సైబర్ వల.. చిక్కుకుంటే విలవిల
ఫేస్బుక్, వాట్సాప్ నంబర్ల హ్యకింగ్, తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బు ఆశ చూపి దోచుకోవడం, ఓఎల్ఎక్స్, స్నాప్డీల్ ద్వారా వల విసిరి డబ్బు గుంజడం, ఉద్యోగాల పేరుతో వల వేయడం ఇలా అనేక రకాలుగా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతూ సామాన్య, మధ్యతరగతి వారి నగదు కాజేసి వారిని ఆర్థికంగా కుంగదీస్తున్నారు. జిల్లా
జిల్లాలో పెరుగుతున్న నేరాలకు అప్రమత్తతే రక్షణ
మంచిర్యాలనేరవిభాగం, న్యూస్టుడే
ఫేస్బుక్, వాట్సాప్ నంబర్ల హ్యకింగ్, తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బు ఆశ చూపి దోచుకోవడం, ఓఎల్ఎక్స్, స్నాప్డీల్ ద్వారా వల విసిరి డబ్బు గుంజడం, ఉద్యోగాల పేరుతో వల వేయడం ఇలా అనేక రకాలుగా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతూ సామాన్య, మధ్యతరగతి వారి నగదు కాజేసి వారిని ఆర్థికంగా కుంగదీస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ఈ తరహా కేసులు పెరుగుతున్నాయి.
మోసాలు జరుగుతున్నాయిలా..
* నీల్వాయికి చెందిన ఓ బాధితురాలు ఇన్స్టాగ్రామ్లో డబ్బు సంపాదన గురించి యాడ్ చూసి అందులో ఉన్న కాంటాక్ట్ నంబరుకు ఫోన్ చేసింది. అతడు బాధితురాలితో మీకు ఒక లింకు పంపిస్తున్నాం.. ఆ లింకు క్లిక్ చేస్తే కొన్ని వస్తువులు కనిపిస్తాయి. ముందు మీరు మీ డబ్బుతో ఆ వస్తువులను కొనుగోలు చేయండి, ఆ తర్వాత కమీషన్తో కలిపి మీకు డబ్బులు తిరిగి చెల్లిస్తారు అని నమ్మించాడు. మొదట రూ.100తో ఒక వస్తువు ఆర్డర్ చేయగా మోసగాడు కమిషన్తో కలిపి రూ.150 తిరిగి బాధితురాలికి చెల్లించాడు. కమీషన్ రావడంతో నమ్మిన బాధితురాలు రూ.13 వేలతో వస్తువులను ఆర్డర్ చేయగా, సైబర్ నేరగాడు డబ్బులు తిరిగి చెల్లంచలేదు.
* దండేపల్లికి చెందిన ఓ బాధితుడు ఇంటి నిర్మాణానికి సంబంధించిన దుకాణం నడుపుతున్నాడు. సైబర్ నేరగాడు వ్యాపారికి ఫోన్ చేసి కొన్ని వస్తువులు ఆర్డర్ చేశాడు. డబ్బులు పంపించమని వ్యాపారి కోరగా సైబర్ నేరగాడు క్యూఆర్ కోడ్ పంపించి స్కాన్ చేస్తే డబ్బులు వస్తాయని చెప్పాడు. బాధితుడు స్కాన్ చేయగా వెంటనే అతడి బ్యాంకు ఖాతా నుంచి రూ.30 వేలు సైబర్ నేరగాడు కాజేశాడు.
* సీసీసీ నస్పూర్కు చెందిన ఓ బాధితుడు ఫేస్బుక్ ద్వారా లోన్ పే యాప్ను డౌన్లోడ్ చేసుకున్నాడు. యాప్లో తన వివరాలన్ని పొందుపరిచి, ప్రాసెసింగ్ ఫీజు, టాక్స్ పేరిట డబ్బులు చెల్లించాలని సైబర్ నేరగాడు కోరగా పలు దఫాలుగా రూ.లక్ష చెల్లించి మోసపోయాడు.
* మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి ఫోన్ పే కస్టమర్ కేర్ కోసం గూగుల్లో వెతికాడు. సైబర్ నేరగాడు సమస్య పరిష్కారం కోసం ఏనీ డెస్క్ అనే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పగా బాధితుడు అతడు చెప్పిన విధంగా చేశాడు. క్రెడిట్ కార్డు వివరాలతో పాటు ఏనీ డెస్క్ వివరాలు తెలుసుకున్న నేరగాడు బాధితుడి ఖాతా నుంచి రూ.30 వేలు మాయం చేశాడు.
1930 టోల్ఫ్రీ నంబరు...
సైబర్క్రైం పోలీసుల దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేసే లోపే నేరగాళ్లు డబ్బును ఖాతాల నుంచి లాగేసుకుంటారు. ఇలాంటి మోసాలను ఆపి నేరగాళ్ల అకౌంట్లను స్తంభింపచేసే విధంగా కేంద్రప్రభుత్వం ఒక వ్యవస్థను రూపొందించింది. ఖాతాల నుంచి డబ్బు పోయినట్లు గుర్తించగానే వెంటనే కేంద్ర హోంశాఖ హెల్ప్లైన్ నంబరు 1930కి ఫోన్ చేయాలి.
వీటిని పాటిస్తే మేలు..
* చరవాణులకు వచ్చిన ఓటీపీ, ఇతర బ్యాంకు ఖాతాల వివరాలను ఎట్టిపరిస్థితుల్లోను అపరిచిత వ్యక్తులకు చెప్పవద్దు. వైఫైల ద్వారా నగదు లావాదేవీలు జరపకూడదు.
* ఏటీఎం కార్డులకు చెందిన పాస్వర్డ్లను చరవాణులలో సేవ్ చేయవద్దు.
* వ్యక్తిగత రుణాలు, ఉద్యోగాలు కల్పిస్తామనే ఫోన్లు, లింక్లకు స్పందించవద్దు.
* బ్యాంకు అధికారులమంటూ ఫోన్లు వస్తే ఎలాంటి సమాచారం చెప్పవద్దు.
* డెబిట్కార్డు, చరవాణి హ్యాక్ అయిందన్న అనుమానం రాగానే వెంటనే అంతర్జాల ఆధారిత కొనుగోళ్లను నిలిపివేయాలి. కాల్సెంటర్ నిర్వాహకులకు ఫిర్యాదు చేస్తే క్రెడిట్కార్డుపై లావాదేవీలు ఆగిపోతాయి.
* బ్యాంకు అధికారులకు విషయాన్ని వివరించి ఏయే ప్రాంతాల్లోని ఖాతాలు లేదా ఈ-వ్యాలెట్లకు సొమ్ము పోయిందన్న వివరాలను తెలుసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆసిఫాబాద్లో మారిన నీట్ ప్రశ్నపత్రం
[ 06-05-2024]
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నీట్ ప్రశ్నపత్రం మారింది. -
పెళ్లైన నాలుగు రోజులకే.. నవ వధువును ఇంటికి పంపిన వరుడు
[ 06-05-2024]
బెల్లంపల్లి మండలం కాసిరెడ్డిపల్లె గ్రామంలో ఆదివారం ఓ నవ వధువు వరుడి ఇంటి ముందు బంధువులతో కలిసి ఆందోళన చేసింది. వధువు కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. -
కమలదళం.. కదనోత్సాహం
[ 06-05-2024]
‘‘గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబాకు ప్రణామం.. బాసర సరస్వతీ, పోరాటయోధుడు కుమురం భీం, రాంజీగోండ్, కొండా లక్ష్మణ్ బాపూజీలకు ప్రణామాలు..’’ అంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా కాగజ్నగర్లో నిర్వహించిన వికాస సంకల్ప సభలో ప్రసంగం ప్రారంభించారు. -
‘గిరి’యువతకు ఉపాధి కరవు
[ 06-05-2024]
ఆదివాసీ గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కలగానే మిగులుతోంది. యూత్ ట్రైనింగ్ సెంటర్(వైటీసీ)లలో యువత ఆసక్తి, అభిరుచికి అనుగుణంగా నైపుణ్యాల శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాల్సి ఉండగా.. శిక్షణ కార్యక్రమాల నిర్వహణ, జాబ్ మేళాల ఏర్పాటు కోసం నిధుల కేటాయింపులో ప్రభుత్వం జాప్యం చేస్తోంది. -
కాంగ్రెస్లో కొత్తదనం.. కలిసొచ్చిన పాతతరం
[ 06-05-2024]
ప్రజలకు అభివాదం చేస్తూ, యువతకు స్వీయచిత్రాల అవకాశమిచ్చిన అగ్రనేత రాహుల్గాంధీ, గాడిద గుడ్డు కథ వివరిస్తూ నినాదాలు చేయించిన సీఎం రేవంత్రెడ్డి, ఒకే వేదికపై కూచాడి శ్రీహరిరావు, ఇంద్రకరణ్రెడ్డి, విఠల్రెడ్డి, వేణుగోపాలాచారి కనిపించటం, భారీగా తరలివచ్చిన జనం.. -
మండుతున్న ఎండలు.. వేడెక్కుతున్న భవనాలు
[ 06-05-2024]
వేసవిలో మండుతున్న ఎండలకు పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతున్నాయి. సిమెంటు కాంక్రీటు భవనాలు వేడెక్కుతున్నాయి. సాధారణంగా గది ఉష్ణోగ్రత 24 డిగ్రీలు ఉంటుంది. మండుతున్న ఎండలతో ఈ ఉష్ణోగ్రతలు సైతం సాధారణ స్థాయిని మించి నమోదవుతున్నాయి. -
కేంద్రాలు దూరం.. తప్పని భారం!
[ 06-05-2024]
కాకతీయ విశ్వవిద్యాలయ (కేయూ) పరిధిలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న డిగ్రీ పరీక్షల్లో విద్యార్థులకు అవస్థలు తప్పేలా లేవు. వారం రోజులుగా 45, 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ ఉదయం నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. -
ప్రశాంతంగా నీట్
[ 06-05-2024]
వైద్య విద్యలో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్ యూజీ-2024) ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో 5 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. -
సెలవు కరవు.. విధుల బరువు..
[ 06-05-2024]
కనిపించని నాలుగో సింహం పోలీస్. ఇది అక్షర సత్యం. అదే సమయంలో పోలీసు జీవితం వెనక కనిపించని కష్టాలు, ఒత్తిళ్లు, ఆరోగ్య, కుటుంబ సమస్యలతో పోలీసులు మానసికంగా కుంగిపోతున్నారు. ఖాకీ చొక్కా.. ప్యాంటులో హుందాతనంగా కనిపిస్తుంటారు. -
వసతులు లేక ఇక్కట్లు
[ 06-05-2024]
పేదలకు గూడు కల్పించేందుకు గత ప్రభుత్వం తీసుకొచ్చిన రెండు పడకగదుల ఇళ్ల పథకంలో భాగంగా పట్టణంలోని బంగల్పేట్ శివారులో పెద్దమొత్తంలో జీప్లస్2 విధానంలో గృహాలను నిర్మించారు. -
చిన్నగూడు.. ఆదర్శం చూడు
[ 06-05-2024]
ఎక్కడి నుంచో వలస వచ్చిన కూలీలు వారు. ఉండేందుకు తాత్కాలికంగా టార్పాలిన్లతో కట్టుకున్న నివాసాలు వారివి. పనికెళితేనే పూట గడిసే పరిస్థితి. వారి గురించి ఇంతే చెబితే అందులో ప్రత్యేకత ఉండదు. -
పెన్సిల్తో అద్భుతాలు.. జీవం ఉట్టిపడేలా చిత్రాలు
[ 06-05-2024]
చిన్నప్పటి నుంచి బొమ్మలు వేయడమంటే అమితాసక్తి ప్రదర్శించే ఆ యువకుడు పెన్సిల్తో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. బొమ్మను చూస్తే చాలు ఉన్నది ఉన్నట్టు గీస్తూ ఔరా అనిపిస్తున్నాడు. -
డిగ్రీ ప్రవేశాల.. ‘దోస్త్’
[ 06-05-2024]
ప్రభుత్వం డిగ్రీ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) ప్రకటన జారీ చేసింది. డిగ్రీ కళాశాలల్లో సీట్ల భర్తీకి ఈ నెల 6వ తేదీ రిజిస్ట్రేషన్లు ప్రారంభమై మూడు విడతల్లో సీట్లు కేటాయింపు జరగనుంది. -
నేటి నుంచి డిగ్రీ పరీక్షలు
[ 06-05-2024]
కాకతీయ విశ్వవిద్యాలయ పరిధిలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఒకవైపు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రస్తుత తరుణంలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ తదితర కోర్సుల్లో రెండు, నాలుగు, ఆరో సెమిస్టర్ పరీక్షల నిర్వహిస్తుండటం సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
క్రాంతినగర్ ఘటనలో 40 మందిపై కేసులు
[ 06-05-2024]
ఆదిలాబాద్ పట్టణంలోని క్రాంతినగర్లో శుక్రవారం రాత్రి, శనివారం చోటు చేసుకున్న అవాంఛనీయ ఘటనలో ఇరు వర్గాలకు చెందిన 40 మందిని బాధ్యులుగా గుర్తించి ఆదిలాబాద్ రెండో పట్టణ పోలీసులు ఆదివారం కేసులు నమోదు చేశారు. -
విజ్ఞాన భాండాగారం.. అంతర్జాలం
[ 06-05-2024]
దేశంలో ఓ వైపు ఎన్నికల వేడి, హడావుడి నడుస్తుండగా విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులకు పోటీ పరీక్షల కాలం ముందుంది. రాజకీయ నాయకులు ఓట్ల కోసం పోటీ పడుతుండగా నిరుద్యోగులు ఉద్యోగాల కోసం పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
-
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
-
హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!
-
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
-
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 74,000 ఎగువన సెన్సెక్స్