ఆసిఫాబాద్ నియోజకవర్గ భాజపా అభ్యర్థి ఆత్మారాం నాయక్
ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థి ఖరారయ్యారు. రెబ్బెన మండలం ఖైరిగూడ గ్రామానికి చెందిన ఆజ్మీరా ఆత్మారాం నాయక్ను అభ్యర్థిగా ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది.
రెబ్బెన, న్యూస్టుడే : ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థి ఖరారయ్యారు. రెబ్బెన మండలం ఖైరిగూడ గ్రామానికి చెందిన ఆజ్మీరా ఆత్మారాం నాయక్ను అభ్యర్థిగా ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. భాజపా తరఫున పోటీ చేసేందుకు పలువురు ఆశావహులు తమకే టికెట్ వస్తుందని ప్రచారం కూడా నిర్వహించారు. ఎట్టకేలకు గురువారం మధ్యాహ్నం అభ్యర్థి ప్రకటనతో ఉత్కంఠకు తెరపడినట్లయింది. దీంతో ఆ పార్టీ శ్రేణులు సంబురాలు జరుపుకొన్నారు. ఇప్పటికే సిర్పూర్ నియోజకవర్గానికి డా.పాల్వాయి హరీశ్బాబును ప్రకటించిన విషయం విదితమే.
ఆత్మారాం నాయక్ 2014 నుంచి తెరాస ఎస్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగారు. శాసనసభ రద్దు అనంతరం ఎన్నికలు అనివార్యం కావడంతో ఆయన ఆ పార్టీకి రాజీనామా చేసి భాజపాలో చేరారు. వ్యవసాయ కుటుంబ నేపథ్యం ఉన్న ఆయనకు రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న అనుభవం ఉంది. 2019లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో.. ఆయన సతీమణి సంధ్యారాణి భాజపా తరఫున ఖైరిగూడ సర్పంచిగా గెలుపొందారు.
ఒకే తేదీ.. ఇది రెండోసారి!
ఆసిఫాబాద్ అభ్యర్థిత్వం ఆత్మారాం నాయక్ను రెండుసార్లు వరించింది. గత ఎన్నికల సందర్భంగా.. భాజపా ఎమ్మెల్యే అభ్యర్థిగా 2018 నవంబరు 2న అధిష్ఠానం ప్రకటించింది. మళ్లీ ఇప్పుడు నవంబరు 2వ తేదీనే అభ్యర్థిగా ప్రకటన వెలువడం గమనార్హం.
గెలుపునకు కృషి
భాజపా అధిష్ఠానం తనపై నమ్మకంతో అభ్యర్థిగా ప్రకటించిందని ఆత్మారాం నాయక్ తెలిపారు. పార్టీ శ్రేణులందరినీ కలుపుకొని గెలుపు కోసం కృషి చేస్తానన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్తానని పేర్కొన్నారు. ప్రధాని మోదీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్కుమార్, ఎంపీ సోయం బాబురావుకు కృతజ్ఞలు తెలిపారు.
వివరాలు
పేరు : ఆజ్మీరా ఆత్మారాం నాయక్
తండ్రి : చంద్రునాయక్
తల్లి : నారిబాయి
భార్య : సంధ్యారాణి (సర్పంచి, ఖైరిగూడ)
కూతుళ్లు : నవ్యశ్రీ నాయక్, నందిని నాయక్
సోదరుడు : వినాయక్
సోదరీమణులు : ఆరుగురు
కులం : ఎస్టీ (లంబాడీ)
విద్యార్హతలు : బీఎస్ఈ, బీజడ్సీ, ఎంఎస్డబ్ల్యూ
వృత్తి : వ్యాపారం, వ్యవసాయం
పార్టీ పదవీ : భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్రమాలకే ప్రా‘ధాన్యం’?
[ 28-04-2024]
ఎక్కడ ముడిసరకు లభ్యమవుతుందో సాధారణంగా అక్కడే పరిశ్రమలు ఏర్పాటు చేస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం ధాన్యం ఆశించిన రీతిలో పండకున్నా ఇక్కడ ఏకంగా తొమ్మిది రైస్ మిల్లులు ఏర్పాటయ్యాయి. -
భాజపా బలగాల మోహరింపు
[ 28-04-2024]
ఉమ్మడి జిల్లా పరిధిలోకి వచ్చే ఆదిలాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకునేలా భాజపా కార్యాచరణ చేపట్టింది. -
మండుటెండల్లో అంటుకుంటున్న అడవులు
[ 28-04-2024]
జిల్లాలో గతంకంటే ఈ ఏడాది ఎండల తీవ్రత అత్యధికంగా ఉండి ఉదయం పది గంటలకే ఇంటి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. -
వంద ఎకరాలు కొట్టేసే పన్నాగం
[ 28-04-2024]
‘వడ్డించే వాడు మనవాడైతే చివర్లో కూర్చున్నా కంచంలోకి అన్నీ వచ్చి చేరుతాయి’ అన్న చందంగా అధికారులు, నేతలు కుమ్మక్కై వంద ఎకరాల భూమిని ఆక్రమించే ప్రయత్నం సాగుతోంది. -
నిధులు రాక.. నిర్వహణ లేక
[ 28-04-2024]
రైతులకు పండ్ల తోటల పెంపకంపై శిక్షణ ఇవ్వడం, మొక్కల ఉత్పత్తి కోసం ఏర్పాటు చేసిన ఉద్యానవన నర్సరీ, రైతు శిక్షణ కేంద్రాలు నిర్వహణ లోపంతో మూతపడే దశకు చేరుకున్నాయి. -
ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
[ 28-04-2024]
కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలను ఇంటింటికీ తీసుకెళ్లి ప్రజలకు వివరించాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క కార్యకర్తలకు సూచించారు. -
నేర ప్రవృత్తి మార్చుకోవాలి : ఎస్పీ
[ 28-04-2024]
జిల్లాలో గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి శనివారం సాయంత్రం 6 గంటల వరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు జిల్లా ఎస్పీ కె.సురేష్కుమార్ తెలిపారు. -
ఓటర్లు @ 15,96,430
[ 28-04-2024]
మంచిర్యాల విద్యావిభాగం, న్యూస్టుడే: ప్రస్తుత లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితా కొలిక్కివచ్చింది. -
సిబ్బంది కొరత.. వసతుల లేమి
[ 28-04-2024]
జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో సిబ్బంది కొరత, వసతుల లేమితో సరైన సేవలు అందక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ను గెలిపించాలి
[ 28-04-2024]
మనిషికి చేతులు ఎంతముఖ్యమో.. దేశానికి చేతిగుర్తు పార్టీ అవసరం అంతే ఉందని కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ కోరారు. -
అవగాహన లేక.. అనుమతి పొందక..!
[ 28-04-2024]
పెళ్లి.. రిసెప్షన్.. పుట్టినరోజు.. ఇలా వేడుకేదైనా చాలామంది ఎంతో ఆర్భాటంగా నిర్వహించాలనుకుంటున్నారు. -
నీతి ఆయోగ్ పథకం.. అమలైతే అభివృద్ధి యోగం
[ 28-04-2024]
మారుమూల గిరిజన ప్రాంతమైన పెంబి మండలం అభివృద్ధికి ఆమడదూరంలో ఉంది. కనీస వసతులు, రవాణా సౌకర్యాలు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులు అనేకం. -
గుంపులున్న చోటుపై గురి..
[ 28-04-2024]
ఎన్నికల ప్రచారానికి మరో 14 రోజులు మాత్రమే గడువుంది. లోక్సభ పరిధిలో రెండు వేలకు పైగా గ్రామాలు, 380కి పైగా గూడేలు, తండాలు ఉన్నాయి. -
పెద్దపల్లిలో స్థానికేతరులకే పెద్దపీట
[ 28-04-2024]
పెద్దపల్లి పార్లమెంటు స్థానానికి ఎంపీలుగా ఎన్నికైనవారిలో ఇప్పటి వరకు స్థానికులెవరూ విజయం సాధించలేకపోయారు. -
మండే ఎండతో జాగ్రత్త..
[ 28-04-2024]
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆరెంజ్ జోన్లో ఉందని, జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. -
తూర్పున ఎంపీ.. పశ్చిమాన అభ్యర్థి
[ 28-04-2024]
జన్నారం మండలంలోని తిమ్మాపూర్ గ్రామం మరోసారి తెరపైకి వచ్చింది. -
వేసవి తాపం.. కొబ్బరినీరే ఉపశమనం
[ 28-04-2024]
రామకృష్ణాపూర్లోని ఆర్కేపీ ఓసీ, సీహెచ్పీ, సింగరేణి ఏరియా ఆసుపత్రితో పాటు కాలనీల్లో భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
-
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
-
ఆదుకుంటానన్నావ్.. పీల్చి పిప్పి చేశావ్!!
-
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్
-
ఏడు పదుల వయసులో.. ‘ఇంటర్’ పరీక్షలు!
-
సామాన్యుడిని వదిలేసి.. సారొస్తే కోట్లు తగలేసి