logo

స్పందనలో 113 వినతులు

స్పందన అర్జీలకు ప్రాధాన్యమిచ్చి సమస్యల్ని నిర్ణీత కాలవ్యవధిలోగా పరిష్కరించాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ ఆదేశించారు. జిల్లా సచివాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి 113 వినతులు వచ్చాయి. వీటిలో రెవెన్యూ

Published : 18 Jan 2022 04:52 IST

అర్జీదారుతో మాట్లాడుతున్న కలెక్టర్‌ హరినారాయణన్‌

చిత్తూరు(జిల్లా సచివాలయం), న్యూస్‌టుడే: స్పందన అర్జీలకు ప్రాధాన్యమిచ్చి సమస్యల్ని నిర్ణీత కాలవ్యవధిలోగా పరిష్కరించాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ ఆదేశించారు. జిల్లా సచివాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి 113 వినతులు వచ్చాయి. వీటిలో రెవెన్యూ సమస్యలు 69, డీఆర్‌డీఏ 9, పౌరసరఫరాల శాఖ నాలుగు, హౌసింగ్‌ రెండు, సంక్షేమశాఖలు 11, పోలీసుశాఖ మూడు, ఇతర శాఖలకు సంబంధించి 15 అర్జీలు ఉన్నాయి. జేసీ (హౌసింగ్‌) వెంకటేశ్వర్‌, డీఆర్వో మురళి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని