మైక్రోసాఫ్ట్ ఉద్యోగం వదిలి.. ప్రజాసేవకు కదిలి..
కంప్యూటర్ ఇంజినీరింగ్ చదువు.. నాలుగో ఏడాదిలోనే ప్రాంగణ ఎంపికల్లో సాఫ్ట్వేర్ కొలువు.. రూ.లక్షల జీతం.. అంతటితో ఆగలేదు ఆమె.
సివిల్స్ విజేతల అంతరంగం
శ్యామలాసెంటర్, న్యూస్టుడే: కంప్యూటర్ ఇంజినీరింగ్ చదువు.. నాలుగో ఏడాదిలోనే ప్రాంగణ ఎంపికల్లో సాఫ్ట్వేర్ కొలువు.. రూ.లక్షల జీతం.. అంతటితో ఆగలేదు ఆమె. సమాజానికి సేవచేయాలనే ఉద్దేశంతో ఉద్యోగం చేస్తూనే సివిల్స్కు సాధన ప్రారంభించారు. మూడుసార్లు విఫలమై నాలుగోసారి లక్ష్యం చేరుకున్నారు రాజమహేంద్రవరానికి చెందిన అడుసుమిల్లి మౌనిక. అఖిలభారత స్థాయిలో 487వ ర్యాంకు సాధించిన ఆమెను ‘న్యూస్టుడే’ పలకరించగా అనుభవాలు వివరించారు.
ఇంజినీరింగ్ చదువుతుండగానే కొలువు..
మౌనిక స్వస్థలం విజయవాడ అయినా.. రాజమహేంద్రవరంలో స్థిరపడ్డారు. తండ్రి ఎ.వెంకటప్రేమ్చంద్ రెస్టారెంట్ నిర్వహిస్తుండగా తల్లి సునీత గృహిణి. పదో తరగతి, ఇంటర్మీడియట్ వరకు విజయవాడలో చదివి బిట్స్ పిలానీ (హైదరాబాద్)లో కంప్యూటర్ ఇంజినీరింగ్ (2014-18) నాలుగో ఏడాదిలోనే మైక్రోసాఫ్ట్ (బెంగళూరు)లో కొలువు సాధించారు. వారాంతపు సెలవు దినాల్లో మొక్కలు నాటడం, వృద్ధాశ్రమాలు సందర్శించడం.. ఉద్యోగం చేస్తూనే ఏడాది శిక్షణతో సివిల్స్ రాశారు.
తొలి ప్రయత్నాలు విఫలమైనా..
మొదటి మూడు ప్రయత్నాల్లో విఫలమైనా కుంగిపోలేదు. సొంతంగా సాధన చేస్తూనే ఆన్లైన్లో నమూనా పరీక్షలు రాయడం, గతంలో దొర్లిన తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం, ఒక ప్రశ్నకు జవాబు కొత్తదనంగా సమగ్ర సమాచారాన్ని జోడించి ఏవిధంగా రాయాలో నేర్చుకొని నాలుగోసారి ప్రయత్నించి సఫలమయ్యారు. 20 నిమిషాల ఇంటర్వ్యూ స£మయంలో అతి క్లిష్టమైన ప్రశ్నలను ఎదుర్కొన్నానని, లక్షలు వచ్చే కొలువును వదిలి సివిల్ సర్వీసెస్కు ఎందుకు వచ్చావని, ఏపీ విభజనతో వచ్చే లాభనష్టాలు వంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వచ్చిందని మౌనిక పేర్కొన్నారు. ఇకపై ప్రజలకు సేవ చేయటమే లక్ష్యంగా చెబుతున్నారు.
నాన్న కలే.. నా సంకల్పమైంది..
జగ్గంపేట, న్యూస్టుడే: సివిల్స్లో ర్యాంకే లక్ష్యంగా మొదటిసారి పరీక్ష రాస్తే ఆశించిన ఫలితం రాలేదు.. రెండోసారి ప్రయత్నిస్తే 314 ర్యాంకుతో ఇండియన్ పోస్టల్ సర్వీసులో ఉద్యోగం సాధించారు. మరోసారి ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీసు ఉద్యోగం సాధించారు. అదే సంవత్సరంలో ఇండియన్ ఫారెస్ట్ సర్వీసుకి ఎంపికయ్యారు. తాజా ఫలితాల్లో 162వ ర్యాంకు సాధించిన జీను జశ్వంత్ ‘న్యూస్టుడే’తో తన అనుభూతులను పంచుకున్నారిలా.. జగ్గంపేటకు చెందిన ఆయన మూడేళ్లు బెంగళూర్లో శాంసంగ్లో ఉద్యోగం చేస్తూ 2020 నుంచి ప్రయత్నాలు చేస్తూ లక్ష్యం సాధించారు.
తండ్రి లక్ష్యమే అతని ముందున్న గురి..
రెండు సార్లు సివిల్స్లో ఉత్తీర్ణత సాధించినా సంతృప్తి లేదు. సివిల్ సర్వెంట్ కావాలనే తండ్రి జీను మాణిక్యాలరావు లక్ష్యాన్ని నెరవేర్చాలనే సంకల్పంతో ముందుకు సాగా. మంగళవారం విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో 162 ర్యాంకుతో మెరిసి తండ్రి చిరకాల కలను నెరవేర్చాడు జగ్గంపేటకు చెందిన జీను శ్రీ జశ్వంత్ చంద్ర. ప్రస్తుతం కాకినాడలో నివాసం ఉంటున్నారు. అయితే ఈ ఆనందాన్ని పంచుకోవడానికి ఆ తండ్రి లేడు. 2021లో అనారోగ్యంతో మరణించారు.
బాల్యమంతా కాకినాడలోనే
జీను జశ్వంత్ బాల్యం కాకినాడలోనే సాగింది. తల్లి జీను నాగలక్ష్మి కాకినాడలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలు. తాతయ్య విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు గొల్లపల్లి లక్ష్మణరావు. జస్వంత్ కాకినాడ ఆశ్రమ్ పబ్లిక్ స్కూల్లో 10వ తరగతి వరకు చదువుకున్నాడు. ఐఐటీ కాన్పూర్లో కంప్యూటర్ సైన్సు చేసి 2018లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాష్ట్రంలో ఎటు చూసినా మాఫియాలే: షర్మిల
[ 01-05-2024]
ఎటు చూసినా ల్యాండ్, ఇసుక మాఫియాలు రెచ్చిపోతున్నాయ్...రాజన్న రైతులను నెత్తిమీద పెట్టుకుంటే సీఎం జగన్మోహన్రెడ్డి రైతుల చేతికి చిప్ప ఇచ్చాడని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. -
మాదిగ జాతి ద్రోహి జగన్
[ 01-05-2024]
మాదిగ జాతి ద్రోహి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎన్నికల్లో ఓడించాలని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. -
పిఠాపురం అసెంబ్లీ ఎన్నికల బరిలో 13 మంది
[ 01-05-2024]
పిఠాపురం అసెంబ్లీ స్థానానికి ఎన్నికల బరిలో 13 మంది నిలిచారు. ఆ వివరాలను ఆర్వో రామసుందర్రెడ్డి వెల్లడించారు. -
పచ్చని కుటుంబంలో మద్యం చిచ్చు
[ 01-05-2024]
కన్నతండ్రే కొడుకును హత్య చేశాడు.. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ మత్తుకు అలవాటు పడి, తమను వేధిస్తుండటం భరించలేక సహనం కోల్పోయి అతని ప్రాణాలు తీశాడు. -
గండాల దారులను గాలికొదిలేశారు!
[ 01-05-2024]
నిత్యం వందల వాహనాలు తిరిగే ఉమ్మడి జిల్లా ప్రధాన దారులివి. గుంతలతో ప్రయాణికులకు గండాలుగా మారాయి. -
అభాగ్యులపై పగ.. పంపిణీలో దగా
[ 01-05-2024]
ఎన్నికల వేళ పింఛను పంపిణీలో వైకాపా ప్రభుత్వం ఆడుతున్న నాటకాలు లబ్ధిదారులకు తీవ్ర వేదన మిగులుస్తున్నాయి. -
మిల్లులో వేలు పెట్టారు.. కార్మికుల పొట్ట కొట్టారు
[ 01-05-2024]
రాజమహేంద్రవరం పేపరు మిల్లు.. ఆ పేరు వింటేనే కార్మికుల కళ్లలో ఆనందం. మనసునిండా సంతోషం. -
ఆగని అధికార పార్టీ ఆగడాలు
[ 01-05-2024]
ఎన్నికల సమయంలో కూడా ఇసుకాసురల దందా యథేచ్ఛగా సాగుతోంది. ఎన్జీటీ, సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం ఖాతరు చేయకుండా వైకాపా నాయకులు గోదావరి నదీ గర్భాన్ని యంత్రాలతో ఇష్టారీతిన తవ్వేస్తున్నారు. -
జగన్ దళితులను దగా చేశారు: గోరంట్ల
[ 01-05-2024]
అధికార పార్టీ దళితులను అన్ని విధాలుగా మోసం చేసిందని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి విమర్శించారు. -
ఇచ్చినవే అమలుకాక.. కొత్తవి గుప్పించలేక..
[ 01-05-2024]
ముఖ్యమంత్రి జగన్ హామీలిచ్చి మడమ తిప్పేయడంలో ఆరితేరారు. జిల్లాకు వచ్చినప్పుడల్లా గతంలో చేసిన బాసలు సైతం విస్మరించి మరికొన్ని ప్రకటించి వెళ్లిపోయేవారు. -
మండపేటలో వారాహి విజయభేరి సభ నేడు
[ 01-05-2024]
జనసేనాని పవన్కల్యాణ్ బుధవారం మండపేటలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు అక్కడ వారాహి విజయభేరి బహిరంగ సభకు హాజరవుతారని నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి వేగుళ్ల లీలాకృష్ణ, కూటమి ఉమ్మడి అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు తెలిపారు. -
బరి.. గెలుపే గురి
[ 01-05-2024]
ఉమ్మడి జిల్లాలో నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పార్లమెంట్ స్థానాల పరిధిలో పరిశీలిస్తే.. కాకినాడ, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమలకు 15 మంది చొప్పున అభ్యర్థులు బరిలో నిలిచారు. -
భీమేశ్వరా.. భక్తుల బాధలు కనవా..?
[ 01-05-2024]
భగవానుగ్రహం కోసం ఆలయాలనికి వెళితే.. వివిధ రుసుముల పేరిట బాదుడు అధికమవుతోందని భీమేశ్వరస్వామి భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పేరు మార్పునకు ముద్రగడ సిద్ధంగా ఉండాలి
[ 01-05-2024]
త్వరలో జరగనున్న పిఠాపురం అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ గెలవనున్నారని పేరు మార్చుకునేందుకు సిద్ధంగా ఉండాలని ముద్రగడను ఉద్దేశించి జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి(బాబు) అన్నారు. -
బిల్లు.. ఇల్లు ఘొల్లు
[ 01-05-2024]
గత తెదేపా ప్రభుత్వ హయాంలో ఎన్నికల ముందు మంజూరైన గృహాలకు బిల్లుల చెల్లింపులో అనంతరం అధికారంలోకి వచ్చిన వైకాపా కక్ష పూరితంగా వ్యవహరించింది. -
పరారీలో అధికార పార్టీ నేతలు
[ 01-05-2024]
పిఠాపురంలో రూ.80 లక్షల పైచిలుకు అక్రమ మద్యం పట్టుబడిన కేసులో అసలు దొంగలైన వైకాపా నేతలు పరారీలో ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మ్యానిఫెస్టోలో కార్మిక సంక్షేమానికి పెద్దపీట: తెదేపా అధినేత చంద్రబాబు
-
అమెరికాలో గాజా అలజడి.. కస్టడీలోకి కొలంబియా వర్సిటీ నిరసనకారులు
-
పలు స్కూళ్లకు ఒకేసారి బాంబు బెదిరింపులు.. దిల్లీలో కలకలం
-
ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత సీట్లంటూ తాయిలం
-
తగ్గిన వంటగ్యాస్ వాణిజ్య సిలిండర్ ధర
-
వసూల్ రాజాలు.. ఎన్నికలొచ్చాయని వెనక్కి తగ్గారు!