హామీల గారడి.. కోనసీమకు బురిడీ
ప్రతిపక్ష నేతగా కోనసీమలో పర్యటించిన సమయంలో హామీలు గుప్పించారు. ముఖ్యమంత్రి హోదాలో సరేసరి. అవన్నీ నీటి మూటలయ్యాయి.
కోత నివారణ ఊసే లేదు.. ముంపు సమస్యలూ తీరలేదు..
కోనసీమను మోసపుచ్చేందుకు నేడు సీఎం జగన్ ‘సిద్ధం’
ఈనాడు, కాకినాడ:ప్రతిపక్ష నేతగా కోనసీమలో పర్యటించిన సమయంలో హామీలు గుప్పించారు. ముఖ్యమంత్రి హోదాలో సరేసరి. అవన్నీ నీటి మూటలయ్యాయి. ఉద్ధరించడానికి మేమంతా సిద్ధం అంటున్న వైకాపా నేతలపై ప్రజలు గుర్రుగా ఉన్నారు. నేడు సీఎం జగన్ రోడ్షో నిర్వహిస్తున్నారు. హామీలను గోదాట్లో కలిపేసి మళ్లీ వస్తున్నారంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అంతన్నారు.. ఇంతన్నారు..
- ఏటా గోదావరికి వచ్చే వరదలకు శాశ్వత పరిష్కారం చూపేలా ప్రణాళికలు రూపొందించండి. నవంబర్లో టెండర్లు పూర్తిచేసి పనులు ప్రారంభిద్దాం. కరకట్టల ఆధునికీకరణపైనా ప్రతిపాదనలు సిద్ధం చేయండి. అన్ని లంక గ్రామాల్లో సామాజిక భవనాలు నిర్మిస్తే విపత్తుల సమయంలో పునరావాస కేంద్రాలుగా ఉపయోగపడతాయి.
- 2022 జులై 26న కోనసీమ వరదలపై రాజమహేంద్రవరంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్ మాటలివి. నేటివరకు కరకట్టల ఆధునికీకరణ, లంక గ్రామాల్లో సామాజిక భవనాల నిర్మాణం ఊసేలేదు.
మాటిచ్చినా.. పనులు జరగలేదు..
- పి.గన్నవరం మండలం బూరుగులంకలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగిస్తుండగా రోడ్లు బాగాలేవని గ్రామస్థులు వెనుక నుంచి కేకలు వేశారు. దీనిపై స్పందించిన సీఎం రోడ్లు చూశాను.. అంచనాలను తయారుచేయించి.. సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. బూరుగులంక వద్ద నదీకోత నివారణకు నిధులు మంజూరు చేస్తామని వాగ్దానం చేశారు.
- 2022 జులై 26న పి.గన్నవరం మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో చోటుచేసుకున్న సంఘటన ఇది. సాక్షాత్తూ సీఎం హామీ ఇచ్చినా లంక గ్రామాల్లో రోడ్లు బాగుపడలేదు. నదీకోత నివారణకు నిధులూ ఇవ్వలేదు.
ఇసుక తవ్వేసి.. చెరువులుగా మార్చేసి..
అంతర్వేదిలో అనధికారికంగా తవ్విన ఆక్వా చెరువు
హామీ: పంట చెరువులను చేపల చెరువులుగా మార్చడాన్ని అరికడతాం.
అమలు తీరు: నియంత్రణ మాటెలా ఉన్నా వైకాపా వచ్చాక మరింత పెరిగింది. అంతర్వేది నుంచి కరవాక వరకు 30 కి.మీ తీరం ఉంది. ఒకప్పుడు 15 అడుగుల ఎత్తులో ఉండే ఇసుక తిన్నెలు ఇప్పుడు మాయమయ్యాయి. వాటిని రొయ్యల చెరువులుగా మార్చేశారు. అతిక్రమణలు నిజమేనని ఎన్జీటీ ఆక్షేపించినా చక్కదిద్దలేదు. తీరంలో ఇసుక అక్రమ తవ్వకాలు, ఆక్వా చెరువుల నిర్మాణంతో పర్యావరణానికి హాని, పరిహారం వసూలుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని 2021లో (ఎన్జీటీ) ఆదేశించించినా మొక్కుబడి చర్యలే తప్ప కట్టడిలేదు.
కొబ్బరి రైతులకు ఏం చేశారు...?
కోనసీమ జిల్లా నుంచి వెళ్లి తమిళనాడులో పనిచేస్తున్న కార్మికులు (పాత చిత్రం)
హామీ: కొబ్బరి రైతులను ఆదుకుంటాం. అంబాజీపేట మార్కెట్ను కళకళలాడేలా చేస్తాం. శీతల గిడ్డంగులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం. కష్టాలు లేకుండా చేస్తాం.
అమలు తీరు: డా.బీఆర్ అండేడ్కర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 1.26లక్షల హెక్టార్లలో కొబ్బరి సాగు ఉంది. దిగుబడి హెక్టారుకు 14,670 కాయలు ఉంటాయి. 3 లక్షల మంది రైతులు, లక్షమందికి పైగా కార్మికులు కొబ్బరి పైనే ఆధారపడి జీవిస్తున్నారు.. కొబ్బరి పంటలోని ఆకులు, కాండం, డొక్కలతో వివిధ ఉత్పత్తులు తయారీ వీలున్నా ఆ దిశగా ప్రోత్సాహం లేదు. కొబ్బరి నీరు, పాలు, నూనెతో ఉప ఉత్పత్తుల తయారీకి ఆస్కారం ఉన్నా ఎటువంటి చొరవ చూపలేదు. రైతులను ఆదుకుని ఆర్థికంగా ఎదిగేలా ప్రభుత్వం ప్రోత్సహించలేదు.
- ఉభయ గోదావరి జిల్లాల్లో రెండు వేల ఎకరాల్లో తమలపాకు సాగవుతోంది. విపత్తుల సమయంలో నష్టపోతున్నారు. సరైన మార్కెట్ సౌకర్యం లేక ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. రైతులను ఆదుకుంటామన్న హామీని గాలికొదిలేశారు. శీతల గిడ్డంగులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఊసేలేదు.
ఎత్తిపోతలా.. ఉత్తిపోతలా..?
అమలు తీరు: ప్రాథమిక సర్వే చేసి, ప్రతిపాదనలు సిద్ధంచేసినా పనులు పట్టాలెక్కలేదు. ఈ పథకం పూర్తయితే మామిడికుదురు మండలంలోని అప్పనపల్లి, పెదపట్నం, పెదపట్నంలంక, బి.దొడ్డవరం గ్రామాలతోపాటు.. పి.గన్నవరం మండలం మానేపల్లిలంక గ్రామాల పరిధిలోని 4,200 ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంది. లంక గ్రామాల్లో 60 శాతం బోర్లలో ఉప్పునీరే వస్తోంది. తీరంలో ఉప్పునీటి సమస్యపై తెదేపా హయాంలో చెన్నైకి చెందిన సంస్థతో అధ్యయనం చేయించారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక ఆ అధ్యయన ఫలితాల విశ్లేషణ లేదు. ఇప్పటికీ ఉప్పునీరే శరణ్యం. ఇంటింటికీ కుళాయిల ద్వారా తాగునీరు అందించాలని జల్జీవన్ మిషన్ పథకాన్ని ప్రవేశపెట్టినా అదీ పూర్తి చేయలేదు. వాటర్గ్రిడ్ పథకం సైతం పట్టాలు ఎక్కలేదు.
హామీ: అప్పనపల్లి ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తాం. రైతులకు సాగుపరంగా ఇబ్బందులు లేకుండా చేస్తాం. లంక గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కరిస్తాం.
విపత్తుల్లో అంతేనా
ఏటా జూన్, జులై, ఆగస్టు నెలల్లో భారీ వర్షాలు, విపత్తులు కోనసీమ జిల్లాను వెంటాడుతున్నాయి. లంకలు రోజుల తరబడి జలదిగ్భంధంలో ఉండిపోతాయి. ఆరుగాలాల పంట నీట మునగడం రివాజవుతోంది. నిబంధనలకు లోబడి మొక్కుబడిగా అందిస్తున్న వైకాపా సర్కారు సాయం రైతులకు ఊరటనివ్వడంలేదు. దీంతో సాగులో ఉన్న అధికశాతం కౌలు రైతులు నష్టపోతున్నారు. వందల ఎకరాలు నదీకోతకు గురవుతున్నా.. వేల ఎకరాలు నీట మునుగుతున్నా పంట, మురుగునీటి కాలువల వ్యవస్థను చక్కదిద్దే చొరవ చూపడంలేదు. ఈ సమస్యల పరిష్కారానికి రూ.వందల కోట్ల విలువైన హామీలు సీఎం జగన్ ఇచ్చినా నెరవేరలేదు. మళ్లీ అవే హామీలతో జనం ముందుకు వచ్చి ఓట్లు అడగడానికి వైకాపా నాయకులు సిద్ధమయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాష్ట్రంలో ఎటు చూసినా మాఫియాలే: షర్మిల
[ 01-05-2024]
ఎటు చూసినా ల్యాండ్, ఇసుక మాఫియాలు రెచ్చిపోతున్నాయ్...రాజన్న రైతులను నెత్తిమీద పెట్టుకుంటే సీఎం జగన్మోహన్రెడ్డి రైతుల చేతికి చిప్ప ఇచ్చాడని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. -
మాదిగ జాతి ద్రోహి జగన్
[ 01-05-2024]
మాదిగ జాతి ద్రోహి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎన్నికల్లో ఓడించాలని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. -
పిఠాపురం అసెంబ్లీ ఎన్నికల బరిలో 13 మంది
[ 01-05-2024]
పిఠాపురం అసెంబ్లీ స్థానానికి ఎన్నికల బరిలో 13 మంది నిలిచారు. ఆ వివరాలను ఆర్వో రామసుందర్రెడ్డి వెల్లడించారు. -
పచ్చని కుటుంబంలో మద్యం చిచ్చు
[ 01-05-2024]
కన్నతండ్రే కొడుకును హత్య చేశాడు.. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ మత్తుకు అలవాటు పడి, తమను వేధిస్తుండటం భరించలేక సహనం కోల్పోయి అతని ప్రాణాలు తీశాడు. -
గండాల దారులను గాలికొదిలేశారు!
[ 01-05-2024]
నిత్యం వందల వాహనాలు తిరిగే ఉమ్మడి జిల్లా ప్రధాన దారులివి. గుంతలతో ప్రయాణికులకు గండాలుగా మారాయి. -
అభాగ్యులపై పగ.. పంపిణీలో దగా
[ 01-05-2024]
ఎన్నికల వేళ పింఛను పంపిణీలో వైకాపా ప్రభుత్వం ఆడుతున్న నాటకాలు లబ్ధిదారులకు తీవ్ర వేదన మిగులుస్తున్నాయి. -
మిల్లులో వేలు పెట్టారు.. కార్మికుల పొట్ట కొట్టారు
[ 01-05-2024]
రాజమహేంద్రవరం పేపరు మిల్లు.. ఆ పేరు వింటేనే కార్మికుల కళ్లలో ఆనందం. మనసునిండా సంతోషం. -
ఆగని అధికార పార్టీ ఆగడాలు
[ 01-05-2024]
ఎన్నికల సమయంలో కూడా ఇసుకాసురల దందా యథేచ్ఛగా సాగుతోంది. ఎన్జీటీ, సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం ఖాతరు చేయకుండా వైకాపా నాయకులు గోదావరి నదీ గర్భాన్ని యంత్రాలతో ఇష్టారీతిన తవ్వేస్తున్నారు. -
జగన్ దళితులను దగా చేశారు: గోరంట్ల
[ 01-05-2024]
అధికార పార్టీ దళితులను అన్ని విధాలుగా మోసం చేసిందని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి విమర్శించారు. -
ఇచ్చినవే అమలుకాక.. కొత్తవి గుప్పించలేక..
[ 01-05-2024]
ముఖ్యమంత్రి జగన్ హామీలిచ్చి మడమ తిప్పేయడంలో ఆరితేరారు. జిల్లాకు వచ్చినప్పుడల్లా గతంలో చేసిన బాసలు సైతం విస్మరించి మరికొన్ని ప్రకటించి వెళ్లిపోయేవారు. -
మండపేటలో వారాహి విజయభేరి సభ నేడు
[ 01-05-2024]
జనసేనాని పవన్కల్యాణ్ బుధవారం మండపేటలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు అక్కడ వారాహి విజయభేరి బహిరంగ సభకు హాజరవుతారని నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి వేగుళ్ల లీలాకృష్ణ, కూటమి ఉమ్మడి అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు తెలిపారు. -
బరి.. గెలుపే గురి
[ 01-05-2024]
ఉమ్మడి జిల్లాలో నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పార్లమెంట్ స్థానాల పరిధిలో పరిశీలిస్తే.. కాకినాడ, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమలకు 15 మంది చొప్పున అభ్యర్థులు బరిలో నిలిచారు. -
భీమేశ్వరా.. భక్తుల బాధలు కనవా..?
[ 01-05-2024]
భగవానుగ్రహం కోసం ఆలయాలనికి వెళితే.. వివిధ రుసుముల పేరిట బాదుడు అధికమవుతోందని భీమేశ్వరస్వామి భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పేరు మార్పునకు ముద్రగడ సిద్ధంగా ఉండాలి
[ 01-05-2024]
త్వరలో జరగనున్న పిఠాపురం అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ గెలవనున్నారని పేరు మార్చుకునేందుకు సిద్ధంగా ఉండాలని ముద్రగడను ఉద్దేశించి జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి(బాబు) అన్నారు. -
బిల్లు.. ఇల్లు ఘొల్లు
[ 01-05-2024]
గత తెదేపా ప్రభుత్వ హయాంలో ఎన్నికల ముందు మంజూరైన గృహాలకు బిల్లుల చెల్లింపులో అనంతరం అధికారంలోకి వచ్చిన వైకాపా కక్ష పూరితంగా వ్యవహరించింది. -
పరారీలో అధికార పార్టీ నేతలు
[ 01-05-2024]
పిఠాపురంలో రూ.80 లక్షల పైచిలుకు అక్రమ మద్యం పట్టుబడిన కేసులో అసలు దొంగలైన వైకాపా నేతలు పరారీలో ఉన్నారు.