Jio: ప్రపంచవ్యాప్తంగా జియోను విస్తరించే ఆలోచనలున్నాయ్: కంపెనీ అధ్యక్షుడు
Jio: ప్రపంచ విపణిలోకి ప్రవేశించేందుకు ఇప్పుడు భారత్కు మెరుగైన అవకాశాలు ఉన్నాయని రిలయన్స్ జియో అధ్యక్షుడు మాథ్యూ ఊమెన్ తెలిపారు. ఈ క్రమంలో భారత్ను ప్రపంచ వేదికపై రిప్రజెంట్ చేసేందుకు ఉన్న అవకాశాలను రిలయన్స్ నిరంతరం కొనసాగిస్తుందని పేర్కొన్నారు.
దిల్లీ: భారత్లో విజయవంతమైన రిలయన్స్ జియో (Reliance Jio)ను ప్రపంచవ్యాప్తంగానూ తీసుకెళ్లే ఆలోచన ఉందని కంపెనీ అధ్యక్షుడు మాథ్యూ ఊమెన్ వెల్లడించారు. భారత్ ఇప్పుడు టైర్-1 ప్లస్ దేశమని.. ప్రపంచ విపణిలోకి ప్రవేశించేందుకు మెరుగైన అవకాశాలు ఉన్నాయన్నారు. భారత్ను ప్రపంచ వేదికపై రిప్రజెంట్ చేసేందుకు ఉన్న అవకాశాలను అన్వేషించడం రిలయన్స్ (Reliance) నిరంతరం కొనసాగిస్తుందని తెలిపారు. తద్వారా భారత్లో అమలు చేసి నిర్వహిస్తున్న సాంకేతిక సామర్థ్యాలను ప్రపంచవ్యాప్తంగానూ కస్టమర్లకు అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
డిజిటల్ ఇండియా విజన్ను మరింత విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలంటే ‘యూనివర్సల్ సర్వీసెస్ ఆబ్లిగేషన్ ఫండ్ (USOF)’ను కేవలం టవర్ల ఏర్పాటుకు మాత్రమే ఉపయోగించొద్దని ఊమెన్ సూచించారు. డివైజ్లు, సేవలను మరింత అందుబాటు ధరలో యూజర్లకు చేరువ చేసేందుకు కూడా ఆ నిధులను వాడాలని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వం టెలికాం కంపెనీల ఆదాయం నుంచి ఎనిమిది శాతం లైసెన్స్ ఫీజు కింద వసూలు చేస్తోంది. దీంట్లో ఐదు శాతం నిధులను యూఎస్ఓఎఫ్ కింద పక్కకు తీస్తోంది. దీన్ని మారుమూల ప్రాంతాల్లో టెలికాం కనెక్టివిటీని పెంచడం కోసం ఉపయోగిస్తోంది.
యూఎస్ఓఎఫ్ (USOF) కోసం వసూలు చేస్తున్న ఐదు శాతం ఫీజును పూర్తిగా తొలగించాలని ఊమెన్ కోరారు. లైసెన్స్ ఫీజు కింద మూడు శాతం నిధులను మాత్రమే వసూలు చేయాలని సూచించారు. తద్వారా టెలికాం సంస్థలకు మిగిలే నిధులను అవి నిరంతర పెట్టుబడుల కింద ఉపయోగించుకుంటాయని తెలిపారు. ఫలితంగా కేవలం కనెక్టివిటీని పెంచడమే కాకుండా యూజర్లను 4జీ నుంచి 5జీకి మార్చేందుకు తోడ్పాటునందించొచ్చన్నారు. ఏ సేవలనైనా విస్తరించేందుకు డివైజ్లు చాలా కీలకమని వివరించారు. తాము అత్యంత అందుబాటు ధరలో 4జీ డివైజ్ను తీసుకొచ్చామని.. తద్వారా 4జీ వేగంగా విస్తరించిందన్నారు. అలాగే 5జీ డివైజ్లను రూ.10 వేల ధరలో తీసుకొస్తున్నామని.. 5జీ నెట్వర్క్ కూడా వేగంగా విస్తరిస్తోందన్నారు. 24 కోట్ల 2జీ యూజర్లను కొత్తతరం నెట్వర్క్లలోకి తీసుకురావడం చాలా కీలకమని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
-
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
-
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
-
ఆదుకుంటానన్నావ్.. పీల్చి పిప్పి చేశావ్!!
-
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్