logo

పవన్‌ గెలుపు.. పిఠాపురం అభివృద్ధికి మలుపు

పవన్‌ కల్యాణ్‌ను గెలిపించడం ద్వారా పిఠాపురం అభివృద్ధికి బాటలు వేయాలని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు కోరారు. ఈ సార్వత్రిక ఎన్నికల బరిలో పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా పవన్‌ కల్యాణ్‌, కాకినాడ ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌ ఉన్నారని..

Published : 18 Apr 2024 06:12 IST

జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు
గొల్లప్రోలులో భారీ ప్రచార ర్యాలీ

గొల్లప్రోలులో ప్రచారం సాగిస్తున్న నాగబాబు, వర్మ, కృష్ణంరాజు

గొల్లప్రోలు: పవన్‌ కల్యాణ్‌ను గెలిపించడం ద్వారా పిఠాపురం అభివృద్ధికి బాటలు వేయాలని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు కోరారు. ఈ సార్వత్రిక ఎన్నికల బరిలో పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా పవన్‌ కల్యాణ్‌, కాకినాడ ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌ ఉన్నారని.. వారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. బుధవారం గొల్లప్రోలులో భారీ ప్రచార ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ, భాజపా నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ కృష్ణంరాజు తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. స్థానిక ఆర్టీసీˆ బస్టాండు నుంచి ప్రారంభమైన మోటారుసైకిళ్లతో కూడిన ఈ ర్యాలీలో అన్ని వీధులగుండా సాగింది. మహిళలు నాగబాబుకు హారతులిచ్చారు. కడారి తమ్మయ్యనాయుడు, గుండ్ర సుబ్బారావు, శీరం మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో నాగబాబు పాల్గొన్నారు. సీతారాముల కల్యాణోత్సవాన్ని వీక్షించి, స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని