ఫైబర్ నెట్కు ఆదరణేదీ?
పలమనేరు పట్టణంలో మొత్తం 12 వేల కుటుంబాలు ఉంటే.. అన్ని కుటుంబాలకూ ఈ నెట్ కనెక్షన్ అవసరం ఉంటుంది. అయితే కేవలం వందల్లోనే ఏపీ ఫైబర్ కనెక్షన్లు ఉన్నాయి. మిగిలిన వారంతా ఇతర కంపెనీల నెట్ కనెక్షన్లతో బిల్లులు చెల్లిస్తున్నారు.
గ్రామీణ ప్రజలకు సక్రమంగా అందని సేవలు
ఏ మాత్రం పెరగని సర్వీసులు
పలమనేరు పట్టణంలో మొత్తం 12 వేల కుటుంబాలు ఉంటే.. అన్ని కుటుంబాలకూ ఈ నెట్ కనెక్షన్ అవసరం ఉంటుంది. అయితే కేవలం వందల్లోనే ఏపీ ఫైబర్ కనెక్షన్లు ఉన్నాయి. మిగిలిన వారంతా ఇతర కంపెనీల నెట్ కనెక్షన్లతో బిల్లులు చెల్లిస్తున్నారు.
పలమనేరు, న్యూస్టుడే: గత ప్రభుత్వం అన్ని ప్రాంతాల ప్రజల కోసం, రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ నెట్ కనెక్షన్ ఇవ్వడానికి ఏపీ ఫైబర్ నెట్వర్క్ను ప్రారంభించింది. చాలా వరకు కనెక్షన్లు పొందిన ప్రజలు నెట్ సేవలను అందుకుంటున్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వ ఆదరణ మాత్రం ఈ పథకానికి అందలేదు. జిల్లా వ్యాప్తంగా ఇందుకు సంబంధించిన సర్వీసులను ఏమాత్రం పెంచలేదు. గతంలో ప్రభుత్వం ఇచ్చినవే ఉన్నాయి. కొత్తగా పెరగకపోవడానికి ప్రభుత్వం దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టలేదని స్పష్టమవుతోంది.
అందని సహకారం
జిల్లాలో ప్రస్తుతం కేవలం 25 వేల కనెక్షన్లు మాత్రమే ఉన్నాయి. 114 మంది ఆపరేటర్లు జిల్లా వ్యాప్తంగా ఏపీ ఫైబర్ నెట్ కనెక్షన్లను నిర్వహిస్తుంటారు. అయితే ఆపరేటర్లు సర్వీసులు పెంచే విషయంలో సహకరించడం లేదని అధికారులు అసంతృప్తిలో ఉన్నారు. వాస్తవంగా క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే.. ఏపీ ఫైబర్నెట్ కనెక్షన్ కావాలనుకునే వారికి కొత్త పరికరాలు ఇవ్వడం లేదు. ఎవరైనా పాత కనెక్షన్ వద్దనుకుని తిరిగి ఇచ్చేస్తే దాన్ని కొత్తగా కావాలనుకునే వారికి ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఒక ఇంటికి అవసరమైన నెట్ సర్వీసు, టీవీ ఛానల్స్ చూడటానికి కేవలం రూ.190 చెల్లిస్తే సరిపోతుంది. ఇంత చౌకగా మరే ప్రైవేటు నెట్ కనెక్షన్ లభించదు. అయినా ఇక్కడ ఏపీ ఫైబర్ వెనుకబడి ఉంది. ఇదే అదనుగా ప్రైవేటు కంపెనీల వారు నెట్ కనెక్షన్లు పెద్ద మొత్తాలకు ఇస్తున్నారు.
పలమనేరులో 132 విద్యుత్ ఉపకేంద్రం వద్ద ఆరుబయటున్న పరికరాలు
ప్రత్యేక కార్యాలయం లేదు
ఏపీ ఫైబర్నెట్ కార్యాలయాన్ని పలమనేరులో 132 విద్యుత్ సబ్స్టేషన్లో ఒక మూలన ఏర్పాటు చేశారు. అక్కడ దానికి సంబంధించిన సిబ్బంది ఎవరూ ఉండరు. ముఖ్యమైన ఒక పరికరం మాత్రం దర్శనమిస్తుంది. మిగిలిన పరికరాలు ఒక గదిలో పెట్టెల్లో మూలన కనిపిస్తాయి. కొన్ని ఆరుబయట పడి ఉంటాయి. ప్రజలు తమకు కనెక్షన్ కావాలని కార్యాలయానికి వెళ్లి అక్కడ సమాధానం చెప్పేవారు ఎవరూ లేకపోవడంతో నిరాశగా వెనుతిరుగుతున్నారు. ప్రైవేటు ఆపరేటర్ల మీద ఆధారపడాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈ నెట్వర్క్ను నిర్లక్ష్యం చేస్తోందనే ఆరోపణలు లేకపోలేదు.
నిత్యం అందుబాటులో ఉంటాం
- సుకుమార్, మార్కెటింగ్ మేనేజరు, ఏపీ ఫైబర్ నెట్వర్క్, చిత్తూరు
కనెక్షన్ కావాలనుకునే వారికి వెంటనే కొత్త పరికరం ఇస్తాం. సర్వీసు కూడా వేగంగా చేస్తాం. ఆపరేటర్ల విషయంలోనూ ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. ఎవరైనా వినియోగదారుని విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కొత్త వారిని ఆహ్వానిస్తాం. ఏపీఫైబర్ నెట్వర్క్పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డబుల్ ఇంజిన్లా దూసుకెళ్తాం
[ 08-05-2024]
‘కూటమి విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో కళకళలాడుతోంది.. జగన్ మేనిఫెస్టో ఎత్తిపోయింది.. ఆ పార్టీకి డిపాజిట్లు రావు.. కేంద్రంలో మోదీ గ్యారెంటీ ఉంది.. ఇక్కడ ప్రజాగళం మేనిఫెస్టో, సూపర్-6లకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. -
హలో పుంగనూరు.. బైబై పాపాల పెద్దిరెడ్డి
[ 08-05-2024]
‘పుంగనూరు ప్రజలకు ఈరోజే స్వాతంత్య్రం వచ్చింది. రేపటి నుంచి అంతా మంచి రోజులే. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిడిసిపడుతున్నారు. నియోజకవర్గంలో శివశక్తి డెయిరీ కాకుండా వేరే డెయిరీ పోతుందా? అదే మా ఊళ్లో (నారావారిపల్లె)లో అన్ని డెయిరీలు పోతున్నాయి. -
వైకాపా దోచుకుంది.. తెదేపాకు మద్దతివ్వండి
[ 08-05-2024]
వైకాపా ప్రలోభాలకు తలొగ్గకుండా ఓటు అనే ఆయుధంతో రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవడానికి ప్రజలందరూ ముందుకు రావాలని తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడి సతీమణి నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. -
దమనకాండ.. జగన్ అండదండ
[ 08-05-2024]
ఏమున్నది గర్వకారణం.. వైకాపా పాలన సమస్తం.. పరపీడన పరాయణత్వం అన్నట్లు సాగింది ఈ ఐదేళ్లు. జిల్లాలో లెక్కలేనన్ని అరాచకాలకు తెగబడ్డారు. ప్రతిపక్షాలు, సామాన్యులపై దమనకాండకు పాల్పడ్డారు. ప్రశ్నిస్తే దాడులు, కేసులు, అరెస్టులు చేయించారు. -
అమాత్యుడి అండ.. అవినీతి దందా..!
[ 08-05-2024]
కుప్పం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతికి అడ్డూ.. అదుపూ లేకుండా పోతోంది. స్థానికంగా అధికార పార్టీ నాయకుడి అండ దండలు పుష్కలంగా ఉండటంతో.. కొందరు అధికారులు, సిబ్బందికి ఆడిందే ఆటగా మారింది. -
ధరణి.. కాజేసే ధోరణి
[ 08-05-2024]
చిత్తూరు నగరం తేనెబండ రెవెన్యూలో తిరుపతి- చిత్తూరు జాతీయ రహదారి పక్కన ఉన్న ఎకరా భూమి విలువ రూ.3 కోట్లు ఉంది. ఇది తనదంటూ ఒకరు నకిలీ రికార్డులు సృష్టించారు. -
జలంకారప్రాయం
[ 08-05-2024]
కుప్పాన్ని పులివెందులలా చూస్తామని జగన్ వల్లెవేసిన మాటలు.. ఐదేళ్ల పాలనలో ఉద్దరించేశామని స్థానిక నేతల సుద్ధులు, మాటలకు.. చేతలకు పొంతన లేదని.. కుప్పంపై కక్ష సాధిస్తున్నారని ప్రస్ఫుటమవుతోంది. -
‘ఎర్ర చందనం స్మగ్లర్ పేదవాడంట’
[ 08-05-2024]
ఎర్రచందనం స్మగ్లర్, వైకాపా అభ్యర్థి విజయానందరెడ్డి తాను పేదవాడినని చొక్కా విప్పి ఆందోళన చేయడం హాస్యాస్పదంగా ఉందని తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ ధ్వజమెత్తారు. -
కవ్వించి.. దాడిచేసి
[ 08-05-2024]
మండల కేంద్రమైన ఐరాలలో మంగళవారం మధ్యాహ్నం వైకాపా, తెదేపా నాయకులు మధ్య చోటుచేసుకున్న ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. -
పెద్దిరెడ్డి 142 ఆస్తుల వివరాలు వెల్లడించలేదు
[ 08-05-2024]
ఎన్నికల అఫిడవిట్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన ఆస్తులకు సంబంధించి పూర్తి వివరాలు బహిర్గతం చేయలేదని భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధినేత రామచంద్ర యాదవ్ ఆరోపించారు. -
జడ్పీ పూర్వ ఉన్నతాధికారిపై కలెక్టర్ ఆగ్రహం
[ 08-05-2024]
ఎన్నికల విధుల్లోని ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ను వినియోగించే కేంద్రంలో జడ్పీ పూర్వ ఉన్నతాధికారి ఉండటంపై తెదేపా శ్రేణులు కలెక్టర్ షన్మోహన్కు ఫిర్యాదు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
ఓటేసేందుకు వెళ్లారని సచివాలయ సిబ్బందికి వేధింపులు
[ 08-05-2024]
పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేందుకు వెళ్లిన ఏడుగురు సచివాలయ సిబ్బందిని మండల పరిషత్ అధికారులను వేధింపులకు గురిచేశారు. ఈ ఘటన సోమవారం చోటుచేసుకోగా.. మంగళవారం వెలుగులోకి వచ్చింది. -
పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి నేడు ఆఖరు
[ 08-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది, అత్యవసర సేవల్లోని ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకునేందుకు బుధవారం ఆఖరు గడువు. -
యువకుడిపై బాలుడు కత్తితో దాడి
[ 08-05-2024]
మండల పరిధి బ్రాహ్మణపల్లెకి చెందిన ఓబాలుడు(14) తల్లితో పాటు తిరుపతిలో ఉంటూ జులాయిగా తిరిగేవాడు. స్థానిక ఎస్సీకాలనీకి చెందిన విజయకుమార్(24) డిగ్రీ పూర్తి చేసి ఇంటి వద్ద ఉంటున్నాడు.