Maruti: ₹45 వేల కోట్ల పెట్టుబడులు.. 28 కొత్త మోడళ్లు.. మారుతీ భారీ ప్రణాళిక
Maruti: వచ్చే ఎనిమిదేళ్ల ప్రణాళికను మారుతీ సుజుకీ తమ వార్షిక సాధారణ సమావేశంలో ఆవిష్కరించింది. వివిధ రకాల ఇంధనాలతో నడిచే వాహనాలను తీసుకురానున్నట్లు తెలిపింది.
దిల్లీ: వచ్చే ఎనిమిదేళ్లలో తమ వార్షిక తయారీ సామర్థ్యాన్ని 40 లక్షల యూనిట్లకు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు మారుతీ సుజుకీ (Maruti Suzuki) ఇండియా ఛైర్మన్ ఆర్.సి.భార్గవ తెలిపారు. అందుకోసం రూ.45,000 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు చెప్పారు. అలాగే స్టాక్ విభజనపై వాటాదారుల సలహాలను స్వీకరించనున్నట్లు వెల్లడించారు. వార్షిక సాధారణ సమావేశంలో మాట్లాడుతూ మంగళవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచవ్యాప్తంగా తటస్థ కర్బన ఉద్గారాలపై దృష్టి సారించిన నేపథ్యంలో తమ కంపెనీ (Maruti Suzuki) రాబోయే రోజుల్లో వివిధ రకాల ఇంధన ఆధారిత వాహనాలను తీసుకురానున్నట్లు భార్గవ తెలిపారు. విద్యుత్ (Electrical Vehicles), హైబ్రిడ్, సీఎన్జీ, ఇథనాల్ సహా కంప్రెస్డ్ బయోగ్యాస్తో నడిచే వాహనాలను తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. వచ్చే 8-10 సంవత్సరాల్లో సాంకేతికంగా రాబోతున్న మార్పులను అంచనా వేయడం కష్టమని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే వివిధ రకాల ఇంధనాలతో నడిచే వాహనాలను ప్రయత్నించనున్నట్లు తెలిపారు.
40 ఏళ్లలో కంపెనీ రెండు మిలియన్ల యూనిట్ల విక్రయాలను అందుకుందని భార్గవ తెలిపారు. వచ్చే ఎనిమిదేళ్లలో మరో రెండు మిలియన్ల లక్ష్యాన్ని అందుకోనున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో 28 రకాల కొత్త మోడళ్లను తీసుకురానున్నట్లు తెలిపారు. భవిష్యత్ అవకాశాలను దృష్టిలో ఉంచుకొని కంపెనీని పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కంపెనీ షేరు విలువ దాదాపు రూ.10 వేలకు చేరిన నేపథ్యంలో స్టాక్ విభజన అంశాన్ని బోర్డు దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. 2024- 25 నుంచి 2030- 31 మధ్య ఆరు విద్యుత్ మోడళ్లను తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. కంపెనీ స్టాక్ మంగళవారం 0.39 శాతం పుంజుకొని రూ.9,634 దగ్గర స్థిరపడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
Elon Musk: దాదాపు వారం క్రితం ఎలాన్ మస్క్ భారత పర్యటనను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఆకస్మికంగా చైనాలో పర్యటిస్తున్నట్లు సంబంధిత వ్యక్తులు తెలిపారు. -
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
BSNL Cinemaplus: బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ పేరిట ఓటీటీ ప్యాకేజీలను అందిస్తోంది. దీంట్లో మొత్తం మూడు ప్యాక్లు ఉన్నాయి. తాజాగా స్టార్టర్ ప్యాక్ ధరను సంస్థ కుదించింది. -
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
వేసవిలో స్మార్ట్ఫోన్ ఛార్జింగ్లో వేగం మందగిస్తుంది. దీనికి కారణమేంటి? ఎందుకు వేగం తగ్గుతుంది? -
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
జాక్స్, కోహ్లీ విధ్వంసం.. బెంగళూరు ఘన విజయం
-
చీరలో మెరిసిన అందాల ‘రాశి’.. కాలేజీ ఈవెంట్లో మాళవిక సందడి
-
₹602 కోట్ల డ్రగ్స్ పట్టివేత.. 14 మంది పాకిస్థానీయుల అరెస్టు
-
ఈ పానీపూరీ ‘మోదీ’ చాలా నీట్ గురూ!
-
మే నెల పింఛను సొమ్ము లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!