వలసల జోరు.. కారు బేజారు!
పార్లమెంట్ ఎన్నికల నామపర్వానికి ముందు జిల్లాలో అనూహ్య పరిమాణాలు చోటుచేసుకుంటున్నాయి. పట్టున్న నాయకులందరూ కాంగ్రెస్, భాజపా పార్టీలోకి చేరుతున్నారు.
జిల్లాలో మారుతున్న సమీకరణాలు..
ఈనాడు, ఆసిఫాబాద్: పార్లమెంట్ ఎన్నికల నామపర్వానికి ముందు జిల్లాలో అనూహ్య పరిమాణాలు చోటుచేసుకుంటున్నాయి. పట్టున్న నాయకులందరూ కాంగ్రెస్, భాజపా పార్టీలోకి చేరుతున్నారు. రాజకీయ భవిష్యత్తు కోసం నాయకులు కండువాలు మార్చడం నిత్యకృత్యంగా మారుతోంది. పైన మన ప్రభుత్వం లేదని, ఎమ్మెల్యేలతో వివిధ అంశాలతో పొసగక, నామినేటెడ్ పదవుల భరోసాతో నేతలు పార్టీ మారుతున్నట్లుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. దాదాపు వంద రోజుల కిందట వరకు నిండుగా ఉన్న భారాస పార్టీ నుంచి అధికంగా నాయకులు ఇతర పార్టీల్లోకి మారడంతో.. ఆ పార్టీ క్రమంగా బలహీనపడుతోంది. ఈ చేరికలు ఏ మేరకు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం చూపుతాయనేది ఆసక్తికరంగా మారింది.
నాలుగు దశాబ్దాలుగా రాజకీయంలో ఉంటూ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆసిఫాబాద్ జడ్పీటీసీ సభ్యుడు అరిగెల నాగేశ్వరరావు, సోదరుడు ఎంపీపీ మల్లికార్జున్లు భారాసను వీడి భాజపాలో చేరారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తెదేపా అధ్యక్షుడిగా ఉన్న సమయం నుంచే అరిగెలకు ప్రస్తుత భాజపా పార్లమెంట్ అభ్యర్థి గోడం నగేష్కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇటీవలి శాసనసభ ఎన్నికల నుంచే స్థానిక ఎమ్మెల్యే, ఇతర నేతలపై అరిగెల కినుక వహించారనే ప్రచారం ఉంది. తాజాగా ఆయన పార్టీ వీడటం ఈ వాదనకు బలం చేకూర్చుతోంది. ఆయన దారిలోనే రెబ్బెన జడ్పీటీసీ సభ్యుడు కాంగ్రెస్లో చేరారు. తిర్యాణి మండలాలకు చెందిన జడ్పీటీసీ సభ్యులు, పలువురు సర్పంచులు ఇటీవలే భారాసను వీడుతున్నట్లుగా ప్రకటించినా.. అనంతరం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.
సవాల్గా మారనున్న ఎన్నికలు..
జిల్లాలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి భారాసకు పెద్దదిక్కుగా ఉన్నారు. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే తన అనుచరగణంతో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం విదితమే. ఇప్పటికే పలు మండలాల జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, సర్పంచులు భాజపా, కాంగ్రెస్ పార్టీల్లో చేరారు. ఈ తరుణంలో పార్లమెంట్ ఎన్నికలు భారాస నేతలకు సవాల్గా మారుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోవ లక్ష్మికి స్థానికంగా మైనార్టీ నేతల మద్దతుతోపాటు, ఆదివాసీ ఓటుబ్యాంకు వచ్చే ఎన్నికల్లో కలిసి వస్తుందని భారాస నేతలు చెబుతుండగా.. అరిగెల నాగేశ్వరరావు చేరికతో భాజపా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో బలం పుంజుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సిర్పూర్లో ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్లు అన్నీ తామై పార్టీని ముందుకు నడిపిస్తుండగా.. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో నాయకత్వలేమి ఉంది. అరిగెల రాకతో భాజపాకు ముఖ్యంగా రెబ్బెన, వాంకిడి, ఆసిఫాబాద్ మండలాల్లో క్షేత్రస్థాయిలో బలమైన కేడర్ ఏర్పడుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి. జిల్లాలో ఇప్పటికే భాజపా, కాంగ్రెస్, భారాస పార్టీ అభ్యర్థులు మొదటి విడత ప్రచారాన్ని ముగించారు.
ఎమ్మెల్యే కోవ లక్ష్మి పరిస్థితి?
కొంత కాలం నుంచి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి మారుతున్నట్లుగా వస్తున్న ఆరోపణలను ఆమె పలుమార్లు ఖండించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే సక్కును కాదని, టికెట్ కేటాయించగా.. గెలుపొందారని, ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో భారాస ఆదిలాబాద్ అభ్యర్థి ఆత్రం సక్కుకు గెలిపించే బాధ్యతను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోవ లక్ష్మికి అప్పజెప్పారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా భారాస అధ్యక్షుడు జోగు రామన్న, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఎమ్మెల్సీ దండే విఠల్తో సమన్వయం చేసుకుంటూ కోవ లక్ష్మి పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బైండోవర్ ఉల్లంఘన కేసుల్లో తాఖీదులు
[ 30-04-2024]
బైండోవర్ ఉల్లంఘన కేసుల్లో నిందితులు రూ.ఒక లక్ష చొప్పున చెల్లించాలని మావల తహసీల్దార్ తాఖీదులు జారీ చేశారు. -
పదవి విరమణ పొందిన ఎస్ఐకి ఘన సన్మానం
[ 30-04-2024]
అదిలాబాద్ రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తూ మంగళవారం పదవి విరమణ పొందిన జీవీ రమణారెడ్డి, అతని సతీమణి విజయలను ఎస్పీ గౌష్ ఆలం పోలీస్ ముఖ్య కార్యాలయంలో శాలువాలు కప్పి, మిఠాయిలు తినిపించి, బహుమతులు అందజేసి ఘనంగా సత్కరించారు. -
కరాటే బెల్టులు అందజేత
[ 30-04-2024]
జిల్లా కేంద్రం తిలక్ నగర్లోని అరుణోదయ పాఠశాలలో మంగళవారం బాల, బాలికలకు కరాటేలో గ్రేడింగ్ పరీక్ష నిర్వహించారు. -
జహీరాబాద్ లో కాంగ్రెస్ పార్టీదే గెలుపు
[ 30-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్ధి సురేష్ షట్కర్ భారీ మెజారటీ తో గెలవబోతున్నారని మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు రాములు నాయక్ ధీమా వ్యక్తం చేశారు. -
జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన ఎస్పీ
[ 30-04-2024]
ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా మంగళవారం బాధ్యతలు చేపట్టిన కే.ప్రభాకర్ రావును జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఆయన చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. -
పది ఫలితాల్లో విద్యార్థుల ప్రతిభ
[ 30-04-2024]
అదిలాబాద్ జిల్లా తాంసి మండలం కప్పరల ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు మంగళవారం వెలువడిన పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. -
జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన ప్రభాకర్ రావు
[ 30-04-2024]
అదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ప్రభాకర్ రావు మంగళవారం బాధ్యతలు చేపట్టారు. -
లాండ్రీకి తీరిన నీటి సమస్య
[ 30-04-2024]
రిమ్స్లో నిర్వహిస్తున్న ల్యాండ్రీకి నేడు సమస్య పరిష్కారమైంది. -
సాహిత్య సదస్సుపై దాడి ముమ్మాటికీ ఉన్మాద చర్యే
[ 30-04-2024]
ఇటీవల వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన 'లౌకిక విలువలు- సాహిత్యం' అనే సదస్సులో చొరబడి ఫాసిస్ట్ మూకలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఝాన్సీ పేర్కొన్నారు. -
వ్యాను బోల్తా పడి.. 20 మందికి గాయాలు
[ 30-04-2024]
గుడిహత్నూర్ మండలంలోని సీతాగొంది సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వ్యాను బోల్తాపడడంతో 20 మందికి గాయాలయ్యాయి. -
భారాస ఇంటింటి ప్రచారం
[ 30-04-2024]
తాంసి మండలం పాలోది, జామిడి గ్రామాల్లో మంగళవారం భారాస నాయకులు ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
అగ్రనేతలొస్తున్నారు
[ 30-04-2024]
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయం క్రమంగా వేడెక్కుతోంది. అగ్రనేతలు రానుండటంతో ప్రచారం పతాకస్థాయికి చేరుకుంటోంది. -
కాంగ్రెస్కు ఓటేస్తే భవిష్యత్తుకు లేదు గ్యారెంటీ!
[ 30-04-2024]
హస్తం పార్టీకి ఓటు వేస్తే భవిష్యత్తుకు గ్యారెంటీ లేదని, ఉచిత పథకాలు ఉత్తి మాటలేనని భారాస ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు, మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. -
పెరుగుతున్న ఎండ.. వసతులుంటేనే అండ
[ 30-04-2024]
రోజురోజుకూ పెరుగుతున్న ఎండల తీవ్రత కారణంగా లోక్సభ ఎన్నికల నిర్వహణ విషయంలో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోక తప్పని పరిస్థితి నెలకొంది. -
దురాశకు పోయి.. దుఃఖానికి చేరువై
[ 30-04-2024]
ప్రభుత్వ ఉద్యోగం.. చాలామందికి తీరని కల. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎంతో కష్టపడితే, అదృష్టం కలిసొస్తే తప్ప సొంతమవని జీవితం. -
చోదకుల నిర్లక్ష్యం.. గాలిలో ప్రాణాలు
[ 30-04-2024]
కారణాలు ఏమైనా రహదారులపై సరకు రవాణా వాహనాలు నిర్లక్ష్యంగా నిలుపుతున్నారు. నిద్రమత్తు, అతివేగం, పొగమంచు, తదితర కారణాలతో రహదారిపై నిలిచి ఉన్న వాహనాలను గమనించలేని ప్రయాణికుల వాహనాల చోదకులు వాటిని బలంగా ఢీకొంటున్న ఘటనలు పెరుగుతున్నాయి. -
ప్రజాప్రతినిధుల తీరు.. నాయకుల బేజారు
[ 30-04-2024]
జిల్లాలో ఇటీవల ఓ ప్రధాన పార్టీ సభ నిర్వహించింది. ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి జనసమీకరణ బాధ్యతను ఆయా వార్డుల బాధ్యులకు అప్పగించారు. ఒక్కొక్కరికి ఒక్కో సంఖ్యను లక్ష్యంగా ఇచ్చి పూర్తి చేయాలని ఆదేశించారు. -
భారాసను గెలిపిస్తేనే హామీల అమలు
[ 30-04-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారాసను గెలిపిస్తేనే కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలుకు నోచుకుంటాయని పెద్దపల్లి పార్లమెంట్ స్థానం భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. -
భాజపాకు కలిసొచ్చేనా?
[ 30-04-2024]
పెద్దపల్లి ఎంపీ బొర్లకుంట వెంకటేశ్నేత పార్టీ మార్పు ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. హైదరాబాద్లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి సమక్షంలో సోమవారం ఆయన భాజపా తీర్థం పుచ్చుకున్నారు. -
ధనార్జనే ధ్యేయం.. వైద్యం ప్రాణాంతకం
[ 30-04-2024]
రెండ్రోజుల కిందట కాగజ్నగర్లోని నౌగాంబస్తీకి చెందిన నిండు గర్భిణి ప్రసూతి నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి ఉదయం వెళ్లింది. స్కానింగ్ చేసిన వైద్యులు పురిటిల్లోనే శిశువు మృతి చెందినట్లు నిర్ధారించారు. -
నిబంధనలకు లోబడి ఎన్నికల విధుల నిర్వహణ
[ 30-04-2024]
లోకసభ ఎన్నికల్లో భాగంగా సిర్పూరు, ఆసిఫాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్నికల ప్రక్రియను నిబంధనలకు లోబడి సమర్థంగా నిర్వహించాలని ఆదిలాబాద్ పార్లమెంటు -
ఆదిలాబాద్ బరిలో 12 మంది అభ్యర్థులు
[ 30-04-2024]
ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. నామపత్రాల పరిశీలన అనంతరం 13 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. -
కొనసాగుతున్న సార్వత్రిక పరీక్షలు
[ 30-04-2024]
ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా మంచిర్యాల, బెల్లంపల్లి డివిజన్ కేంద్రాల్లో 8 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలను విద్యాశాఖ నిర్వహిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ విషయం జెఫ్ బెజోస్ నుంచే నేర్చుకున్నా
-
డీల్ కుదిరినా.. కుదరకపోయినా రఫాపై దండయాత్రే: నెతన్యాహు
-
ముత్యాల దండతో శ్రీలీల.. రాశీఖన్నా ‘బాక్’ స్టిల్.. మీనాక్షి స్మైల్
-
ఎన్నికల ముందే కేజ్రీవాల్ అరెస్టు ఎందుకు? ఈడీకి ‘సుప్రీం’ ప్రశ్న
-
ఐపీఎల్ ప్లేఆఫ్స్ మ్యాచ్లకు ఇంగ్లాండ్ స్టార్ ఆటగాళ్లు దూరం.. కారణమిదే
-
వివేకా హత్య తర్వాత అవినాష్.. జగన్కు ఫోన్ చేసి ఏం మాట్లాడారు?: సునీత