Lay offs: ‘అమ్మా.. ఆఫీసుకు వెళ్లడం లేదేం?’ అని అడిగితే ఏం చెప్పాలి?: ఉద్యోగిని ఆవేదన
ప్రముఖ టెక్సంస్థ గూగుల్ (Google)లో కోతలు మొదలయ్యాయి. గుడ్గావ్లో క్లౌడ్ ప్రోగ్రాం మేనేజర్గా పని చేస్తున్న వాలియాకు (Walia) యాక్సెస్ డినైడ్ అని మెసేజ్ డిస్ప్లే అవ్వడంతో ఆమె కంగుతిన్నారు.
ఇంటర్నెట్డెస్క్: టెక్ కంపెనీల్లోని ఉద్యోగుల (Tech Employees) జీవితాలు కత్తిమీదసాములా తయారయ్యాయి. ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో? ఎప్పుడు ఊడుతుందో (Lay offs) తెలియడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా 12 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించిన టెక్ దిగ్గజం గూగుల్ (Google) తాజాగా చర్యలకు ఉపక్రమించింది. దీంతో ఉద్యోగులు సామాజిక మాధ్యమాల (Social Media) వేదికగా తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. గుడ్గావ్లో గూగుల్ క్లౌడ్ ప్రోగ్రాం మేనేజర్గా పని చేస్తున్న వాలియా (Walia) అనే ఉద్యోగిని కంప్యూటర్ ఆన్ చేసి లాగిన్ అవ్వగానే ‘యాక్సెస్ డినైడ్’ అనే మెసేజ్ డిస్ప్లే అవ్వడంతో కంగుతిన్నారు. ఇదే విషయాన్ని బాస్ దృష్టికి తీసుకెళ్తే.. ఉద్యోగం నుంచి తొలగించినట్లు చెబుతూ వచ్చిన మెయిల్ చెక్ చేసుకోమని అన్నారు. ఆమె సంస్థలో చేరి ఇటీవలే 5 ఏళ్లు పూర్తయిందట. అంతలోనే ఆమెను ఉద్యోగం నుంచి తొలగించడంతో ఉద్వేగానికి గురయ్యారు. కొత్త ఉద్యోగం కోసం లింక్డిన్లో ప్రయత్నాలు మొదలు పెట్టారు.
‘‘నేను సంస్థలో చేరి ఇటీవలే 5 ఏళ్లు పూర్తయింది. సహచరులంతా పార్టీ చేసుకున్నాం. అయితే, ఆ సంస్థలో అదే చివరి పార్టీ అవుతుందని నేను ఊహించలేదు. మీటింగ్ మరో 10 నిమిషాలు ఉందనగా.. కంప్యూటర్ ఆన్ చేసి.. లాగిన్ కావడానికి ప్రయత్నించా. వెంటనే యాక్సిస్ డినైడ్ అని మెసేజ్ వచ్చింది. మళ్లీ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది’’ అంటూ వాలియా రాసుకొచ్చారు. గూగుల్లో పని చేయడమన్నది తన కల అని చెప్పిన ఆమె...అందులో ఉద్యోగం సంపాదించడంతో ఉబ్బితబ్బిబ్బయిపోయానని అంతలోనే ఆశలన్నీ ఆవిరైపోయాయని చెప్పుకొచ్చారు. ‘‘ నా కల నిజమైందనుకున్నా. ఇక్కడ గడిపిన ప్రతిక్షణం నా ఊహకు మించే ఉంది. లింక్డిన్లో నా రెజ్యూమే, ప్రొఫైల్ని అప్డేట్ చేసిన తర్వాత ఈ సంస్థ నాలో ఎంతగా కలిసిపోయిందో అర్థమైంది. గూగుల్లో గత ఐదేళ్లలో నా కెరీర్లో అత్యంత విలువైన సమయాన్ని గడిపాను. విభిన్న రోల్స్లో పని చేస్తూ ఎంతో అనుభవాన్ని, నైపుణ్యాన్ని పెంపొందించుకున్నాను. ఎంతోమంది అద్భుతమైన వ్యక్తులతో కలిసి పని చేసే అవకాశాన్ని ఇచ్చినందుకు గూగుల్కు ధన్యవాదాలు’’ అంటూ ఆమె రాసుకొచ్చారు.
ఎక్కడైనా ఉద్యోగ అవకాశాలు ఉంటే చెప్పాల్సిందిగా లింక్డిన్లో ఆమె అభ్యర్థించారు. ‘‘ఇకపై నా పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం కావడం లేదు. అమ్మా.. ఎందుకు డ్యూటీకి వెళ్లడం లేదని నా ఆరేళ్ల కూతురు అడుగుతుంటే.. నేనేం సమాధానం చెప్పాలి. నేనేం చెప్పినా ఇప్పుడు ఆమెకు అర్థం కాదు. అమెకు అర్థమయ్యేలా చెప్పాలంటే.. ఇంకొంత సమయం పడుతుంది’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రముఖ టెక్ కంపెనీల్లో గత కొన్ని నెలలుగా ఉద్యోగాల కోతలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మైక్రోసాఫ్ట్, మెటా,ట్విటర్, అమెజాన్ వంటి సంస్థలు కూడా భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. ఈ నేపథ్యంలోనే ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ప్రపంచవ్యాప్తంగా 12 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఇటీవల గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు. ఈ క్రమంలోనే తాజాగా చర్యలు మొదలైనట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 94 పాయింట్ల లాభంతో 74,434 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 22,599 దగ్గర కొనసాగుతోంది. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం