Chilkuri Ramchandra Reddy: రాజకీయ సవ్యసాచి.. ప్రజాసేవలో మేటి
సీఆర్ఆర్..గా సుపరిచితమైన చిల్కూరి రామచంద్రారెడ్డి(81) ఇక లేరు. నిత్యం ప్రజల సేవలో కొనసాగిన ఆయన జీవిత ప్రస్థానం పరిపూర్ణమైంది.
ముగిసిన రామచంద్రారెడ్డి ప్రస్థానం
నేడు ఆదిలాబాద్లో అంత్యక్రియలు
ఈటీవీ - ఆదిలాబాద్
సీఆర్ఆర్..గా సుపరిచితమైన చిల్కూరి రామచంద్రారెడ్డి(81) ఇక లేరు. నిత్యం ప్రజల సేవలో కొనసాగిన ఆయన జీవిత ప్రస్థానం పరిపూర్ణమైంది. రెండురోజుల కిందట అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్లో చేరిన ఆయన గురువారం సాయంత్రం 4.30 గంటలకు బ్రెయిన్స్ట్రోక్తో తుదిశ్వాస వదిలారు. తలమడుగు మండలం ఖోడద్కు చెందిన ఆయనది అయిదు పదుల రాజకీయ జీవితం. బీఎస్సీ అగ్రికల్చర్ పట్టభద్రుడు. రాజకీయాల కంటే ముందు ఆదర్శ రైతు. ఒక్కసారి పరిచయమైతే చాలు తరువాత పేరుపెట్టి పలకరించే జ్ఞాపకశక్తి ఆయన సొంతం. పెళ్లి, చావుల విషయంలో రాజకీయాలకతీతంగా పల్లె, పట్టణమనే తేడా లేకుండా వెళ్లి పలకరించే లక్షణం ఉండటం ప్రజల్లో ఆయనకు ప్రత్యేక గుర్తింపును సంపాదించి పెట్టింది. ఉమ్మడి జిల్లాలో ఆయనంటే అధికార, ప్రతిపక్ష పార్టీల్లో రాజకీయ సవ్యసాచి అనే ముద్రపడింది.
సమితి అధ్యక్షుడిగా రికార్డు..
70వ దశకంలోనే ఆదిలాబాద్ పంచాయతీ సమితి అధ్యక్షుడిగా సీఆర్ఆర్ ఎన్నిక రాజకీయ సమీకరణాలను మార్చేసింది. అప్పట్లో మండల వ్యవస్థ లేదు. ఆదిలాబాద్, జైనథ్, బేల, తలమడుగు, తాంసి ప్రాంతాలతో కలిసి ఆదిలాబాద్ పంచాయతీ సమితి ఉండేది. గ్రామ సర్పంచులు, సభ్యులుగా పంచాయతీ సమితి అధ్యక్షుడిగా ఎన్నిక జరిగేది. సర్పంచి కానప్పటికీ సీఆర్ఆర్ను ఆయన బంధువైన చిల్కూరి భోజారెడ్డి(మాజీ ఎమ్మెల్యే వామన్రెడ్డి తండ్రి) సమితి కో-ఆప్షన్ సభ్యుడిగా నియమించారు. 1970లో ఆదిలాబాద్ సమితి అధ్యక్షులుగా ఆయన ఎన్నిక కావడం రికార్డు సృష్టించింది. ఇక అప్పటి నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం నిరాటంకంగా సాగింది. ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా 1978, 85లో స్వతంత్రంగా, 1989, 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా నాలుగుసార్లు విజయం సాధించారు. 1989 నుంచి 92 వరకు నేదురుమల్లి జనార్దన్రెడ్డి, కోట్ల విజయభాస్కర్రెడ్డి మంత్రివర్గంలో చిన్న నీటి పారుదుల, గిడ్డంగులు, మార్కెటింగ్ శాఖ మంత్రిగా పని చేశారు. దివంగత ప్రధాన మంత్రి రాజీవ్గాంధీ, ప్రస్తుత రాహుల్గాంధీ సహా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలోని సీనియర్ కాంగ్రెస్ నేతలందరితో సత్సంబంధాలు కలిగి ఉండటంతో ఆదిలాబాద్ అనగానే పార్టీలో సీఆర్ఆర్ పేరు ప్రస్తావనకు వచ్చేది. ఎన్నికలంటే గెలుపోటములను ఒకేలా చూడాలి. గెలిస్తే పొంగిపోకూడదు.. ఓడితే కుంగిపోకూడదు అని తరచూ వివరించేవారు. శ్రేణులకు ఆయనంటే ప్రత్యేక అభిమానం.
వర్షాల కారణంగా...
సీఆర్ఆర్ అంత్యక్రియలు ఆదిలాబాద్లోని తిర్పెల్లిలో ఉదయం 11 గంటలకు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. తొలుత ఆదిలాబాద్ పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా అంతిమయాత్ర నిర్వహించి ఆయన స్వస్థలం ఖోడద్లో అంత్యక్రియలు చేయాలని అనుకున్నారు. వర్షాలు, రాకపోకలకు ఇబ్బందుల కారణంగా చివరికి తిర్పెల్లి వైకుంఠధామానికి మార్చినట్లు ఆయన మేనల్లుడు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ సంజీవ్రెడ్డి ‘ఈనాడు’తో తెలిపారు.
ప్రముఖుల సంతాపం
* సీఆర్ఆర్ మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పేర్కొన్నారు. నిజాయతీ, క్రమశిక్షణ, విలువలతో కూడిన రాజకీయ నాయకుడిగా పేరు పొందారన్నారు. ఎప్పటికీ జనం గుండెల్లో నిలిచిపోతారన్నారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
* సీఆర్ఆర్ లేరనే విషయం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్రవేసిన ఆయన సేవలను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారన్నారు.
నిర్మల్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి సి.రాంచంద్రారెడ్డి మృతి పట్ల మంత్రి ఇంద్రకరణ్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన రాంచంద్రారెడ్డి మృతి వార్త తనను కలచివేసిందని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రజాప్రస్థానంలో ఆయన తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు.
వాట్సాప్ స్టేటస్లలో నివాళులు..
సీఆర్ఆర్ మృతి పట్ల కాంగ్రెస్, భారాస, భాజపా, సీపీఐ, సీపీఎం సహా అన్ని రాజకీయ పార్టీల అనుబంధ సంఘాలు, కులసంఘాలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల సంఘాలు, బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు నివాళులర్పించారు. వాట్సాప్ స్టేటస్లో ఫొటోలు పెట్టుకున్నారు.
రాజకీయ గురువు
లోక భూమారెడ్డి, రాష్ట్ర డెయిరీ మాజీ అధ్యక్షుడు
సీఆర్ఆర్ నాకు రాజకీయ గురువు. 1978లో ప్రారంభమైన మా స్నేహం నేను భారాసలో చేరిన 2021 వరకు కొనసాగింది. రాజకీయం తప్పితే మరో వ్యాపకంలేని గొప్ప నాయకుడు. గెలిచినా, ఓడినా నిరంతరం ప్రజల మధ్యే ఉన్న నేత. రాష్ట్ర ఆవిర్భావం కంటే ముందు, తర్వాత అన్ని రాజకీయ పార్టీల్లో ఆయనంటే అభిమానం ఉంది. అందుకే ఉమ్మడి జిల్లాలో ఆయనది ప్రత్యేక శైలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హజ్ యాత్రకు ఏర్పాట్లు పూర్తి
[ 08-05-2024]
ఈ ఏడాదిలో జిల్లా నుంచి పవిత్ర హజ్ యాత్రకు వెళ్లడానికి కమిటీ ఏర్పాట్లు పూర్తి చేసింది. -
త్వరలోనే రైతు రుణమాఫీ
[ 08-05-2024]
ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం.. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే రైతు రుణమాఫీ చేస్తుందని డీసీసీబీ ఛైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. -
మాయ లేడి
[ 08-05-2024]
ఆమె ఓ మహిళ. భర్త వ్యాపారం చూస్తూనే అందరితో కలివిడిగా ఉంటూ మాటలు కలిపేది. ఈ క్రమంలో ఏర్పడిన పరిచయాలను సొమ్ము చేసుకోవాలనుకుంది. విద్యార్హత ఆధారంగా ఉద్యోగాలిప్పిస్తానంటూ నమ్మబలికింది. -
పెద్దపల్లి పోరు.. తండ్రీకొడుకులపై పోటీ
[ 08-05-2024]
పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం 1962లో ఏర్పడగా 62 ఏళ్లుగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఇద్దరు వ్యక్తులు(వి.తులసీరాం, గడ్డం వెంకటస్వామి) రెండు, అంతకంటే ఎక్కువసార్లు విజయం సాధించారు. -
దారి తప్పిన బాల్యం..
[ 08-05-2024]
ఆదిలాబాద్ పట్టణంలో కొందరు బాలలు ముఠాగా ఏర్పడి రాత్రయిందంటే చోరీలకు తెగబడటం పట్టణవాసులకు సమస్యగా మారింది. రహదారి పక్కన, మైదానాల్లో ఆశ్రయాలు ఏర్పాటు చేసుకొని జీవించే కుటుంబాలకు చెందిన కొందరు పగటి పూట రెక్కీ నిర్వహించి రాత్రి లేదా తెల్లవారుజామున అవకాశం చూసుకొని చోరీలకు పాల్పడటం సర్వసాధారణంగా మారింది. -
విద్యుత్తు ఉపకేంద్రాల్లో సౌర యూనిట్లు
[ 08-05-2024]
విద్యుత్తు అవసరాలు రోజురోజుకు పెరుగుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సౌరప్లాంట్ల ఏర్పాటుపై దృష్టి సారించాయి. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలపై సౌర యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాయి. -
ఓటు వేసేదెలా?
[ 08-05-2024]
ఒకవైపు ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని ఇంటింటికి వెళ్లి కదల్లేని వయోవృద్ధులు, దివ్యాంగులకు అవకాశం కల్పిస్తున్న అధికార యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లలో కీలక భూమిక పోషిస్తున్న పంచాయతీ కార్యదర్శుల విషయంలో నిర్లక్ష్యం చేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
సమున్నత లక్ష్యం.. శతశాతం ఓటింగ్తోనే పదిలం
[ 08-05-2024]
ఓటు.. ప్రజాస్వామ్య పరిరక్షణకు బలమైన పునాది. వజ్రాయుధంతో సమానమైన ఓటు హక్కు సద్వినియోగం చేసుకుంటేనే సార్థకత చేకూరుతుంది. అర్హులైన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు చేయించుకోవడంతో పాటు శత శాతం పోలింగ్ నమోదుకు ఎన్నికల సంఘం, వివిధ స్థాయిలో అధికార యంత్రాంగం కార్యక్రమాలు చేపడుతోంది. -
రహదారులకు ప్రాధాన్యం.. ఆరోగ్య భాగ్యం
[ 08-05-2024]
‘‘నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం లాంటిది. ప్రజాసంక్షేమం కోసం పని చేయాలనేది నా ఆశయం. ప్రగతి నా లక్ష్యం. వివాదాలు, విభేదాలు నా విధానం కాదు. ఈ అంశాలే నన్ను ఎంపీగా గెలిపిస్తాయనే నమ్మకం నాకు ఉంది.’’ -
ఆయన ఎన్నికల ఖర్చు రూ.500
[ 08-05-2024]
ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని ప్రతి ఒక్కరికి తెలుసు. వార్డు సభ్యుడు మొదలు ఏ ఎన్నిక జరిగినా డబ్బులు కుమ్మరించాల్సిందే. ఇక అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఖర్చులు తడిసిమోపెడవుతాయి. -
సెలవులొచ్చాయి.. యువ ఓటర్లు వస్తున్నారు
[ 08-05-2024]
సాధారణంగా చాలా సందర్భాల్లో ఎన్నికలప్పుడు వివిధ ప్రాంతాల్లో చదువుకునే యువ ఓటర్లు సొంతూరులో ఉండరు. ఒక వేళ ఓటు వేసేందుకు వద్దామనుకున్నా సెలవులు అంతగా ఉండవు. -
రక్త పిశాచి... చొరవ చూపితేనే విముక్తి
[ 08-05-2024]
తలసీమియా.. ఈ రక్తపిశాచితో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వ్యాధిగ్రస్థులు యాతన పడుతున్నారు. రోజూ మనిషి ఆహారాన్ని ఎలా కోరుకుంటాడో.. ఈ మహమ్మారి పక్షంరోజులకు ఒకసారి ఆయా బాధితుల రక్తం స్వీకరించేందుకు ఉవ్విళ్లూరుతుంటుంది. -
పోలింగ్ కేంద్రం దూరం.. అసౌకర్యాల భారం..
[ 08-05-2024]
మరో ఆరు రోజుల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అనేక అవస్థల మధ్య ఓట్లేసిన జిల్లావాసులకు మళ్లీ అసౌకర్యాలే ఎదురుకానున్నాయి. చాలా చోట్ల హడావుడిగా పనులను చేస్తున్నా.. -
భారీ వర్షం.. కాస్త ఉపశమనం!
[ 08-05-2024]
తీవ్రమైన ఎండలు, వేసవి తాపం, ఉక్కపోతతో కొన్నిరోజులుగా అల్లాడుతున్న జిల్లావాసులకు కాస్త ఉపశమనం కలిగించింది. జిల్లావ్యాప్తంగా మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. -
విరమణపై పెదవి విరుపు
[ 08-05-2024]
అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు పదవీ విరమణ ప్రయోజనాలు (బెనిఫిట్స్) అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 65ఏళ్లు నిండిన టీచర్కు రూ.లక్ష, సహాయకులకు రూ.50వేలు సహాయం ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది. -
ఎండ మాయం.. వానతో అపారనష్టం
[ 08-05-2024]
జిల్లా వ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం వరకు ఎండ నిప్పుల కొలిమిని తలపించినప్పటికీ రెండు గంటల తర్వాత వాతావరణం మారిపోయి. ఒక్కసారిగా ఈదురుగాలులు ప్రారంభమయ్యాయి. -
సామాజిక సమీక‘రణం’
[ 08-05-2024]
ఎన్నికల బరిలో నిలిచిన ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి ప్రత్యర్థి సామాజిక వర్గానికి చెందిన ఓట్లపై గురిపెట్టారు. గతకొన్ని రోజుల వరుసగా ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులను పార్టీలోకి చేర్పించుకుంటున్నారు. -
శిశువులపై చిన్నచూపు..
[ 08-05-2024]
ఎస్ఎన్సీయూ (స్పెషల్ న్యూబార్న్ కేర్ యూనిట్) సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి పర్యవేక్షణలో కొనసాగే నవజాత శిశువు సంరక్షణ కేంద్రం సదుపాయాలు కరవై, వైద్యులు అందుబాటులో లేక అవస్థలు పడుతోంది. -
మెజార్టీయే లక్ష్యం
[ 08-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచార గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీల ఎత్తుకు పైఎత్తులతో వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రచారానికి నాలుగు రోజులే మిగిలి ఉండటంతో మెజార్టీయే లక్ష్యంగా లెక్కలు వేసుకుంటూ ఓటర్లకు గాలం వేస్తున్నారు. -
ఏటా ఇదే తంతు..
[ 08-05-2024]
కాకతీయ.. ఉన్నత విద్యాప్రమాణాల్లో న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్ పొందిన విశ్వవిద్యాలయం. కానీ కొన్నేళ్లుగా తన పనితీరుతో అభాసుపాలవుతోంది. విద్యార్థుల భవితవ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, ‘వ్యక్తిగత ప్రయోజనాల’కు ప్రాధాన్యమిస్తూ కొందరు అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు దీని చరిత్రను మసకబారుస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఆ వీడియోల స్టోరీకి డైరెక్టర్, ప్రొడ్యూసర్ కుమారస్వామే: డీకే శివకుమార్
-
ప్లేఆఫ్స్ బెర్తుల్లో 2 ఫిక్స్.. మిగిలిన రెండింటి కోసం నాలుగు పోటీ
-
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను కొట్టేసిన క్యాట్
-
రోజంతా ఒడుదుడుకుల్లో సూచీలు.. చివరికి ఫ్లాట్గా
-
‘ట్రంప్తో ఏకాంతంగా గడిపా’ - కోర్టులో శృంగార తార సాక్ష్యం
-
విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరిన జగన్