logo

జగన్‌ను కుర్చీ దింపాలి

ఎన్నికల ప్రచారంలో భాగంగా అర్బన్‌ నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యే ఆభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ నేతృత్వంలో మంగళవారం సాయంత్రం భారీ ర్యాలీ, రోడ్‌ షో నిర్వహించారు.

Published : 24 Apr 2024 06:17 IST

వంగవీటి రాధా

 రోడ్‌ షోలో పాల్గొన్న రాధా, ఆదిరెడ్డి తదితరులు

 టి.నగర్‌, న్యూస్‌టుడే: ఎన్నికల ప్రచారంలో భాగంగా అర్బన్‌ నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యే ఆభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ నేతృత్వంలో మంగళవారం సాయంత్రం భారీ ర్యాలీ, రోడ్‌ షో నిర్వహించారు. తెదేపా నేత వంగవీటి రాధా, ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాధా మాట్లాడుతూ మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన జగన్‌ను కుర్చీ దింపాల్సిన బాధ్యత ఓటర్లపై ఉందన్నారు. ప్రజాసంక్షేమ పాలన కోసం చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రంలో మోదీ అధికారం చేపట్టాలన్నారు. అనంతరం ద్విచక్రవాహనాలు, కార్లతో భారీ ర్యాలీ సాగింది. ట్రైనింగ్‌ కళాశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ డీలక్స్‌ సెంటర్‌, మెయిన్‌రోడ్డు, టౌన్‌హాల్‌ రోడ్డు, రౌతుతాతాలు కల్యాణ మండపం, బైపాస్‌, ఆజాద్‌చౌక్‌, దేవీచౌక్‌, కంబాలచెరువు మీదుగా చిరంజీవి బస్టాండ్‌ వరకూ సాగింది. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, జనసేన నగర ఇన్‌ఛార్జి అత్తి సత్యనారాయణ, నగర అధ్యక్షుడు వై.శ్రీను, రెడ్డి సుబ్రహ్మణ్యం, కాశీ నవీన్‌కుమార్‌, వర్రే శ్రీనివాసరావు, నల్లం శ్రీను పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని