logo

Crime News: అసూయతో ఆవు పొదుగు కోసి పైశాచికం

తన వద్ద ఉన్నప్పుడు ఎక్కువ పాలు ఇవ్వని ఆవు.. అమ్మేసిన తర్వాత ఎక్కువ ఇస్తోందన్న అసూయతో ఆవు పొదుగును కోసిన అమానవీయ ఘటన మంగళవారం హిందూపురం పట్టణంలోని శ్రీకంఠపురంలో చోటు చేసుకొంది. ఆ ప్రాంతానికి చెందిన బీరప్ప తక్కువ పాలు ఇస్తోందని

Published : 24 Jan 2024 04:52 IST

బీరప్ప

హిందూపురం పట్టణం, న్యూస్‌టుడే: తన వద్ద ఉన్నప్పుడు ఎక్కువ పాలు ఇవ్వని ఆవు.. అమ్మేసిన తర్వాత ఎక్కువ ఇస్తోందన్న అసూయతో ఆవు పొదుగును కోసిన అమానవీయ ఘటన మంగళవారం హిందూపురం పట్టణంలోని శ్రీకంఠపురంలో చోటు చేసుకొంది. ఆ ప్రాంతానికి చెందిన బీరప్ప తక్కువ పాలు ఇస్తోందని తన ఆవును వారం కిందట అదే కాలనీలోని మరొకరికి విక్రయించాడు. వారు నిత్యం పచ్చిమేత, దాణా అందించడంతో ఎక్కువ పాలు ఇస్తోంది. తన దగ్గర ఉన్నప్పుడు తక్కువ ఇచ్చి, వారికి ఎక్కువ ఇస్తోందని బీరప్పలో అసూయ, ద్వేషం రగిలిపోయింది. దీంతో గడ్డివాము దగ్గర ఉన్న ఆవు వద్దకు వెళ్లి పొదుగును కోసేశాడు. స్థానికులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని