జడ్పీలో లేకున్నా అతనే కీలకం
ప్రభుత్వ కార్యాలయాల్లోని దస్త్రాలు విభాగాల్లో లేదా జిల్లా అధికారుల వద్ద ఉండాలి. జిల్లా పరిషత్లోని వందలాది దస్త్రాలు ఈ కార్యాలయానికి సంబంధం లేని ఓ గుమస్తా వద్ద ఉండటం కలకలం రేపింది.
300 కీలక దస్త్రాలు దాచిన పూర్వ సీసీ
ప్రభుత్వ కార్యాలయాల్లోని దస్త్రాలు విభాగాల్లో లేదా జిల్లా అధికారుల వద్ద ఉండాలి. జిల్లా పరిషత్లోని వందలాది దస్త్రాలు ఈ కార్యాలయానికి సంబంధం లేని ఓ గుమస్తా వద్ద ఉండటం కలకలం రేపింది. జీడీనెల్లూరు ఎంపీడీవో కార్యాలయం నుంచి జడ్పీలో ఓ కీలక ప్రజాప్రతినిధికి అనధికార సీసీ (పూర్వ అధికారి అనుచరుడు)గా పనిచేసిన వ్యక్తి వద్ద ఇవన్నీ వెలుగుచూశాయి.
చిత్తూరు జడ్పీ, న్యూస్టుడే: జడ్పీ నూతన సమావేశ మందిర నిర్మాణ కేసుకు సంబంధించి ఇటీవల దస్త్రాలు కనిపించక జేసీ వాయిదా వేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో జడ్పీ అధికారులు.. సదరు గుమస్తాకు షోకాజ్ ఇవ్వడంతో మరుసటి రోజే దస్త్రాలు జడ్పీకి చేరాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. సదరు సీసీ మళ్లీ ఇటీవల జీడీనెల్లూరుకు వెళ్లిపోయినా అతడి బీరువాలో ఇప్పటికి 300 దస్త్రాలు బయటపడటంతో ఉన్నతాధికారులు విస్తుపోయారు. సదరు ఉద్యోగి మొదట్లో తనకేమీ తెలియదని బుకాయించాడు. ఆపై మరోసారి అధికారులు షోకాజ్ ఇచ్చేందుకు సన్నద్ధమైన సమాచారం తెలిసి హడావుడిగా వచ్చి కార్యాలయంలోని బీరువాలో ఉన్న దస్త్రాలన్నీ అప్పగించాడు.
పని అక్కడ.. ఇక్కడి తాళాలెందుకు?
జీడీనెల్లూరులో పనిచేస్తున్న ఈ వ్యక్తి వద్ద జడ్పీ కార్యాలయ బీరువా తాళాలు ఎందుకున్నాయి? ఎవరి అనుమతితో ఇలా బరితెగించాడు. దస్త్రాలు రహస్యంగా దాచాల్సిన అవసరం ఏమిటి.. ఇంకెన్ని అతడి ఆధీనంలో ఉన్నాయని అనుమానిస్తున్నారు. వెలుగుచూసిన వాటిలో చాలామంది ఎస్ఆర్లు.. ఇతరత్రా ఉన్నాయని సమాచారం. పూర్వ అధికారి అండతో ఒకప్పుడు పేట్రేగిపోయిన ఇతను ఇలా దస్త్రాలు దాచడం జడ్పీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
బావురుమంటున్న బాధితులు
ఇతడి నిర్వాకంతో గతంలో కొన్ని విభాగాల దస్త్రాలు కనిపించక క్రమశిక్షణ చర్యలకు గురయ్యామని పలువురు ఉద్యోగులు ప్రస్తుతం తాజా ఘటనతో వాపోతున్నారు. సదరు ఉద్యోగి వద్ద ఇన్ని దస్త్రాలు దాచేందుకు సహకరించిన అధికారులు ఎవరనే దిశగా ఉన్నతాధికారులు అంతర్గత విచారణ మొదలుపెట్టినట్లు సమాచారం.
8 అన్నీ తానై..
జడ్పీలో ఏం జరగాలన్నా, ఏ ఫైల్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా అతడికి తెలియాల్సిందే. కాదంటే ఎంతటివారైనా సరే బదిలీపై వెళ్లాలి లేదా సస్పెండ్ కావాల్సిందే. కీలక దస్త్రాలయితే అతడి వద్దనే ఉండాలి తప్ప విభాగాల వద్ద కూడా ఉండే పరిస్థితి లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పింఛను పంచన.. నయా వంచన
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికల ముంగిట ముఖ్యమంత్రి జగన్, ఆయన ప్రభుత్వంలోని అధికారులు పండుటాకులను ఇబ్బంది పెట్టేందుకు మరో వికృత క్రీడకు తెరలేపారు. -
జన, ధన, మాన చోరుడు జగన్..
[ 30-04-2024]
‘ఒక్క అవకాశం అంటూ గద్దెనెక్కిన జగన్మోహన్రెడ్డి.. రాష్ట్ర ప్రగతిని గోతిలో పాతిపెట్టాడు. రూ.లక్షల కోట్లు హాంఫట్ చేసి రాష్ట్ర ప్రజల నెత్తిన అప్పుల భారం మోపాడు. -
వారాంతపు సెలవులు హుష్ఖాకీ
[ 30-04-2024]
జిల్లాలో ఆధ్యాత్మిక కేంద్రాలు ఉండటంతో వీఐపీల తాకిడి అధికంగా ఉంటుంది.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, పలు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులతో పాటు వివిధ రాష్ట్రాల సీఎంలు, మంత్రులు తరచూ తిరుమల, కాణిపాకం, శ్రీకాళహస్తి, అరగొండ ఆలయాలను సందర్శిస్తుంటారు.. -
సదుంలో రణరంగం
[ 30-04-2024]
బీసీవైసీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్.. మంత్రి పెద్దిరెడ్డి స్వగ్రామం యర్రాతివారిపల్లెలో చేపట్టిన ప్రచారం ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీశాయి. -
రూ. 5 కోట్ల పనులు.. ఐదేళ్లూ విస్మరించారు
[ 30-04-2024]
త్రిరాష్ట్ర కూడలిలో శుభకార్యాలు, సమావేశాలు, సదస్సులు నిర్వహణకు సరైన వేదిక లేక ఇబ్బందులుండేవి. -
పోరు.. ఖరారు
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టం పూర్తయింది. బరిలో నిలిచింది ఎందరో తేలిపోయింది. మరోవైపు తుది, అనుబంధ ఓటర్ల జాబితాలు ఖరారయ్యాయి. -
వనితే నిర్ణేత..!
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల విజయాన్ని మహిళలు నిర్ణయించనున్నారు. జిల్లా పరిధిలో 25వ తేదీ నాటికి మొత్తం 18,12,980 ఓటర్లు ఉన్నారు. -
ఓటుకొస్తే అమ్మ.. జీతాలకొస్తే ఆ..యమ్మ
[ 30-04-2024]
కాలే కడుపులు.. అర్ధాకలితో ఉన్నా తమకు అప్పజెప్పిన పనులు పూర్తిచేయడంలో ఆయాలు ముందుంటారనడంలో సందేహం లేదు. -
తిరుమల పవిత్రతను మంటగలిపారు
[ 30-04-2024]
శ్రీవారి దర్శనం టికెట్ల ధరను విపరీతంగా పెంచేసి తిరుమలకు వచ్చే భక్తులను గత ఐదేళ్లలో దోచుకున్నారని ఎన్డీయే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఆరోపించారు. -
వైకాపా ప్రచారానికి అనుమతులేవీ?
[ 30-04-2024]
వడ్డించేవాడు మనవాడైతే.. చాలన్న చందాన తిరుపతిలో వైకాపా, పోలీసుల తీరు కొనసాగుతోంది. -
ఆలయంలో అధికార పార్టీ ప్రచారం
[ 30-04-2024]
పట్టణంలోని బజారువీధి రామమందిరంలో సోమవారం రాత్రి అధికార పార్టీ అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి ప్రచారం చేపట్టారు. -
బ్యాంకు ఖాతాల్లేకుంటే ఇంటి వద్దే పింఛన్ పంపిణీ: కలెక్టర్
[ 30-04-2024]
సామాజిక భద్రత పింఛన్ల పంపిణీని మే ఒకటిన రెండు పద్ధతుల్లో చేపట్టనున్నామని కలెక్టర్ షన్మోహన్ తెలిపారు. -
బ్యాండేజ్ వేసుకుని వినూత్నంగా ఎన్నికల ప్రచారం
[ 30-04-2024]
ఎన్నికల్లో సానుభూతి పొందాలని సీఎం జగన్ ఆడిన గులకరాయి డ్రామాను ప్రజలు నమ్మేస్థితిలో లేరని తెదేపా, జనసేన నాయకులు ఎద్దేవా చేశారు. -
కోర్టులో కేసున్నా.. రోడ్డు నిర్మాణం
[ 30-04-2024]
మండలంలోని ముడిపల్లి పంచాయితీలోని వెంగన్న కండ్రిగ ఎస్టీకాలనీ వద్ద వైకాపా నాయకులు దౌర్జన్యంగా రోడ్డు వేస్తున్నారని గ్రామస్థులు సోమవారం ఆరోపించారు. -
ఇద్దరు వాలంటీర్లపై వేటుకు సిఫార్సు
[ 30-04-2024]
ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రచారంలో పాల్గొన్న ఇద్దరు వాలంటీర్లపై చర్యలకు ఉన్నతాధికారులకు సిఫార్సు చేశామని ఎంపీడీవో వరప్రసాద్ తెలిపారు. -
చీటీల మోసం కేసులో నిందితుడికి తొమ్మిదేళ్ల జైలు
[ 30-04-2024]
చీటీల పేరుతో మోసానికి పాల్పడిన కేసులో నిందితుడికి తొమ్మిదేళ్ల జైలు శిక్ష విధిస్తూ సోమవారం స్థానిక జిల్లా ప్రధాన సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి భీమారావు సోమవారం తీర్పు చెప్పారు. -
కమ్యూనిటీ హాలులో వైకాపా నాయకుల సమావేశం?
[ 30-04-2024]
తిరుమలలో కూటమి అభ్యర్థి ఎన్నికల ప్రచారం నేపథ్యంలో అదే సమయంలో వైకాపా తిరుమల విభాగం అధ్యక్షుడు చిన్నముని ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి స్థానిక కమ్యూనిటీ భవనంలో సమావేశమయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!