Gofirst crisis: గోఫస్ట్ ఆరోపణలపై ప్రాట్ అండ్ విట్నీ కౌంటర్..!
Gofirst crisis: ప్రాట్ అండ్ విట్నీ సంస్థ ఇంజిన్లు సకాలంలో సరఫరా చేయకపోవడంతో తమకు ఆర్థిక కష్టాలు ఎదురయ్యాయంటూ గోఫస్ట్ చేసిన ఆరోపణలను ఆ సంస్థ ఖండించింది.
ఇంటర్నెట్డెస్క్: బడ్జెట్ ధరలో విమాన సేవలు అందించే గోఫస్ట్ (Gofirst) విమాన సంస్థను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. దీంతో మూడు రోజుల పాటు సర్వీసులను నిలిపివేసింది. స్వచ్ఛంద దివాలా ప్రక్రియ కోసం ఎన్సీఎల్టీని (NCLT) ఆశ్రయించింది. అమెరికాకు చెందిన ప్రాట్ అండ్ విట్నీ (P&W) సంస్థ సకాలంలో ఇంజిన్లను సరఫరా చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని గోఫస్ట్ ఆరోపించింది. ఈ ఆరోపణలను పీడబ్ల్యూ సంస్థ ఖండించింది. తమకు గోఫస్ట్ సంస్థ సకాలంలో చెల్లింపులు చేయని దాఖలాలు చాలా ఉన్నాయని తెలిపింది.
‘‘ప్రాట్ అండ్ విట్నీ సంస్థ ఎయిర్లైన్ కస్టమర్ల విజయానికి కట్టుబడి ఉంటుంది. మేం కస్టమర్లందరికీ డెలివరీ షెడ్యూల్ల విషయంలో ప్రాధాన్యతనిస్తూనే ఉన్నాం. గో ఫస్ట్కి సంబంధించిన మార్చి 2023 మధ్యవర్తిత్వ తీర్పును మా సంస్థ పాటిస్తోంది. ఇది న్యాయస్థానం పరిధిలో ఉన్నందున ఇంతకుమించి మేం ఏమీ మాట్లాడబోం’’ అని ప్రకటనలో పేర్కొంది. చెల్లింపుల వివరాలను మాత్రం ఆ సంస్థ వెల్లడించలేదు.
ఇంజిన్ల సమస్యలతో గోఫస్ట్ సంస్థ 57 విమానాల్లో 28 కార్యకలాపాలు ఆపేయడంతో ఆర్థిక సమస్యలు తీవ్రమయ్యాయి. ఫలితంగా ఈ నెల 3, 4 తేదీల్లో సర్వీసులను నిలిపి వేయడంతో పాటు దివాలా పరిష్కార ప్రక్రియ కోసం ఎన్సీఎల్టీ దిల్లీ బెంచ్కి స్వచ్ఛందంగా దరఖాస్తు చేసుకుంది. గోఫస్ట్కు అనుకూలంగా సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు అమెరికా ఇంజిన్ల సంస్థ ప్రాట్ అండ్ విట్నీ నిరాకరించడంతోనే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది. ఎన్సీఎల్టీ కనుక తమ దరఖాస్తును అంగీకరిస్తే, విమానాలు మళ్లీ నడుపుతామని సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రాట్ అండ్ విట్నీ తన స్పందనను తెలియజేసింది.
ఆ స్టాక్స్లో ర్యాలీ
గోఫస్ట్ దివాలా నేపథ్యంలో స్టాక్ మార్కెట్లో ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ (Indigo), స్పైస్జెట్ (Spicejet) షేర్లు పరుగులు తీశాయి. గోఫస్ట్ దివాలా పరిష్కారానికి దరఖాస్తు చేయడం, మూడు రోజుల పాటు సర్వీసుల రద్దు నేపథ్యంలో ఈ స్టాక్స్కు కొనుగోళ్లు వెల్లువెత్తాయి. బీఎస్ఈలో ఇండిగో షేరు 7.99 శాతం మేర లాభంతో 2,235 వద్ద ట్రేడవుతుండగా.. స్పైస్జెట్ షేరు సైతం 5.58 శాతం లాభంతో 33.25 వద్ద ట్రేడవుతోంది.
స్పైస్జెట్ విమానాల పునరుద్ధరణ
గోఫస్ట్ సేవల నిలిపివేత నిర్ణయంతో స్పైస్జెట్ (Spicejet) విమానాల పునరుద్ధరణకు సిద్ధమైంది. నేలకే పరిమితమైన 25 విమానాలను పునురుద్ధరించేందుకు రూ.400 కోట్లు సమీకరించామని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఎమర్జెన్సీ క్రెడిట్లైన్ గ్యారెంటీ స్కీమ్ ద్వారా ఈ నిధులు పొందినట్లు సంస్థ ఛైర్మన్, ఎండీ అజయ్ సింగ్ తెలిపారు. గోఫస్ట్ దివాలా తీసిన మరుసటి రోజే ఈ నిర్ణయం ప్రకటించడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్య బీమా మరింత భారం
పెరుగుతున్న ఆసుపత్రి ఖర్చులను తట్టుకునేందుకు ఆరోగ్య బీమా తప్పనిసరిగా మారింది. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఇటీవలి కాలంలో ఆరోగ్య బీమా పాలసీలకు సంబంధించి కొన్ని కీలక మార్పులు చేసింది. -
కేకేఆర్ చేతికి హెల్తియమ్ మెడ్టెక్
సర్జికల్ సూదుల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న బెంగళూరు సంస్థ హెల్తియమ్ మెడ్టెక్లో మెజార్టీ వాటాను, అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడుల సంస్థ కేకేఆర్ రూ.7,000 కోట్ల (840 మిలియన్ డాలర్ల)కు కొనుగోలు చేయనుందని తెలిసింది. -
సైబర్ దాడులు.. మనపై ఎక్కువే
అమెరికా, బ్రిటన్ తర్వాత అంతర్జాతీయంగా ‘ఫిషింగ్’ దాడులను అత్యధికంగా ఎదుర్కొంటున్నది మన దేశమే. భారత దేశంపై జరిగిన సైబర్ దాడుల్లో 33% టెక్నాలజీ రంగంపైనే కనిపించాయని స్కేలర్ అనే సైబర్ భద్రతా సంస్థ తన నివేదికలో పేర్కొంది. -
ప్రయాణ - పర్యాటకంలో 5.82 కోట్ల ఉద్యోగాలు!
దేశీయంగా పర్యాటకానికి గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో, ఆ రంగంతో పాటు ప్రయాణ రంగంలోనూ ఉపాధికి భారీ అవకాశాలు కలగనున్నాయి. -
ఎయిరిండియా క్యాబిన్ లగేజీ ఉచిత పరిమితి తగ్గింపు
దేశీయ మార్గాల్లో క్యాబిన్ లగేజీ ఉచిత పరిమితిని ఈనెల 2 నుంచి తగ్గించినట్లు ఎయిరిండియా తెలిపింది. తక్కువ ధర ఉండే ఎకానమీ తరగతి ప్రయాణికులు ఇకపై 15 కిలోలే ఉచితంగా క్యాబిన్ లగేజీగా తీసుకెళ్లొచ్చని వెల్లడించింది. -
కోటక్ బ్యాంక్ లాభం రూ.5,302 కోట్లు
ప్రైవేటు రంగ కోటక్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.5,302 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే కాల లాభంతో పోలిస్తే ఇది 25% అధికం. -
రెండేళ్లలో మళ్లీ చిన్న కార్ల హవా
దేశీయ విపణిలో చిన్న కార్ల విభాగం 2026 చివరికల్లా లేదా 2027 నాటికి పుంజుకునే అవకాశం ఉందని మారుతీ సుజుకీ ఇండియా అంచనా వేస్తోంది. -
రూ.15,000 కోట్ల రుణాల కోసం వొడాఫోన్ ఐడియా యత్నాలు!
ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంకులతో పాటు ప్రైవేటు రంగ బ్యాంకుల నుంచీ రూ.15,000 కోట్ల (1.8 బిలియన్ డాలర్ల) రుణాలు తీసుకునేందుకు వొడాఫోన్ ఐడియా చర్చలు సాగిస్తోందని సమాచారం. -
మన ఎగుమతులకు అంతర్జాతీయ అనిశ్చితులే బెంగ
అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతుండటం వల్ల, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశీయ ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉందని ఎగుమతిదార్ల సంఘం ఫియో అంచనా వేస్తోంది. -
పేటీఎం సీఓఓ భవీశ్ గుప్తా రాజీనామా
పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ అధికారి (సీఓఓ) భవీశ్ గుప్తా రాజీనామా చేశారు. పేటీఎంలో రుణ వ్యాపారం, ఆన్లైన్, ఆఫ్లైన్ చెల్లింపులు, కాంప్లియెన్సెస్ తదితర విభాగాలను భవీశ్ నడిపించేవారు. -
సంక్షిప్త వార్తలు
డీమార్ట్ సూపర్మార్కెట్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్మార్ట్స్, మార్చి త్రైమాసికంలో రూ.563 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.460 కోట్లతో పోలిస్తే, ఇది 22.39% అధికం. -
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
layoffs: ప్రపంచవ్యాప్తంగా చిన్నా, పెద్దా తేడా లేకుండా పలు కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఈ ఏడాది ఒక్క ఏప్రిల్ నెలలోనే 20 వేల మందిని సాగనంపాయి.
తాజా వార్తలు (Latest News)
-
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్
-
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?
-
హంతకులకు అడ్రస్ చెప్పిన ఇన్స్టా పోస్టు.. మోడల్ హత్యలో కీలక విషయాలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
-
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్