LIC: లిస్టింగ్ తర్వాత మొదటిసారి.. ఎల్ఐసీ షేర్ 10% జంప్
LIC: ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ షేరు ఒక రోజులోనే 10శాతం పెరిగింది. మార్కెట్లో లిస్టయినప్పటి నుంచి స్టాక్లో ఈమేర వృద్ధి నమోదవ్వటం ఇదే మొదటిసారి.
ఇంటర్నెట్డెస్క్: ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ (LIC) షేరు శుక్రవారం రికార్డు స్థాయిలో పెరిగింది. మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత ఎల్ఐసీ షేరు విలువ ఒక రోజులో 10 శాతం పెరగటం ఇదే మొదటిసారి. అంతేకాదు రెండు నెలల గరిష్ఠానికి చేరింది. ఎల్ఐసీతో పాటూ ప్రభుత్వ రంగానికి చెందిన బీమా కంపెనీల షేర్లు అప్పర్ సర్క్యూట్ను తాకాయి. జనరల్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా షేరు విలువ 18 శాతం పెరగ్గా.. న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ షేరు 20 శాతం మేర పెరిగింది.
ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధి సాధించాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ఛైర్మన్ సిద్ధార్థ మొహంతి ప్రకటించారు. కొత్త వ్యాపార ప్రీమియంలో వృద్ధి సాధించటంలో భాగంగా రానున్న నెలల్లో 3-4 కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. డిసెంబరు మొదటి వారంలోనే తొలి ఉత్పత్తిని ఆవిష్కరిస్తామన్నారు. ఈ ఉత్పత్తిలో రుణ సదుపాయం, ముందస్తు ఉపహరణకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ ప్రకటన నేపథ్యంలోనే ఎల్ఐసీ షేరు అమాంతం పెరిగింది. ఈ రోజు మార్కెట్ ముగిసే సమయానికి షేరు 9.71 శాతం పెరిగి రూ.677.70కు చేరింది. షేరు విలువ రెండు నెలల గరిష్ఠాన్ని తాకింది.
ఎన్నికల వేళ హెలికాప్టర్లకు డిమాండ్.. గంటకు లక్షల్లోనే!
స్టాక్ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద ఐపీఓగా.. ఎల్ఐసీ నిలిచింది. అయితే షేరు ఇష్యూ ధర రూ.949తో పోలిస్తే 8.11 శాతం నష్టంతో రూ.872 వద్ద లిస్టయ్యింది. అప్పటి నుంచి స్టాక్ పడిపోతూనే వచ్చింది. 2023 మార్చి 23 నాటికి కనిష్ఠంగా రూ.530.05కి పడిపోయింది. ఆ తర్వాత కాస్త పుంజుకున్నప్పటికీ ఇష్యూ ధర కంటే తక్కువకే ట్రేడయింది. ఇటీవల వెలువడిన రెండో త్రైమాసిక ఫలితాల్లోనూ ఎల్ఐసీ నికర లాభం భారీగా క్షీణించింది. ఈ క్రమంలో ఛైర్మన్ నుంచి వెలువడిన ప్రకటన ఎల్ఐసీ షేరుకు ఊపిరులూదింది. అయితే ఎల్ఐసీ షేరు.. ఇష్యూ ధర రూ.949తో పోలిస్తే ఇప్పటికీ చాలా దూరంలోనే ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 74,000 ఎగువన సెన్సెక్స్
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 202 పాయింట్ల లాభంతో 74,080 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు పుంజుకొని 22,511 దగ్గర కొనసాగుతోంది. -
లేని సీట్లను అమ్మి.. రూ.550 కోట్ల ఫైన్ కట్టి.. ఓ విమానయాన సంస్థ నిర్వాకం!
Qantas: కాంటాస్ అనే ఆస్ట్రేలియా విమానయాన సంస్థ క్యాన్సిల్ అయిన విమానాల్లోని సీట్లను విక్రయించింది. దీన్ని తీవ్రంగా తప్పుబట్టిన అక్కడి నియంత్రణా సంస్థ రూ.550 కోట్ల జరిమానా విధించింది. -
3 ఐపీఓలు.. రూ.6,400 కోట్ల లక్ష్యం
ఈ వారం మూడు కంపెనీల తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)లు మార్కెట్లో సందడి చేయనున్నాయి. రూ.6,400 కోట్ల సమీకరించే లక్ష్యంతో ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండీజీన్, టీబీఓ టెక్ ఐపీఓలు వస్తున్నాయి. -
లాభాలకే అవకాశం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత శుక్రవారం సూచీలు భారీగా నష్టపోయినా, అది తాత్కాలికమేనని.. సూచీలు అధిక స్థాయులకు చేరాయనే భావనతో, లాభాల స్వీకరణకు దిగడం వల్లే ఆ పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
పసిడిలో లాభాల స్వీకరణ!
పసిడి ఇటీవల రూ.73,925 వద్ద గరిష్ఠాన్ని తాకిన తర్వాత లాభాల స్వీకరణ కనిపిస్తోంది. ఇదే ధోరణి కొనసాగితే జూన్ కాంట్రాక్టు ఈ వారం రూ.69,418 వరకు పడిపోవచ్చు. -
75,100 పైన మరిన్ని సానుకూలతలు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో గత వారం సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. దేశీయ కంపెనీల త్రైమాసిక ఫలితాలు, ముడిచమురు ధరలు చల్లపడటం కలిసొచ్చాయి. -
పురుగు మందుల అవశేషాలపై భారత్లో కఠిన నిబంధనలు: ప్రభుత్వం
ఆహార పదార్థాల్లో పురుగు మందుల అవశేషాల విషయంలో.. భారత్ అత్యంత కఠినమైన నిబంధనలను కలిగి ఉందని ప్రభుత్వం ఆదివారం పునరుద్ఘాటించింది. -
గృహ రుణ బకాయిలు పెరిగాయ్: ఆర్బీఐ
గృహ నిర్మాణ రంగానికి బకాయిపడిన రుణాలు గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో సుమారు రూ.10 లక్షల కోట్లు పెరిగి ఈ ఏడాది మార్చి నాటికి రికార్డు స్థాయిలో రూ.27.23 లక్షల కోట్లకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన డేటా వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 74,000 ఎగువన సెన్సెక్స్
-
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
-
లేని సీట్లను అమ్మి.. రూ.550 కోట్ల ఫైన్ కట్టి.. ఆస్ట్రేలియా విమానయాన సంస్థ నిర్వాకం!
-
‘వచ్చేది వైకాపా ప్రభుత్వమే... మాట వినకపోతే చంపేస్తా’
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
పెళ్లైన నాలుగు రోజులకే.. నవ వధువును ఇంటికి పంపిన వరుడు