలను అన్వేషిస్తున్న నేపథ్యంలో ఆ సంస్థతో హెచ్డీఎఫ్సీ బ్యాంకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
వాటాలు పెంచుకున్నాక.. పతనం: డిసెంబరు త్రైమాసికంలో పేటీఎమ్లో దేశీయ మ్యూచువల్ ఫండ్ల వాటా అంతకుముందు త్రైమాసికంలోని 2.79 శాతం నుంచి 4.99 శాతానికి పెరిగింది. ఎఫ్ఐఐల వాటా 2.8 శాతం మేర పెరిగి 63.72 శాతానికి, చిన్న మదుపర్ల వాటా 4.57 శాతం మేర పెరిగి 12.85 శాతానికి చేరింది. ఇలా వీళ్లు వాటాలను పెంచుకున్నాక నెలల వ్యవధిలోనే పేటీఎం షేర్లు భారీగా పతనమవ్వడం గమనార్హం. ఈ ప్రభావం చిన్న మదుపర్లపై ఎక్కువగానే కనిపించింది. ఇలాంటి వారి సంఖ్య సుమారు 11 లక్షల మంది ఉండొచ్చని అంచనా.
పీపీబీఎల్పై ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో వినియోగదారులు ఇతర పేమెంట్ యాప్లైన ఫోన్ పే, భీమ్-యూపీఐ, గూగుల్ పే వైపు మొగ్గుచూపుతున్నారు. ఫిబ్రవరి 3వ తేదీ ఒక్కరోజే ‘ఫోన్ పే’ను 2.79 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నట్లు ‘యాప్ ఫిగర్స్’ వెల్లడించింది.
పుంజుకున్న పేటీఎం షేర్లు: వరుస మూడు రోజుల పతనం అనంతరం పేటీఎం షేర్లు పుంజుకున్నాయి. బీఎస్ఈలో 3.02% లాభంతో రూ.451.60 వద్ద ముగిసింది. గత మూడు ట్రేడింగ్ రోజుల్లో పేటీఎం షేరు 42% మేర పతనమై, రూ.20,471.25 కోట్ల మేర మార్కెట్ విలువ ఆవిరయ్యింది. అయితే షేరు పుంజుకోవడంతో రూ.822.78 కోట్ల మార్కెట్ విలువ పెరిగింది.
చిన్న మదుపర్లు కొనుగోళ్లకు దూరంగా ఉండాలి
పేటీఎం షేరు ఒకవేళ పుంజుకున్నప్పటికీ... కంపెనీపై నియంత్రణపరమైన అనిశ్చితుల కారణంగా మున్ముందు ఎంత మేర షేరు పెరుగుతుందనే విషయంపై ప్రస్తుతానికి ఎలాంటి అంచనాకు విశ్లేషకులు రాలేకపోతున్నారు. ఐపీఓ ధరతో (రూ.2,150) పోలిస్తే ప్రస్తుతం పేటీఎం షేరు 75 శాతం మేర పతనమైంది. పేటీఎం షేర్లు భారీగా పతనమైన నేపథ్యంలో తక్కువ స్థాయిల వద్ద షేరును కొనుగోలు చేసే విషయంలో చిన్న మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. పూర్తి స్పష్టత వచ్చే వరకు షేరుకు దూరంగా ఉండటమే మేలని చెబుతున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నవ లిమిటెడ్.. రుణ రహితం
ఫెర్రో అల్లాయ్స్, మైనింగ్, విద్యుదుత్పత్తిలో నిమగ్నమై ఉన్న నవ లిమిటెడ్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.951.6 కోట్ల ఆదాయాన్ని, రూ.255.1 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వసూళ్లు 27%.. వదులుకుంది 73%
నిరర్థక ఆస్తులుగా మారిన రుణాల నుంచి వసూళ్లకు చేపట్టిన దివాలా పరిష్కార ప్రక్రియ, ఆర్థిక సంస్థలకు ఎంతగా ఉపయోగ పడుతోందో ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. -
నలుపు రంగులో అపాచీ ఆర్టీఆర్ 160
టీవీఎస్ మోటార్ తన ‘అపాచీ 160 ఆర్టీఆర్’ బైక్లో బ్లాక్ డార్క్ ఎడిషన్ (నలుపు రంగు)ను తీసుకొచ్చింది. -
టీవీ ఛానళ్లతో పాటు ఓటీటీ ప్రసారాలూ.. స్మార్ట్ ప్లస్ను ఆవిష్కరించిన డిష్ టీవీ
టీవీ ఛానళ్లతోపాటు, ఓటీటీ ప్రసారాలూ అందించే స్మార్ట్ ప్లస్ సేవలు ప్రారంభిస్తున్నట్లు డైరెక్ట్-టు-హోమ్ సేవలను అందించే డిష్ టీవీ ప్రకటించింది. -
2031కి రిటైల్ విపణి రెట్టింపు
భారత వినియోగ వస్తు- సేవల విపణి 2031 కల్లా రెట్టింపు కావొచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. -
మదుపర్ల సంపద రూ.410 లక్షల కోట్లకు
వరుసగా రెండో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. ఎం అండ్ ఎం, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. అయితే విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగడంతో లాభాలు పరిమితమయ్యాయి. -
ప్రస్తుత కంపెనీలకూ ప్రోత్సాహకాలు!
విద్యుత్ వాహన (ఈవీ) నూతన విధానాన్ని అనుసరించి, పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న సంస్థలకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేయనుంది. -
విదేశీ ఫండ్ల ఆస్తుల్లో 20% వరకే మన మార్కెట్లకు! : సెబీ ప్రతిపాదన
మ్యూచువల్ ఫండ్లలో విదేశీ పెట్టుబడులను మరింత సులభతరం చేసే దిశగా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కొన్ని చర్యలను ప్రతిపాదించింది. -
కియా కార్లు అద్దెకూ తీసుకోవచ్చు.. హైదరాబాద్ సహా 6 నగరాల్లో
కారు కొంటే బీమా - నిర్వహణ ఖర్చుల వంటివి తప్పవు. మరో కొత్త మోడల్ కొనుగోలుకు పాత కారు విక్రయించాలంటే తగిన ధర వస్తుందో రాదో అనే బెంగ ఒకటి. -
సంక్షిప్త వార్తలు(5)
కేన్సర్ వ్యాధి చికిత్సలో వినియోగించే కాబోజాంటినిబ్ ట్యాబ్లెట్లను హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎంఎస్ఎన్ ల్యాబ్స్ ఉత్పత్తి చేసి, జైడస్ లైఫ్సైన్సెస్కు సరఫరా చేయనుంది. -
ఇక కంటితోనే స్క్రీన్ను ఆపరేట్ చేసేలా: త్వరలో యాపిల్ కొత్త ఫీచర్లు
Apple: దివ్యాంగులు కూడా ఐఫోన్, ఐప్యాడ్లను సులువుగా వినియోగించేందుకు వీలుగా యాపిల్ కొత్త ఫీచర్లును త్వరలోనే తీసుకురానున్నట్లు వెల్లడించింది. -
ఆరోగ్యకరమైన ఆహారం.. జొమాటోలో కొత్త ఫీచర్
Zomato: జొమాటోలో కొత్త ఫీచర్ని తీసుకొచ్చినట్లు కంపెనీ సీఈఓ దీపిందర్ గోయల్ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. ఇంతకీ ఆ ఫీచర్ ఎలా ఉపయోగపడనుందంటే..
తాజా వార్తలు (Latest News)
-
కియా కార్లు అద్దెకూ తీసుకోవచ్చు.. హైదరాబాద్ సహా 6 నగరాల్లో
-
చివరి మ్యాచ్లో ముంబయిపై లఖ్నవూ గెలుపు.. టోర్నీ నుంచి నిష్క్రమించిన ఇరు జట్లు
-
హైదరాబాద్ మెట్రో రైలు సమయం పొడిగింపు
-
మరో 30 ఏళ్లకు మనం అంగారకుడి సిటీలో: ఎలాన్ మస్క్ ఆసక్తికర పోస్ట్
-
గాల్లో ఉండగా విమానం ‘ఏసీ’లో మంటలు.. అత్యవసర ల్యాండింగ్!
-
48 గంటల్లో పోలింగ్ శాతాలపై.. ఈసీ స్పందన కోరిన సుప్రీంకోర్టు