ఎల్ఐసీ బ్రాండ్కు తిరుగులేదు
ప్రపంచవ్యాప్తంగా బలమైన బీమా సంస్థల బ్రాండ్లలో, భారత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) అగ్రస్థానంలో నిలిచింది.
బలమైన బీమా సంస్థల్లో ప్రపంచంలోనే నం.1
విలువ పరంగా చైనా కంపెనీల ఆధిపత్యం
బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ 100 నివేదిక
దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా బలమైన బీమా సంస్థల బ్రాండ్లలో, భారత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) అగ్రస్థానంలో నిలిచింది. 2024 ఏడాదికి విడుదల చేసిన ‘బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ 100’ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ఎల్ఐసీ బ్రాండ్ విలువ 9.8 బిలియన్ డాలర్లు (సుమారు రూ.81,500 కోట్లు)గా స్థిరంగా కొనసాగుతోందని.. అయితే బ్రాండ్ స్ట్రెంత్ ఇండెక్స్ స్కోరు 88.3తో, బ్రాండ్ స్ట్రెంత్ రేటింగ్ ‘ఏఏఏ’తో అన్ని కంపెనీల కంటే ఎల్ఐసీ ముందు నిలిచిందని తెలిపింది.
- బలమైన బీమా బ్రాండ్లలో ఎల్ఐసీ తర్వాతి స్థానంలో కాథే లైఫ్ ఇన్సూరెన్స్ నిలిచింది. ఇది 9% వృద్ధితో 4.9 బిలియన్ డాలర్ల (సుమారు రూ.40,700 కోట్ల) బ్రాండ్ విలువను నమోదు చేసింది.
- చైనా బీమా బ్రాండ్లు అంతర్జాతీయ ర్యాంకింగ్లో ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి. విలువపరంగా అవే పైస్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా పింగ్ యాన్ బ్రాండ్ విలువ 4% పెరిగి 33.6 బి. డాలర్ల (సుమారు రూ.2.80 లక్షల కోట్ల)కు చేరడంతో ప్రపంచంలోనే అత్యంత విలువైన బీమా బ్రాండ్గా నిలిచింది. మూడు, అయిదు స్థానాల్లోనూ చైనాకే చెందిన చైనా లైఫ్ ఇన్సూరెన్స్, సీపీఐసీ ఉన్నాయి.
- ఈ జాబితాలో 2, 4 స్థానాలను జర్మనీకి చెందిన అలయంజ్, ఫ్రాన్స్కు చెందిన యాక్సా సొంతం చేసుకున్నాయి.
- అత్యంత వేగవంతమైన వృద్ధిని కనబరచిన వాటిల్లో ఆస్ట్రేలియాకు చెందిన ఎన్ఆర్ఎమ్ఏ ఇన్సూరెన్స్ ఉంది. ఈ సంస్థ బ్రాండ్ విలువ ఏకంగా 82% వృద్ధితో 1.3 బి. డాలర్లకు చేరింది. డెన్మార్క్కు చెందిన ట్రైజీ బ్రాండ్ విలువ 66% పెరిగి 1.6 బి. డాలర్లకు చేరింది.
అత్యధిక తొలి ఏడాది ప్రీమియం: 2022-23లో ఎల్ఐసీ అత్యధిక తొలి ఏడాది ప్రీమియం వసూళ్లు రూ.39,090 కోట్లను నమోదు చేసింది. ఈ విషయంలో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ వరుసగా రూ.15,197 కోట్లు, రూ.10,970 కోట్లు నమోదు చేశాయి. ఇటీవలి కాలంలో ఎల్ఐసీ షేరు జీవనకాల గరిష్ఠమైన రూ.1175కు చేరడంతో, భారత్లోనే అత్యంత విలువైన ప్రభుత్వ రంగ కంపెనీగా అవతరించింది. 2022 ఆగస్టు నుంచి అమల్లోకి వచ్చేలా ఎల్ఐసీ ఉద్యోగులకు 17% వేతన సవరణకు ప్రభుత్వం ఇటీవలే ఆమోదం తెలిపిన విషయమూ విదితమే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
గూగుల్లో ఉద్యోగం మొదలుపెట్టి 20 ఏళ్లు అయిందని సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai) వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టు పెట్టారు. -
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
రోడ్డుపై పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: అమెరికా కారు ప్రమాదంలో 3 భారతీయులు దుర్మరణం
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం