సమగ్ర శిక్షే
విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చాం చెప్పే వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఎండమావులుగా మిగిలిపోతున్నాయి.. ఒప్పంద, పొరుగు సేవల విధానంలో పనిచేసే ఉద్యోగులకు ఈ ఐదేళ్లలో ఒరిగిందేమీ లేదు..
సమ్మె చేసినా ఉద్యోగ భద్రత కరవు
ఎంటీఎస్ విస్మరించిన జగన్
గాల్లో దీపంలా ఉద్యోగుల భవిత
ఉద్యోగ భద్రత
న్యూస్టుడే, చిత్తూరు విద్య: విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చాం చెప్పే వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఎండమావులుగా మిగిలిపోతున్నాయి.. ఒప్పంద, పొరుగు సేవల విధానంలో పనిచేసే ఉద్యోగులకు ఈ ఐదేళ్లలో ఒరిగిందేమీ లేదు.. ఒప్పంద పద్ధతిలో పనిచేసే వారిని శాశ్వత ఉద్యోగులుగా చేస్తామని చెప్పిన జగన్.. అమలు చేసే సమయంలో ఆచరణ సాధ్యం కాని షరతులతో అరచేతిలో వైకుంఠం చూపారు.. సమగ్ర శిక్షలో ఒప్పంద, పొరుగు సేవల కింద ప్రాజెక్టు ఏర్పాటు నుంచి పనిచేసే ఉద్యోగులు సమస్యల పరిష్కారానికి సమ్మె బాట పట్టారు.. ఆ సంఘాల నాయకులను విద్యామంత్రి బొత్స సత్యనారాయణ పిలిచి చర్చలు జరిపారు.. శాశ్వత ఉద్యోగుల గుర్తింపు కన్నా ముందుగా ఎంటీఎస్(మినిమమ్ టైం స్కేల్) పద్ధతిలో జీతాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అదిగో.. ఇదిగో అంటూ కాలం సాగదీసే సరికి సార్వత్రిక ఎన్నికలు వచ్చేశాయి.. ఫలితంగా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఆ ఉద్యోగుల ఆశలు ఆవిరి అయ్యాయి.
అభద్రతలో 635 మంది ఉద్యోగులు..
సమగ్రశిక్షలో జిల్లా పరిధిలో 635మంది పొరుగు, ఒప్పంద పద్ధతిలో ఉద్యోగం చేస్తున్నారు. దశాబ్దాల తరబడి ఉద్యోగం చేస్తున్నా అభద్రతకు లోను కావాల్సిందే. ఏటా ఏప్రిల్ చివరిలోగానీ.. మే మొదటి వారంలో గానీ.. వారిని ఉద్యోగం నుంచి ఇంటికి పంపుతారు. వారం రోజుల తర్వాత మళ్లీ విధుల్లో చేరినట్లు రికార్డుల్లో నమోదు చేస్తారు. అయితే ఆ వారం రోజులు.. ఆ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నా ఆ రోజులకు జీతం వర్తించదు. దీంతో ఏటా వారం రోజులు వారు ఉచితంగా ఉద్యోగ సేవలు అందిస్తున్నారు. సేవలు వినియోగించుకుంటున్నారే తప్ప వారి గురించి ఆలోచించిన నాథుడే లేడు. ఫలితంగా వారి బాధలు చెప్పనలవికావు.
అటకెక్కిన మంత్రి హామీ..
శాశ్వత ఉద్యోగులుగా ప్రకటించాలని సమగ్రశిక్ష పరిధిలో పనిచేసే పొరుగు, ఒప్పంద ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల సమ్మె చేశారు. అప్పుడు విద్యామంత్రి బొత్సా సత్యనారాయణ సమ్మె చేస్తున్న ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించారు. ఉద్యోగులందరికీ ఎంటీఎస్ వర్తింపజేస్తామన్నారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెంటనే జారీ చేస్తామని హామీ ఇవ్వడంతో సమ్మె విరమించారు. రోజులు గడిచిపోతున్నా ఎంటీఎస్ వర్తింపజేయ డంలో ప్రభుత్వం జాప్యం చేయడంతో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చేసింది. ఇక ఇది ఎప్పటికి అమలయ్యేనో అని సర్వత్రా ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు.
ఎంటీఎస్ అమలు చేయాల్సిందే..
గత 15ఏళ్లుగా సమగ్ర శిక్షలో పనిచేస్తున్నాం. సీఎం జగన్ అధికారంలోకి రాగానే రెగ్యులర్ చేస్తామన్నారు. ఇప్పటికీఅమలు కాలేదు. గతేడాది డిసెంబరులో 22 రోజులు సమ్మె చేశాం. అప్పుడు ఎంటీఎస్ అమలు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. ఇప్పటివరకు అది ఆచరణలోకి రాలేదు. చాలీచాలని జీతాలతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. త్వరలో ఎన్నికల అనంతరం రానున్న నూతన ప్రభుత్వం సమగ్రశిక్ష ఉద్యోగులకు న్యాయం చేయాలని విన్నవిస్తున్నాం.
విల్వనాథం, జిల్లా కన్వీనర్, సీఆర్పీ సంఘం
మా తలరాత మారలేదు..
ప్రభుత్వాలు మారుతున్నా సమగ్రశిక్ష లోని పొరుగు, ఒప్పంద ఉద్యోగుల తలరాత మారడం లేదు. శాశ్వత ఉద్యోగులుగా ప్రభుత్వం చేస్తుందని ఆశిస్తునే సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మా సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే చందంగా మారాయి. గతంలో జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ అమలు చేయలేదు. సమ్మె చేసినప్పుడు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఆ కమిటీ ఏమైందో ఇప్పటికీ తెలియలేదు. ఇక హామీల అమలు దేవుడెరుగు.
దేవరాజులు, అధ్యక్షుడు, ఎమ్మార్సీ మెసెంజర్ సంఘం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పింఛను పంచన.. నయా వంచన
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికల ముంగిట ముఖ్యమంత్రి జగన్, ఆయన ప్రభుత్వంలోని అధికారులు పండుటాకులను ఇబ్బంది పెట్టేందుకు మరో వికృత క్రీడకు తెరలేపారు. -
జన, ధన, మాన చోరుడు జగన్..
[ 30-04-2024]
‘ఒక్క అవకాశం అంటూ గద్దెనెక్కిన జగన్మోహన్రెడ్డి.. రాష్ట్ర ప్రగతిని గోతిలో పాతిపెట్టాడు. రూ.లక్షల కోట్లు హాంఫట్ చేసి రాష్ట్ర ప్రజల నెత్తిన అప్పుల భారం మోపాడు. -
వారాంతపు సెలవులు హుష్ఖాకీ
[ 30-04-2024]
జిల్లాలో ఆధ్యాత్మిక కేంద్రాలు ఉండటంతో వీఐపీల తాకిడి అధికంగా ఉంటుంది.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, పలు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులతో పాటు వివిధ రాష్ట్రాల సీఎంలు, మంత్రులు తరచూ తిరుమల, కాణిపాకం, శ్రీకాళహస్తి, అరగొండ ఆలయాలను సందర్శిస్తుంటారు.. -
సదుంలో రణరంగం
[ 30-04-2024]
బీసీవైసీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్.. మంత్రి పెద్దిరెడ్డి స్వగ్రామం యర్రాతివారిపల్లెలో చేపట్టిన ప్రచారం ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీశాయి. -
రూ. 5 కోట్ల పనులు.. ఐదేళ్లూ విస్మరించారు
[ 30-04-2024]
త్రిరాష్ట్ర కూడలిలో శుభకార్యాలు, సమావేశాలు, సదస్సులు నిర్వహణకు సరైన వేదిక లేక ఇబ్బందులుండేవి. -
పోరు.. ఖరారు
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టం పూర్తయింది. బరిలో నిలిచింది ఎందరో తేలిపోయింది. మరోవైపు తుది, అనుబంధ ఓటర్ల జాబితాలు ఖరారయ్యాయి. -
వనితే నిర్ణేత..!
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల విజయాన్ని మహిళలు నిర్ణయించనున్నారు. జిల్లా పరిధిలో 25వ తేదీ నాటికి మొత్తం 18,12,980 ఓటర్లు ఉన్నారు. -
ఓటుకొస్తే అమ్మ.. జీతాలకొస్తే ఆ..యమ్మ
[ 30-04-2024]
కాలే కడుపులు.. అర్ధాకలితో ఉన్నా తమకు అప్పజెప్పిన పనులు పూర్తిచేయడంలో ఆయాలు ముందుంటారనడంలో సందేహం లేదు. -
తిరుమల పవిత్రతను మంటగలిపారు
[ 30-04-2024]
శ్రీవారి దర్శనం టికెట్ల ధరను విపరీతంగా పెంచేసి తిరుమలకు వచ్చే భక్తులను గత ఐదేళ్లలో దోచుకున్నారని ఎన్డీయే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఆరోపించారు. -
వైకాపా ప్రచారానికి అనుమతులేవీ?
[ 30-04-2024]
వడ్డించేవాడు మనవాడైతే.. చాలన్న చందాన తిరుపతిలో వైకాపా, పోలీసుల తీరు కొనసాగుతోంది. -
ఆలయంలో అధికార పార్టీ ప్రచారం
[ 30-04-2024]
పట్టణంలోని బజారువీధి రామమందిరంలో సోమవారం రాత్రి అధికార పార్టీ అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి ప్రచారం చేపట్టారు. -
బ్యాంకు ఖాతాల్లేకుంటే ఇంటి వద్దే పింఛన్ పంపిణీ: కలెక్టర్
[ 30-04-2024]
సామాజిక భద్రత పింఛన్ల పంపిణీని మే ఒకటిన రెండు పద్ధతుల్లో చేపట్టనున్నామని కలెక్టర్ షన్మోహన్ తెలిపారు. -
బ్యాండేజ్ వేసుకుని వినూత్నంగా ఎన్నికల ప్రచారం
[ 30-04-2024]
ఎన్నికల్లో సానుభూతి పొందాలని సీఎం జగన్ ఆడిన గులకరాయి డ్రామాను ప్రజలు నమ్మేస్థితిలో లేరని తెదేపా, జనసేన నాయకులు ఎద్దేవా చేశారు. -
కోర్టులో కేసున్నా.. రోడ్డు నిర్మాణం
[ 30-04-2024]
మండలంలోని ముడిపల్లి పంచాయితీలోని వెంగన్న కండ్రిగ ఎస్టీకాలనీ వద్ద వైకాపా నాయకులు దౌర్జన్యంగా రోడ్డు వేస్తున్నారని గ్రామస్థులు సోమవారం ఆరోపించారు. -
ఇద్దరు వాలంటీర్లపై వేటుకు సిఫార్సు
[ 30-04-2024]
ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రచారంలో పాల్గొన్న ఇద్దరు వాలంటీర్లపై చర్యలకు ఉన్నతాధికారులకు సిఫార్సు చేశామని ఎంపీడీవో వరప్రసాద్ తెలిపారు. -
చీటీల మోసం కేసులో నిందితుడికి తొమ్మిదేళ్ల జైలు
[ 30-04-2024]
చీటీల పేరుతో మోసానికి పాల్పడిన కేసులో నిందితుడికి తొమ్మిదేళ్ల జైలు శిక్ష విధిస్తూ సోమవారం స్థానిక జిల్లా ప్రధాన సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి భీమారావు సోమవారం తీర్పు చెప్పారు. -
కమ్యూనిటీ హాలులో వైకాపా నాయకుల సమావేశం?
[ 30-04-2024]
తిరుమలలో కూటమి అభ్యర్థి ఎన్నికల ప్రచారం నేపథ్యంలో అదే సమయంలో వైకాపా తిరుమల విభాగం అధ్యక్షుడు చిన్నముని ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి స్థానిక కమ్యూనిటీ భవనంలో సమావేశమయ్యారు.