గొలుసుకట్టు.. అక్రమాలతో కనికట్టు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా పదేళ్ల కిందట ఓ జిల్లా అధికారి నేతృత్వంలో సాగిన గొలుసుకట్టు వ్యాపారంలో తవ్వినకొద్దీ మరిన్ని అక్రమాలు వెలుగుచూస్తున్నాయి.
వసూలు రూ. 20 కోట్లు.. బాధితులు రెండువేలపైనే..
పాలనాప్రాంగణం, న్యూస్టుడే: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా పదేళ్ల కిందట ఓ జిల్లా అధికారి నేతృత్వంలో సాగిన గొలుసుకట్టు వ్యాపారంలో తవ్వినకొద్దీ మరిన్ని అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. తొలుత ఆదిలాబాద్ జిల్లాలోనే ఈ వ్యాపారం కొనసాగినట్లు తెలిసినా ఉమ్మడి జిల్లా మొత్తంగా బాధితులు ఉండటం మరింత కలకలం రేపుతోంది. సోమవారం ‘ఈనాడు’లో ‘జిల్లా అధికారి.. మోసానికి సూత్రధారి’ శీర్షికన కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. దీనికి స్పందించిన పాలనాధికారి రాజర్షి షా క్షేత్రస్థాయిలో ఏం జరిగిందో? బాధ్యులు ఎవరో విచారించాలని జిల్లా ఎస్పీకి సూచించినట్లు సమాచారం. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు మంగళవారం ఆదిలాబాద్ పట్టణంలోని బస్టాండ్ సమీపంలోని కంపెనీ కార్యాలయానికి వెళ్లి విచారించారు. అక్కడ సిబ్బంది ఒక్కరే ఉండటంతో ఎంతమంది సభ్యులు ఉంటారనే సమాచారం మాత్రం తెలుసుకోగలిగారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 2 వేలపైనే డిపాజిటర్లు ఉన్నట్లు తెలిసినా.. ఎంత మేర డబ్బులు వారికి చెల్లించాల్సి ఉందో మాత్రం తన వద్ద సమాచారం లేదని సిబ్బంది చేతులెత్తేశారు. ఒక్కొక్కరి నుంచి రూ.లక్షలు వసూలు చేసినట్లు భావించినా.. దాదాపు రూ.20 కోట్ల మేర డబ్బులు డిపాజిట్దారులకు రావాల్సి ఉన్నట్లే. ‘ఈనాడు’ కథనం నేపథ్యంలో ఆ కంపెనీ జిల్లా కేంద్ర కార్యాలయానికి సోమ, మంగళవారాల్లో గతంలో డబ్బులు చెల్లించి బాండ్ల గడువు ముగిసిన వారి తాకిడి పెరిగింది. ఈ వ్యవహారంలో సూత్రధారిగా ఉన్న అధికారి ప్రస్తుతం పొరుగు జిల్లాలో పనిచేస్తూ తన కింద ఉన్న ప్రధాన ఏజెంట్లతో సంప్రదింపులు జరపడం ప్రారంభించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన సూచన మేరకు పాత్రధారులుగా ఉన్న ఏజెంట్లు మంగళవారం పట్టణంలోని గాంధీ పార్కులో రహస్యంగా సమావేశమయ్యారు. ఈ విషయాన్ని నిఘావర్గాలు సైతం ధ్రువీకరించాయి. ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లతో కలిసి గొలుసుకట్టు వ్యాపారం నిర్వహించిన సదరు అధికారి బాధితులకు తిరిగి డబ్బులు చెల్లించేలా ఓ ప్రతిపాదన ముందుకు తెచ్చినట్లు తెలుస్తోంది.
100 ఎకరాల కంపెనీ భూమిపై దృష్టి
రాష్ట్రవ్యాప్తంగా గొలుసుకట్టు వ్యాపారం కొనసాగించిన కంపెనీవారు జిల్లాలవారీగా ఏజెంట్లను నియమించుకుని ఆకర్షణీయ ప్యాకేజీలు, కమీషన్లతో అమాయకుల నుంచి డిపాజిట్లు సేకరించింది. ఇందులో అత్యధికులు టీచర్లు ఏజెంట్లుగా ఉండటం, ఈ విషయం వెలుగులోకి రావడంతో తమ ఉద్యోగానికి ఎక్కడ ఎసరు వస్తుందననే భయం వెంటాడుతోంది. కంపెనీ గతంలో హైదరాబాద్ నగర శివారులోని బీబీనగర్, పింజర్ల గ్రామాల్లో 200 ఎకరాల్లో వెంచర్లు ఏర్పాటు చేసింది. ఇందులో కొంతమేర ఇటీవల కరీంనగర్కు చెందిన ఏజెంట్లకు కంపెనీ కట్టబెట్టిందని, అలా విక్రయించిన డబ్బులను ఏజెంట్లు డిపాజిట్దారులకు చెల్లించినట్లు తెలుసుకున్న జిల్లా ఏజెంట్లు తాము అదేమార్గం అనుసరించాలని భావిస్తున్నట్లు రహస్య భేటిలో నిర్ణయించినట్లు తెలిసింది. ఇదే విషయమై కంపెనీ ప్రతినిధులతో చర్చించి బాధితులకు తిరిగి డబ్బులు ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం.
పోలీసులు ఏమంటున్నారంటే..
ఇది ప్రైవేటు కంపెనీ వ్యవహారం కాబట్టి సూత్రధారిగా ఉన్న అధికారినిగానీ, ఆయన కింద ఉన్న ఏజెంట్లను గానీ నేరుగా విచారించాలంటే బాధితులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని పోలీసువర్గాలు సూచిస్తున్నాయి. ఫిర్యాదు అందితే సదరు అధికారితోపాటు ఏజెంట్లుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్ల చుట్టూ ఉచ్చు బిగించే అవకాశముంటుందనే అభిప్రాయం ఆ వర్గాల నుంచి వినిపిస్తోంది. తమవంతుగా కంపెనీ లావాదేవీలు, నిర్వాహకులు, ఏజెంట్లు ఏం చేశారన్నది ఇప్పటికే ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక పంపించినట్లు ఆ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కమలదళం.. కదనోత్సాహం
[ 06-05-2024]
‘‘గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబాకు ప్రణామం.. బాసర సరస్వతీ, పోరాటయోధుడు కుమురం భీం, రాంజీగోండ్, కొండా లక్ష్మణ్ బాపూజీలకు ప్రణామాలు..’’ అంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా కాగజ్నగర్లో నిర్వహించిన వికాస సంకల్ప సభలో ప్రసంగం ప్రారంభించారు. -
‘గిరి’యువతకు ఉపాధి కరవు
[ 06-05-2024]
ఆదివాసీ గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కలగానే మిగులుతోంది. యూత్ ట్రైనింగ్ సెంటర్(వైటీసీ)లలో యువత ఆసక్తి, అభిరుచికి అనుగుణంగా నైపుణ్యాల శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాల్సి ఉండగా.. శిక్షణ కార్యక్రమాల నిర్వహణ, జాబ్ మేళాల ఏర్పాటు కోసం నిధుల కేటాయింపులో ప్రభుత్వం జాప్యం చేస్తోంది. -
కాంగ్రెస్లో కొత్తదనం.. కలిసొచ్చిన పాతతరం
[ 06-05-2024]
ప్రజలకు అభివాదం చేస్తూ, యువతకు స్వీయచిత్రాల అవకాశమిచ్చిన అగ్రనేత రాహుల్గాంధీ, గాడిద గుడ్డు కథ వివరిస్తూ నినాదాలు చేయించిన సీఎం రేవంత్రెడ్డి, ఒకే వేదికపై కూచాడి శ్రీహరిరావు, ఇంద్రకరణ్రెడ్డి, విఠల్రెడ్డి, వేణుగోపాలాచారి కనిపించటం, భారీగా తరలివచ్చిన జనం.. -
మండుతున్న ఎండలు.. వేడెక్కుతున్న భవనాలు
[ 06-05-2024]
వేసవిలో మండుతున్న ఎండలకు పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతున్నాయి. సిమెంటు కాంక్రీటు భవనాలు వేడెక్కుతున్నాయి. సాధారణంగా గది ఉష్ణోగ్రత 24 డిగ్రీలు ఉంటుంది. మండుతున్న ఎండలతో ఈ ఉష్ణోగ్రతలు సైతం సాధారణ స్థాయిని మించి నమోదవుతున్నాయి. -
కేంద్రాలు దూరం.. తప్పని భారం!
[ 06-05-2024]
కాకతీయ విశ్వవిద్యాలయ (కేయూ) పరిధిలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న డిగ్రీ పరీక్షల్లో విద్యార్థులకు అవస్థలు తప్పేలా లేవు. వారం రోజులుగా 45, 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ ఉదయం నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. -
ప్రశాంతంగా నీట్
[ 06-05-2024]
వైద్య విద్యలో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్ యూజీ-2024) ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో 5 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. -
సెలవు కరవు.. విధుల బరువు..
[ 06-05-2024]
కనిపించని నాలుగో సింహం పోలీస్. ఇది అక్షర సత్యం. అదే సమయంలో పోలీసు జీవితం వెనక కనిపించని కష్టాలు, ఒత్తిళ్లు, ఆరోగ్య, కుటుంబ సమస్యలతో పోలీసులు మానసికంగా కుంగిపోతున్నారు. ఖాకీ చొక్కా.. ప్యాంటులో హుందాతనంగా కనిపిస్తుంటారు. -
వసతులు లేక ఇక్కట్లు
[ 06-05-2024]
పేదలకు గూడు కల్పించేందుకు గత ప్రభుత్వం తీసుకొచ్చిన రెండు పడకగదుల ఇళ్ల పథకంలో భాగంగా పట్టణంలోని బంగల్పేట్ శివారులో పెద్దమొత్తంలో జీప్లస్2 విధానంలో గృహాలను నిర్మించారు. -
చిన్నగూడు.. ఆదర్శం చూడు
[ 06-05-2024]
ఎక్కడి నుంచో వలస వచ్చిన కూలీలు వారు. ఉండేందుకు తాత్కాలికంగా టార్పాలిన్లతో కట్టుకున్న నివాసాలు వారివి. పనికెళితేనే పూట గడిసే పరిస్థితి. వారి గురించి ఇంతే చెబితే అందులో ప్రత్యేకత ఉండదు. -
పెళ్లైన నాలుగు రోజులకే..
[ 06-05-2024]
బెల్లంపల్లి మండలం కాసిరెడ్డిపల్లె గ్రామంలో ఆదివారం ఓ నవ వధువు వరుడి ఇంటి ముందు బంధువులతో కలిసి ఆందోళన చేసింది. వధువు కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. -
పెన్సిల్తో అద్భుతాలు.. జీవం ఉట్టిపడేలా చిత్రాలు
[ 06-05-2024]
చిన్నప్పటి నుంచి బొమ్మలు వేయడమంటే అమితాసక్తి ప్రదర్శించే ఆ యువకుడు పెన్సిల్తో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. బొమ్మను చూస్తే చాలు ఉన్నది ఉన్నట్టు గీస్తూ ఔరా అనిపిస్తున్నాడు. -
డిగ్రీ ప్రవేశాల.. ‘దోస్త్’
[ 06-05-2024]
ప్రభుత్వం డిగ్రీ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) ప్రకటన జారీ చేసింది. డిగ్రీ కళాశాలల్లో సీట్ల భర్తీకి ఈ నెల 6వ తేదీ రిజిస్ట్రేషన్లు ప్రారంభమై మూడు విడతల్లో సీట్లు కేటాయింపు జరగనుంది. -
నేటి నుంచి డిగ్రీ పరీక్షలు
[ 06-05-2024]
కాకతీయ విశ్వవిద్యాలయ పరిధిలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఒకవైపు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రస్తుత తరుణంలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ తదితర కోర్సుల్లో రెండు, నాలుగు, ఆరో సెమిస్టర్ పరీక్షల నిర్వహిస్తుండటం సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
క్రాంతినగర్ ఘటనలో 40 మందిపై కేసులు
[ 06-05-2024]
ఆదిలాబాద్ పట్టణంలోని క్రాంతినగర్లో శుక్రవారం రాత్రి, శనివారం చోటు చేసుకున్న అవాంఛనీయ ఘటనలో ఇరు వర్గాలకు చెందిన 40 మందిని బాధ్యులుగా గుర్తించి ఆదిలాబాద్ రెండో పట్టణ పోలీసులు ఆదివారం కేసులు నమోదు చేశారు. -
విజ్ఞాన భాండాగారం.. అంతర్జాలం
[ 06-05-2024]
దేశంలో ఓ వైపు ఎన్నికల వేడి, హడావుడి నడుస్తుండగా విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులకు పోటీ పరీక్షల కాలం ముందుంది. రాజకీయ నాయకులు ఓట్ల కోసం పోటీ పడుతుండగా నిరుద్యోగులు ఉద్యోగాల కోసం పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు.