ఆపదొచ్చిందా .,యాప్ తో మాయం
విద్యుత్తు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేలా టీఎస్ఎన్పీడీసీఎల్ (ఉత్తర తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ) మరో అడుగు ముందుకేసింది. పది రకాల సేవలు ఒకే దగ్గర లభించేలా ప్రత్యేకంగా ఎన్పీడీసీఎల్ బిల్డెస్క్ అనే పేరుతో ఓ యాప్ను రూపొందించింది.
పది రకాల సేవలందిస్తున్న టీఎస్ఎన్పీడీసీఎల్
చెన్నూరు, న్యూస్టుడే
విద్యుత్తు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేలా టీఎస్ఎన్పీడీసీఎల్ (ఉత్తర తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ) మరో అడుగు ముందుకేసింది. పది రకాల సేవలు ఒకే దగ్గర లభించేలా ప్రత్యేకంగా ఎన్పీడీసీఎల్ బిల్డెస్క్ అనే పేరుతో ఓ యాప్ను రూపొందించింది. విద్యుత్తు సరఫరాలో హెచ్చుతగ్గులు, ఒరిగిన స్తంభాలు, వీధుల్లో ఇళ్లకు తాకే తీగల తొలగింపు, ప్రమాదకరంగా ఉన్న నియంత్రికలు, సరఫరాలో నెలకొన్న అంతరాయాలు.. ఇలా ఒకటేమిటి సమస్య ఏదైనా ఇంటి వద్దే ఉండి చరవాణితో అధికారుల దృష్టికి తీసుకెళ్లొచ్చు. బిల్లుల చెల్లింపులతో పాటు మరో తొమ్మిది రకాల సేవలు, ఫిర్యాదులు, సలహాలు, సూచనలు వినియోగించుకోవచ్చు.
యాప్డౌన్లోడ్ ఇలా..
చరవాణిలో గూగుల్ప్లే స్టోర్స్లోకి వెళ్లి టీఎస్ఎన్పీడీసీఎల్ అని టైప్ చేయగానే టీఎస్ఎన్పీడీసీఎల్ బిల్డెస్క్ అనే ఆప్షన్ కనిపిస్తోంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. యాప్ డౌన్లోడ్ అయిన తరువాత రిపోర్ట్అన్ ఇన్సిడెంట్, కాంప్లెయింట్, సెల్ప్రీడింగ్, పేబిల్స్, బిల్స్ హిస్టరీ, ఆన్లైన్ పేమెంట్స్ హిస్టరీ, లింక్ ఆధార్ అండ్ మొబైల్, టారీఫ్ డిటేల్స్, ఎనర్జీ టిప్స్, సేఫ్టీ టిప్స్ అనే పది రకాల ఆప్షన్లు కనిపిస్తాయి.
* రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఈ- మెయిల్ ఐడీతో పాటు చరవాణి నంబరును నమోదు చేయాలి. వినియోగదారుడి సర్వీసు నంబరు(బోల్డ్ లెటర్స్లో ఉన్న సంఖ్యను) నమోదు చేసి సబ్మిట్ చేయాలి. యాప్ ద్వారా చేసిన దరఖాస్తులను, ఫిర్యాదులను ఉన్నతాధికారులు సంబంధిత కార్యాలయానికి పంపించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. సమస్య పరిష్కారం అనంతరం వినియోగదారుడి చరవాణికి తిరిగి సమాచారం వస్తుంది.
చిత్రం తీసి పంపొచ్చు..
యాప్లోకి వెళ్లక ముందు చరవాణిలో లొకేషన్ అనే ఆప్షన్ను ఆన్ చేయాలి. ఆ తరువాత రిపోర్ట్ ఆన్ ఇన్సిడెంట్ అనే ఆప్షన్ను టచ్చేస్తే కెమెరా గుర్తు కనిపిస్తోంది. కెమెరా తెరచుకోగానే మనమున్న లొకేషన్ స్మార్ట్ఫోన్లోని కెమెరాకు అనుసంధానం అవుతోంది. ఆ తరువాత సమస్య కనిపించేలా ఫొటో తీయాలి. అనంతరం పేరు, చరవాణి సంఖ్య నమోదు చేసి సమస్యను వివరించాలి. చిత్రం తీసి వివరాలు నమోదు చేసిన తరువాత సబ్మిట్ చేయాలి. ఈ సమాచారం నేరుగా విద్యుత్తు సంస్థ ఏర్పాటు చేసిన సర్వర్లోకి వెళ్లిపోతోంది. అందులో జీపీఎస్ కోఆర్డినేషన్ వ్యవస్థ ఉండటంతో ఏ ప్రాంతం నుంచి చిత్రం పంపామో అధికారులకు తెలిసిపోతుంది. దీంతో వారు వెంటనే స్పందించే అవకాశం ఉంటుంది.
సద్వినియోగం చేసుకోవాలి
- రవికుమార్, డిస్కం ఏడీఈ, చెన్నూరు
విద్యుత్తు సంస్థ ప్రవేశపెట్టిన యాప్ను వినియోగదారులంతా సద్వినియోగం చేసుకోవాలి. సమస్యలపై కార్యాలయాలకు వచ్చి ఫిర్యాదులు చేసే అవసరం లేకుండా దీన్ని రూపొందించారు. వినియోగదారులు యాప్ ద్వారా పంపించే ప్రతీ సమస్య, దరఖాస్తులకు తక్షణ పరిష్కారం లభిస్తోంది.
సమస్యలపై ఫిర్యాదు చేయడం ఇలా..
* బిల్లు, లైనులో సమస్య, నియంత్రిక కాలిపోతే, సరఫరాలో హెచ్చుతగ్గులు, లోపాలు తదితర ఏ సమస్య వచ్చినా.. యాప్లోని కంప్లెయింట్ ఆప్షన్లోకి వెళ్లాలి. అందులో చరవాణి నంబరు, సర్వీస్ నంబర్, ఈ- మెయిల్ అడ్రస్ నమోదు చేయాలి. దీంతో పాటు కంప్లెయింట్ను నమోదు చేయాలి. సమస్య వివరిస్తూ రాశాకా సబ్మిట్ ఆప్షన్ను ఎంచుకోవాలి. వెంటనే సంక్షిప్త సందేశంతో ద్వారా ఫిర్యాదు సంఖ్యతో పాటు ప్రాంతం వివరాలు చరవాణికి వచ్చేస్తాయి.
* వినియోగదారులు చేసిన ఫిర్యాదు ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు యాప్లో అవకాశం కల్పించారు. చరవాణికి వచ్చిన ఫిర్యాదు సంఖ్యను కంప్లెయింట్ ఐడీలో నమోదు చేసి సబ్మిట్ ఆప్షన్ ఉపయోగించాలి. వెంటనే మనం తెలియజేసిన సమస్య ఏ స్థాయిలో ఉందో సంక్షిప్త సందేశం చరవాణికి వస్తోంది.
* చెల్లిస్తున్న బిల్లు వివరాలను తెలుసుకునేందుకు పేబిల్స్ ఆప్షన్లోకి వెళ్లి సర్వీసు వివరాలు నమోదు చేయగానే చెల్లింపు వివరాలు వస్తాయి. ఆయా ఆప్షన్లలో సమాచారాన్ని నమోదు చేసి చెల్లింపులు పూర్తి చేయవచ్చు. చెల్లింపుల వివరాలు చరవాణికి సంక్షిప్త సందేశం వస్తుంది.
* సమస్యలపై నేరుగా ఫోన్ చేసి ఫిర్యాదు చేసేందుకు టోల్ఫ్రీ నెంబర్లు 1912, 18004250028 అందుబాటులో ఉన్నాయి.
* చెన్నూరు పట్టణానికి చెందిన కృష్ణమాచారి తన వీధిలో విద్యుత్తు తీగలు కిందికి వేళాడుతూ ప్రమాదకరంగా ఉన్న చిత్రాలను తన చరవాణితో తీసి సంస్థ ఏర్పాటు చేసిన యాప్ ద్వారా పంపిస్తున్నారు. విద్యుత్తు సమస్యలు ఉత్పన్నమైనప్పుడు ఎవరికి ఫిర్యాదు చేయాలో గతంలో తెలియక ఇబ్బందులెదురయ్యేవని తెలిపారు. ప్రస్తుతం యాప్ అందుబాటులోకి రావడంతో చెల్లింపులతో పాటు విద్యుత్తు సమస్యలపై చరవాణి ద్వారా ఇంటి నుంచే ఫిర్యాలు చేసే అవకాశం లభించిందన్నారు. సమయం, వ్యయ, ప్రయాసలు లేకుండా యాప్ ద్వారా సమస్యలు పరిష్కరించేందుకు రూపొందించిన దీన్ని సద్వినియోగం చేసుకుంటే ఎంతో సౌలభ్యంగా ఉంటుందని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హజ్ యాత్రకు ఏర్పాట్లు పూర్తి
[ 08-05-2024]
ఈ ఏడాదిలో జిల్లా నుంచి పవిత్ర హజ్ యాత్రకు వెళ్లడానికి కమిటీ ఏర్పాట్లు పూర్తి చేసింది. -
త్వరలోనే రైతు రుణమాఫీ
[ 08-05-2024]
ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం.. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే రైతు రుణమాఫీ చేస్తుందని డీసీసీబీ ఛైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. -
మాయ లేడి
[ 08-05-2024]
ఆమె ఓ మహిళ. భర్త వ్యాపారం చూస్తూనే అందరితో కలివిడిగా ఉంటూ మాటలు కలిపేది. ఈ క్రమంలో ఏర్పడిన పరిచయాలను సొమ్ము చేసుకోవాలనుకుంది. విద్యార్హత ఆధారంగా ఉద్యోగాలిప్పిస్తానంటూ నమ్మబలికింది. -
పెద్దపల్లి పోరు.. తండ్రీకొడుకులపై పోటీ
[ 08-05-2024]
పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం 1962లో ఏర్పడగా 62 ఏళ్లుగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఇద్దరు వ్యక్తులు(వి.తులసీరాం, గడ్డం వెంకటస్వామి) రెండు, అంతకంటే ఎక్కువసార్లు విజయం సాధించారు. -
దారి తప్పిన బాల్యం..
[ 08-05-2024]
ఆదిలాబాద్ పట్టణంలో కొందరు బాలలు ముఠాగా ఏర్పడి రాత్రయిందంటే చోరీలకు తెగబడటం పట్టణవాసులకు సమస్యగా మారింది. రహదారి పక్కన, మైదానాల్లో ఆశ్రయాలు ఏర్పాటు చేసుకొని జీవించే కుటుంబాలకు చెందిన కొందరు పగటి పూట రెక్కీ నిర్వహించి రాత్రి లేదా తెల్లవారుజామున అవకాశం చూసుకొని చోరీలకు పాల్పడటం సర్వసాధారణంగా మారింది. -
విద్యుత్తు ఉపకేంద్రాల్లో సౌర యూనిట్లు
[ 08-05-2024]
విద్యుత్తు అవసరాలు రోజురోజుకు పెరుగుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సౌరప్లాంట్ల ఏర్పాటుపై దృష్టి సారించాయి. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలపై సౌర యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాయి. -
ఓటు వేసేదెలా?
[ 08-05-2024]
ఒకవైపు ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని ఇంటింటికి వెళ్లి కదల్లేని వయోవృద్ధులు, దివ్యాంగులకు అవకాశం కల్పిస్తున్న అధికార యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లలో కీలక భూమిక పోషిస్తున్న పంచాయతీ కార్యదర్శుల విషయంలో నిర్లక్ష్యం చేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
సమున్నత లక్ష్యం.. శతశాతం ఓటింగ్తోనే పదిలం
[ 08-05-2024]
ఓటు.. ప్రజాస్వామ్య పరిరక్షణకు బలమైన పునాది. వజ్రాయుధంతో సమానమైన ఓటు హక్కు సద్వినియోగం చేసుకుంటేనే సార్థకత చేకూరుతుంది. అర్హులైన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు చేయించుకోవడంతో పాటు శత శాతం పోలింగ్ నమోదుకు ఎన్నికల సంఘం, వివిధ స్థాయిలో అధికార యంత్రాంగం కార్యక్రమాలు చేపడుతోంది. -
రహదారులకు ప్రాధాన్యం.. ఆరోగ్య భాగ్యం
[ 08-05-2024]
‘‘నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం లాంటిది. ప్రజాసంక్షేమం కోసం పని చేయాలనేది నా ఆశయం. ప్రగతి నా లక్ష్యం. వివాదాలు, విభేదాలు నా విధానం కాదు. ఈ అంశాలే నన్ను ఎంపీగా గెలిపిస్తాయనే నమ్మకం నాకు ఉంది.’’ -
ఆయన ఎన్నికల ఖర్చు రూ.500
[ 08-05-2024]
ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని ప్రతి ఒక్కరికి తెలుసు. వార్డు సభ్యుడు మొదలు ఏ ఎన్నిక జరిగినా డబ్బులు కుమ్మరించాల్సిందే. ఇక అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఖర్చులు తడిసిమోపెడవుతాయి. -
సెలవులొచ్చాయి.. యువ ఓటర్లు వస్తున్నారు
[ 08-05-2024]
సాధారణంగా చాలా సందర్భాల్లో ఎన్నికలప్పుడు వివిధ ప్రాంతాల్లో చదువుకునే యువ ఓటర్లు సొంతూరులో ఉండరు. ఒక వేళ ఓటు వేసేందుకు వద్దామనుకున్నా సెలవులు అంతగా ఉండవు. -
రక్త పిశాచి... చొరవ చూపితేనే విముక్తి
[ 08-05-2024]
తలసీమియా.. ఈ రక్తపిశాచితో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వ్యాధిగ్రస్థులు యాతన పడుతున్నారు. రోజూ మనిషి ఆహారాన్ని ఎలా కోరుకుంటాడో.. ఈ మహమ్మారి పక్షంరోజులకు ఒకసారి ఆయా బాధితుల రక్తం స్వీకరించేందుకు ఉవ్విళ్లూరుతుంటుంది. -
పోలింగ్ కేంద్రం దూరం.. అసౌకర్యాల భారం..
[ 08-05-2024]
మరో ఆరు రోజుల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అనేక అవస్థల మధ్య ఓట్లేసిన జిల్లావాసులకు మళ్లీ అసౌకర్యాలే ఎదురుకానున్నాయి. చాలా చోట్ల హడావుడిగా పనులను చేస్తున్నా.. -
భారీ వర్షం.. కాస్త ఉపశమనం!
[ 08-05-2024]
తీవ్రమైన ఎండలు, వేసవి తాపం, ఉక్కపోతతో కొన్నిరోజులుగా అల్లాడుతున్న జిల్లావాసులకు కాస్త ఉపశమనం కలిగించింది. జిల్లావ్యాప్తంగా మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. -
విరమణపై పెదవి విరుపు
[ 08-05-2024]
అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు పదవీ విరమణ ప్రయోజనాలు (బెనిఫిట్స్) అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 65ఏళ్లు నిండిన టీచర్కు రూ.లక్ష, సహాయకులకు రూ.50వేలు సహాయం ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది. -
ఎండ మాయం.. వానతో అపారనష్టం
[ 08-05-2024]
జిల్లా వ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం వరకు ఎండ నిప్పుల కొలిమిని తలపించినప్పటికీ రెండు గంటల తర్వాత వాతావరణం మారిపోయి. ఒక్కసారిగా ఈదురుగాలులు ప్రారంభమయ్యాయి. -
సామాజిక సమీక‘రణం’
[ 08-05-2024]
ఎన్నికల బరిలో నిలిచిన ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి ప్రత్యర్థి సామాజిక వర్గానికి చెందిన ఓట్లపై గురిపెట్టారు. గతకొన్ని రోజుల వరుసగా ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులను పార్టీలోకి చేర్పించుకుంటున్నారు. -
శిశువులపై చిన్నచూపు..
[ 08-05-2024]
ఎస్ఎన్సీయూ (స్పెషల్ న్యూబార్న్ కేర్ యూనిట్) సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి పర్యవేక్షణలో కొనసాగే నవజాత శిశువు సంరక్షణ కేంద్రం సదుపాయాలు కరవై, వైద్యులు అందుబాటులో లేక అవస్థలు పడుతోంది. -
మెజార్టీయే లక్ష్యం
[ 08-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచార గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీల ఎత్తుకు పైఎత్తులతో వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రచారానికి నాలుగు రోజులే మిగిలి ఉండటంతో మెజార్టీయే లక్ష్యంగా లెక్కలు వేసుకుంటూ ఓటర్లకు గాలం వేస్తున్నారు. -
ఏటా ఇదే తంతు..
[ 08-05-2024]
కాకతీయ.. ఉన్నత విద్యాప్రమాణాల్లో న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్ పొందిన విశ్వవిద్యాలయం. కానీ కొన్నేళ్లుగా తన పనితీరుతో అభాసుపాలవుతోంది. విద్యార్థుల భవితవ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, ‘వ్యక్తిగత ప్రయోజనాల’కు ప్రాధాన్యమిస్తూ కొందరు అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు దీని చరిత్రను మసకబారుస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఆ వీడియోల స్టోరీకి డైరెక్టర్, ప్రొడ్యూసర్ కుమారస్వామే: డీకే శివకుమార్
-
ప్లేఆఫ్స్ బెర్తుల్లో 2 ఫిక్స్.. మిగిలిన రెండింటి కోసం నాలుగు పోటీ
-
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను కొట్టేసిన క్యాట్
-
రోజంతా ఒడుదుడుకుల్లో సూచీలు.. చివరికి ఫ్లాట్గా
-
‘ట్రంప్తో ఏకాంతంగా గడిపా’ - కోర్టులో శృంగార తార సాక్ష్యం
-
విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరిన జగన్