logo

వైకాపా నాయకుల బెదిరింపులపై ఫిర్యాదు

తెదేపాకి మద్దతు ఇచ్చి.. ప్రచారం నిర్వహిస్తే చంపేస్తామని వైకాపా నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితుడు, న్యాయవాది, నడిమిగడిదేసి గ్రామానికి చెందిన లింగోల్ల నవీన్‌ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Published : 16 Apr 2024 01:29 IST

పుంగనూరు గ్రామీణ, న్యూస్‌టుడే: తెదేపాకి మద్దతు ఇచ్చి.. ప్రచారం నిర్వహిస్తే చంపేస్తామని వైకాపా నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితుడు, న్యాయవాది, నడిమిగడిదేసి గ్రామానికి చెందిన లింగోల్ల నవీన్‌ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే మండలానికి చెందిన కీలక నేత, వారి సామాజిక వర్గానికే చెందిన అతని అనుచరులు చరవాణిలో దుర్భాషలాడుతున్నారని అందులో పేర్కొన్నారు. ‘ఈసారి ప్రాణాలు తీస్తాం. నువ్వు ఎక్కడ సంచారిస్తావో మాకు తెలుసు.. ఇల్లు వదిలి బయటకు వస్తే చంపేస్తాం’ అంటున్నారని అందులో పేర్కొన్నారు. ఫిర్యాదు ప్రతిని ఎస్‌ఐ రఫీకి అందజేసినటు నవీన్‌ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని