Vande Bharat: వందే భారత్ ఎక్స్ప్రెస్కు వందే భారత్ మెట్రోకు వ్యత్యాసమేంటి?
Vande Bharat- Vande Metro: వేగవంతమైన రైళ్లు అందిచాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా వందే భారత్ ప్రాజెక్ట్ను మొదలుపెట్టింది. కొత్తగా వందే భారత్ మెట్రోలను కూడా తీసుకొస్తోంది. ఇంతకీ వీటి మధ్య వ్యత్యాసమేంటి?
ఇంటర్నెట్డెస్క్: దేశంలోని ప్రజలకు అత్యాధునిక వసతులతో కూడిన వేగవంతమైన రైళ్లు అందించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వందే భారత్ రైళ్లను (Vande Bharat Express) ప్రవేశపెట్టింది. ఈ సెమీ హైస్పీడ్ రైళ్లు ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తున్నాయి. రోజుల వ్యవధిలో కొత్త కొత్త రూట్లలో ప్రారంభానికి నోచుకుంటున్నాయి. అదే సమయంలో సమీప ప్రాంతాలకు వేగంగా రాకపోకలు సాగించడం కోసం వందే భారత్ మినీ వెర్షన్ను తీసుకొచ్చేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. అదే వందే భారత్ మెట్రో (Vande Bharat metro). దీన్ని ఈ ఏడాది డిసెంబర్లో తీసుకురానున్నారు. నగరాల నుంచి సమీప ప్రాంతాలకు వేగంగా రాకపోకలు కొనసాగించటానికి ఈ రైళ్లు ఉపయోగపడనున్నాయి. విద్యార్థులకు, ఉద్యోగులు తమ గమ్యస్థానాలకు సులువుగా, వేగంగా చేరుకోవడానికి వందే భారత్ మెట్రోలు ఉపయోగపడతాయని కేంద్రం చెబుతోంది. ఈ రెండూ వేగవంతమైన రైళ్లే అయినప్పటికే వీటి మధ్య కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. అవేంటంటే..?
🚇 పెద్ద పెద్ద నగరాల మధ్య ప్రయాణానికి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను (Vande Bharat Express) అందుబాటులోకి తెస్తున్నారు. సగటున 500-600 కిలోమీటర్లు దూరం ఉన్న నగరాల మధ్య కొన్ని ప్రధాన పట్టణాలను కలుపుతూ ఇవి నడుస్తున్నాయి. స్లీపర్ క్లాస్ లేకపోవడంతో రాత్రి ప్రయాణాలతో పాటు సుదూర ప్రయాణాలకు వీటిని వినియోగించడం లేదు. అదే వందే భారత్ మెట్రోలయితే (Vande Bharat metro) 100 కిలోమీటర్లలోపు ఉన్న ప్రాంతాల మధ్య రాకపోకలు సాగిస్తాయి.
🚇 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు రెండు నగరాల మధ్య రెండు సర్వీసులు మాత్రమే నడుస్తాయి. ఉదాహరణకు విశాఖ-సికింద్రాబాద్ వందే భారత్నే తీసుకుంటే ఒకటే రైలు విశాఖ నుంచి బయల్దేరి మళ్లీ.. తిరిగి రాత్రికి విశాఖకు చేరుకుంటుంది. వందే భారత్ మెట్రో మాత్రం ఆయా ప్రాంతాల మధ్య రోజుకు సగటున నాలుగైదు సర్వీసులు నడుస్తుంది.
🚇 వందే భారత్ ఎక్స్ప్రెస్లో 16 కోచ్లు ఉంటాయి. ఇందులో ఛైర్ కార్ వేరేగా.. ఎగ్జిక్యూటివ్ క్లాస్ వేరేగా ఉంటుంది. అదే వందే భారత్ మెట్రోలో అయితే కేవలం ఎనిమిది కోచ్లు మాత్రమే ఉంటాయి.
🚇 వందే భారత్ రైళ్లు గరిష్ఠంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. ట్రాకుల సామర్థ్యం దృష్ట్యా ప్రస్తుతం 130 కిలోమీటర్ల వేగంతో నడుపుతున్నారు. వందే మెట్రో రైళ్లు సైతం 125 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో నడపనున్నారు.
🚇 సుదూర ప్రాంతాలకు వెళ్తాయి కాబట్టి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో బాత్రూమ్ సౌకర్యం ఉంటుంది. వందే మెట్రోలో అలాంటి సౌకర్యాలు ఉండవు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఉద్యోగం ఉంటుందో?లేదో?’: ఎయిరిండియా విమానాల రద్దుపై ప్రయాణికుల ఆందోళన
ఎయిరిండియా ఎక్స్ప్రెస్కు (Air India Express) చెందిన పలు విమానాలు రద్దుకావడంతో విమానాశ్రయాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. -
AI ఫీచర్లు, 64MP కెమెరాతో గూగుల్ పిక్సెల్ 8ఏ.. ధర, ఫీచర్లివే
Google Pixel 8a: గూగుల్ పిక్సెల్ 8ఏ ఫోన్ 64ఎంపీ కెమెరా సహా అత్యాధునిక ఏఐ ఫీచర్లతో భారత్లో విడుదలైంది. -
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఉద్యోగుల మూకుమ్మడి సెలవు.. 80కి పైగా విమానాల రద్దు
Air India Express: దాదాపు 300 మంది క్యాబిన్ క్రూ అనారోగ్య కారణంతో సెలవు పెట్టినట్లు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ వెల్లడించింది. దీంతో దాదాపు 80కి పైగా సర్వీసులు రద్దయ్యాయి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,276
Stock Market Opening bell: ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్ 267 పాయింట్ల నష్టంతో 73,244 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు కుంగి 22,276 దగ్గర కొనసాగుతోంది. -
టాటా సెమీ కండక్టర్ చిప్ల ఎగుమతి!
మన దేశం నుంచి సెమీ కండక్టర్ చిప్సెట్ల ప్రయోగాత్మక ఎగుమతి ప్రారంభమైంది. చిప్సెట్ల కోసం దిగుమతులపైనే ఆధారపడిన మన దేశానికి ఇది ఎంతో ప్రోత్సాహకర అంశమే. -
మెట్రో నగరాల్లో ఖాళీగా షాపింగ్ మాల్స్!
దేశంలోని 8 ప్రధాన నగరాల్లో, స్టాల్స్ స్థలం అతి తక్కువగా నిండుతున్న షాపింగ్ మాల్స్ సంఖ్య పెరిగిందని స్థిరాస్తి సేవల సంస్థ నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. -
డాక్టర్ రెడ్డీస్కు రూ.1,307 కోట్ల లాభం
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి ఆకర్షణీయ ఫలితాలు నమోదు చేసింది. -
యాపిల్ కొత్త ఐప్యాడ్ ఎయిర్
టెక్ దిగ్గజం యాపిల్ సరికొత్త ఐప్యాడ్ ఎయిర్ను మంగళవారం జరిగిన ‘లెట్ లూజ్’ కార్యక్రమంలో ఆవిష్కరించింది. -
అయిదేళ్ల కనిష్ఠానికి పొదుపు
దేశంలో కుటుంబాల నికర పొదుపు గణనీయంగా తగ్గుతోంది. 2020-21తో పోలిస్తే, 2022-23 ఆర్థిక సంవత్సరం చివరకు కుటుంబాల నికర పొదుపు రూ.9 లక్షల కోట్లు తగ్గి రూ.14.16 లక్షల కోట్లకు పరిమితమైంది. -
3 రోజులు.. రూ.11 లక్షల కోట్ల నష్టం
హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి పెద్ద షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో మంగళవారం సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
ట్రేడింగ్ సమయం పొడిగింపు లేనట్లే
ఈక్విటీ డెరివేటివ్స్ విభాగంలో ట్రేడింగ్ సమయాన్ని పొడిగించేందుకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) సమర్పించిన ప్రతిపాదనను కేపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తిరస్కరించింది. -
పోర్షే రూ.1.69 కోట్ల కారు
పోర్షే సరికొత్త పనమేరాను, అత్యంత ఆకర్షణీయ ఫీచర్లతో ఆవిష్కరించింది. దీని ధర(ఎక్స్ షోరూం) రూ.1,69,62,000. -
వైద్య పరికరాల దిగుమతులు తగ్గాలి
వైద్య పరికరాల కోసం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలంటే ప్రభుత్వం, పరిశ్రమ కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని ఫార్మాస్యూటికల్స్ (ఔషధ) విభాగ కార్యదర్శి అరుణీష్ చావ్లా వెల్లడించారు. -
హ్యాపియెస్ట్ మైండ్స్ డివిడెండ్ 163%
ఐటీ సంస్థ హ్యాపియెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.71.98 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
సంక్షిప్త వార్తలు(5)
సజ్జన్ జిందాల్ నేతృత్వంలోని జేఎస్డబ్ల్యూ ఎనర్జీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.351 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
దేశంలో ఘోస్ట్ షాపింగ్ మాల్స్ పెరుగుతున్నాయి. ఆన్లైన్ కొనుగోళ్లు, పెద్ద పెద్ద షాపింగ్మాల్స్కు మారడమే ఇందుకు కారణం. -
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్
Warren Buffett: ప్రముఖ మదుపరి, బిలియనీర్ వారెన్ బఫెట్ ఏఐ సాంకేతికపై ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐని అణుబాంబుతో పోల్చారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఆ 20 నిమిషాలు నా పిల్లలు ఏడుస్తూనే ఉన్నారు’: పూంఛ్ ఉగ్రదాడిపై ప్రత్యక్షసాక్షి
-
‘ఉద్యోగం ఉంటుందో?లేదో?’: ఎయిరిండియా విమానాల రద్దుపై ప్రయాణికుల ఆందోళన
-
వి.వి. వినాయక్ వల్లే ‘ఆర్య’ సాధ్యమైంది: అల్లు అర్జున్
-
ఈ నిర్ణయం థర్డ్ అంపైర్కూ కష్టమే.. సంజూ ఔట్తోనే ఓడిపోయాం: సంగక్కర
-
‘దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లలా కన్పిస్తారు..’: మరో వివాదంలో శామ్ పిట్రోడా
-
అందుకే వేగంగా బంతులేస్తా.. ఫెరీరాను తొలి బంతికే ఔట్ చేయడంపై కుల్దీప్