Guntur: బ్యాంకుల్లో ఇంటి దొంగలు
బ్యాంకులో పని చేస్తున్న సిబ్బంది కొంతమంది చేతివాటం ప్రదర్శించి రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. వ్యవసనాలకు బానిసలైన కొందరు బంగారం తాకట్టు పేరుతో రూ.కోట్ల రుణాల గోల్మాల్కు పాల్పడుతున్న సంఘటనలు బాపట్లలో తరచుగా జరుగుతున్నాయి.
నాడు బీవోబీ.. నేడు బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర.. రేపు?
బంగారం తాకట్టులో సిబ్బంది చేతివాటం
బాపట్ల, న్యూస్టుడే
బ్యాంకులో పని చేస్తున్న సిబ్బంది కొంతమంది చేతివాటం ప్రదర్శించి రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. వ్యవసనాలకు బానిసలైన కొందరు బంగారం తాకట్టు పేరుతో రూ.కోట్ల రుణాల గోల్మాల్కు పాల్పడుతున్న సంఘటనలు బాపట్లలో తరచుగా జరుగుతున్నాయి. మూడేళ్ల క్రితం బ్యాంకు ఆఫ్ బరోడాలో ఖాతాదారుల బంగారాన్ని ఉద్యోగి పేరలి సుమంత్ మాయం చేసి ప్రైవేటు తనఖా సంస్థల్లో రూ.2.50 కోట్లకు తాకట్టు పెట్టి భారీ మోసానికి పాల్పడ్డాడు. తాజాగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో బ్యాంకులో గోల్డ్ అప్రైజర్గా పనిచేస్తున్న వెల్లటూరి రాఘవేంద్ర 41 బినామీ ఖాతాల్లో నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి రూ.1.77 కోట్ల రుణాలు స్వాహా చేశాడు. రెండు ఘటనల్లో మోసం జరిగే వరకు బ్యాంకు అధికారులు గుర్తించలేకపోవడం గమనార్హం. బ్యాంకుల్లో అంతర్గతంగా నిర్వహించిన ఆడిటింగ్లో అక్రమాలు బయటపడ్డాయి.
రైతులు, చిరుద్యోగులే బాధితులు
బ్యాంక్ ఆఫ్ బరోడాలో రైతులు, చిరుద్యోగులు, మధ్యతరగతి కుటుంబాల వారు బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. బ్యాంకులో పనిచేస్తున్న ఉద్యోగి సుమంత్ బ్యాంకులో లాకర్ల తాళాలు తెరిచి బంగారు ఆభరణాలను తీసి బయటకు తరలించాడు. రెండు ప్రైవేటు తనఖా ఆర్థిక సంస్థల్లో వాటిని తాకట్టు పెట్టి రూ.2.50 కోట్ల వరకు రుణాలు తీసుకున్నాడు. జల్సాలకు అలవాటు పడి విపరీతంగా ఖర్చు చేశాడు. బ్యాంకు లాకర్లలో భద్రంగా ఉంచాల్సిన రూ.కోట్ల విలువైన బంగారు ఆభరణాలను బయటకు తరలిస్తున్నా బ్యాంకు మేనేజర్, అధికారులు గుర్తించలేకపోయారు. మరో ఉద్యోగి సహకారంతో సుమంత్ ఘరానా మోసానికి పాల్పడ్డాడు. పై అధికారులు బ్యాంకుకు వచ్చి నిర్వహించిన అంతర్గత ఆడిటింగ్లో లాకర్లలో బంగారం మాయమైన విషయం వెలుగులోకి వచ్చింది. అధికారులు చేసిన ఫిర్యాదుతో నిందితులను బాపట్ల పట్టణ పోలీసులు అరెస్టు చేసి ప్రైవేటు తనఖా సంస్థల వద్ద ఉన్న బంగారు ఆభరణాలను రికవరీ చేసి తిరిగి బ్యాంక్ ఆఫ్ ఆఫ్ బరోడాకు అప్పగించారు.
రెండు నెలల్లో.. 41 ఖాతాలతో..
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో గోల్డ్ అప్రైజర్గా పనిచేస్తున్న వెల్లటూరి రాఘవేంద్ర స్నేహితులతో కలిసి చెడు అలవాట్లకు బానిసయ్యాడు. స్నేహితులతో కలిసి జల్సాలు చేసుకోవటానికి నగదు కావాల్సి వచ్చింది. నేరప్రవృత్తి కలిగిన స్నేహితులతో కలిసి బ్యాంకు నుంచి రుణాలు స్వాహా చేయటానికి పన్నాగం పన్నాడు. తమ వద్ద బంగారం ఉందని అవసరం కోసం మీ పేరు మీద తాకట్టు పెడుతున్నామని తమకు తెలిసిన వారిని నమ్మించారు. స్నేహితులు, తెలిసిన వారిని బినామీలుగా మార్చి వారి పేరు మీద నకిలీ బంగారం తాకట్టుపెట్టి 41 ఖాతాల ద్వారా రెండు నెలల్లో రూ.1.77 కోట్ల రుణాలను అక్రమంగా తీసుకుని భారీ మోసానికి పాల్పడ్డారు. నకిలీ బంగారాన్ని తనఖా పెట్టిన బ్యాంకులో అప్రైజరుగా ఉన్న రాఘవేంద్ర ఆభరణాలను పరిశీలించి అసలైన బంగారంగా ధ్రువీకరించటంతో బ్యాంకు అధికారులు గుడ్డిగా రుణాలు మంజూరు చేశారు. రుణాల సొమ్మును స్నేహితులతో కలిసి అతడు స్వాహా చేశాడు. అక్రమాలు వెలుగులోకి రావటంతో బినామీలుగా ఉన్నవారు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తమ పేరు మీద అసలైన బంగారం తాకట్టు పెడుతున్నామంటే నమ్మి సంతకాలు చేశామని, నకిలీ బంగారం పెట్టారన్న విషయం తమకు తెలియదని వాపోతున్నారు.
బ్యాంకు అధికారుల పాత్రపై దర్యాప్తు అవసరం
రెండు నెలల్లో రూ.కోట్లలో రుణాలు తీసుకుని అక్రమాలకు పాల్పడుతుంటే బ్యాంకు అధికారులకు తెలియకపోవటం నమ్మశక్యంగా లేదని బ్యాంకింగ్ వర్గాలు అంటున్నాయి. బ్యాంకులో కొందరు సిబ్బంది సహకారం లేనిదో ఈ స్థాయిలో భారీ మోసం జరగదని తేల్చి చెబుతున్నారు. రుణాల మోసం బయటపడటంతో బినామీలుగా ఉన్నవారు బయటకు వచ్చారు. పట్టణానికి చెందిన ఓ మాజీ నేత, కొందరు వ్యక్తులు అక్రమాల వెనక ఉన్నారని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ వకుల్జిందాల్కు ఫిర్యాదు చేశారు. రుణాల స్వాహాలో బినామీలుగా ఆరోపిస్తున్న వ్యక్తులతో పాటు బ్యాంకు అధికారులు, సిబ్బంది పాత్రపైనా పోలీసు ఉన్నతాధికారులు సమగ్ర దర్యాప్తు చేయించాల్సిన అవసరం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సూపర్6 తో సమగ్ర ప్రగతి
[ 08-05-2024]
‘రైతులకు ఆదాయం, గౌరవం పెంచేలా సాగును లాభసాటిగా తీర్చిదిద్దుతాం. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన మౌలిక వసతులతో వారి జీవన ప్రమాణాలు పెంచుతాం. రాజధాని అమరావతి నిర్మాణంతో ఈ ప్రాంత ప్రగతికి అవకాశాలు విస్తృతమవుతాయి. -
నైపుణ్యం చిదిమేశావు.. నైరాశ్యం నింపేశావు!
[ 08-05-2024]
ప్రపంచం మెచ్చే ప్రతిభా, పాటవాలు కలిగిన యువతను వైకాపా ఆధ్వర్యంలోని జగన్ ప్రభుత్వం గుర్తించలేదు. వారిలో ఉన్న శక్తి సామర్థ్యాలు తెలుసుకోలేదు. వారికి సరైన ఉద్యోగావకాశాలు కల్పించకుండా ఐదేళ్ల పాలనలో యువశక్తిని నిర్వీర్యం చేసిందనే అపవాదును జగన్ సర్కారు మూటగట్టుకుంది. -
జనం భూములపై జగన్ కుతంత్రం
[ 08-05-2024]
ఏపీ భూ హక్కు చట్టంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సామాన్యుల ఆస్తులు దర్జాగా లాక్కునేందుకు జగన్ కుట్ర పన్నుతున్నారని, అందుకు మార్గంగా భూ హక్కు చట్టాన్ని ఎంచుకున్నారని గగ్గోలు పెడుతున్నారు. అధికారికంగానే ప్రజల భూములను ఆక్రమించేందుకు జగన్ ఈ చట్టాన్ని తీసుకొచ్చారంటున్నారు. -
మా పోస్టల్ బ్యాలట్ ఎక్కడ..?
[ 08-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు పోస్టల్్ బ్యాలట్ నిర్వహణ తీరు గందరగోళంగా మారింది. పీవో, ఏపీవోలు బ్యాలట్ వినియోగంలోనూ స్పష్టత లేదు. -
ఖద్దరు అరాచకం.. ఖాకీల సలాం..
[ 08-05-2024]
చట్టం చేసే వారు.. దాన్ని అమలు చేయాల్సిన వారు ఒక్కటై.. వికృత క్రీడ ఆడితే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో గత అయిదేళ్లలో రాష్ట్రంలో పరిస్థితులు అద్దం పట్టాయి. అధికార పక్షానికి కొమ్ముకాస్తూ ప్రతిపక్షాలను అణిచివేయడమే ధ్యేయంగా కొందరు పోలీసులు పనిచేసి అప్రతిష్ఠను మూటగట్టుకున్నారు. -
ఇసుకాసురులు
[ 08-05-2024]
వైకాపా నేతలు బరితెగించి కృష్ణా తీరంలో ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో జీసీకేసీ కంపెనీకి కొన్ని రీచ్లలో ఇసుక తవ్వకాలకు అనుమతులను సాకుగా చూసి అడ్డగోలుగా తవ్వి తరలిస్తున్నారు. -
కొలువుల కల్పన.. వట్టి మాటలేనా.. గట్టిమేలు ఏదీ జగన్?
[ 08-05-2024]
జగన్ ఐదేళ్ల పాలన తలుచుకుని జిల్లాలోని యువత కోపంతో రగిలిపోతోంది. ఐదేళ్లలో నిరుద్యోగం బాగా పెరిగిపోయింది. ఉద్యోగాలు, స్వయం ఉపాధిపై కోటి ఆశలతో చదువులు పూర్తిచేసి విద్యాలయాల నుంచి బయటకు రావటమే తప్ప కొలువులు దక్కించుకున్నవారు బహు అరుదనే చెప్పాలి. -
తెదేపా నేత కారుకు నిప్పు
[ 08-05-2024]
ఈపూరు మండలం ముప్పాళ్ల మాజీ సర్పంచి, తెదేపా నేత మోదుగుల నరసింహారావు కారును గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం వేకువన తగులబెట్టారు. గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన అనంతరం నరసరావుపేట వెళ్లి వచ్చి ఖాళీ ప్రదేశంలో కారు నిలిపి ఇంట్లో నిద్రపోయారు. -
ఎన్నికల సామగ్రికి పంచాయతీ నిధులు
[ 08-05-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లకు అయ్యే ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరించడం ఎప్పటి నుంచో వస్తుంది. ఈసారి జగన్ సర్కారు గతంలో ఎన్నడూలేని విధంగా స్థానిక సంస్థలపై ఎన్నికల నిర్వహణ భారం వేస్తోంది. -
సజావుగా పోస్టల్ బ్యాలెట్ పోలింగ్
[ 08-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ మూడో రోజు సజావుగా సాగింది. ఏడు నియోజకవర్గాల పరిధిలో మంగళవారం పోలింగ్ కేంద్రాల్లో 2516 ఓట్లు పోలయ్యాయి. -
మంగళగిరి అభివృద్ధికి లోకేశ్కు ఓటేయండి
[ 08-05-2024]
పేదరికం లేని మంగళగిరి నియోజకవర్గ సాధన కోసం నారా లోకేశ్కు ఓటు వేయాలని ఆయన కుటుంబ సభ్యులు మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మంగళగిరి శ్రీలక్ష్మీనృసింహస్వామి గాలి గోపురం నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. -
‘దళితులంతా లోకేశ్ విజయానికి కృషి చేయాలి’
[ 08-05-2024]
మంగళగిరి తెదేపా అభ్యర్థి నారా లోకేశ్ విజయానికి దళితులంతా కలసి పనిచేయాలని ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కట్టెపోగు బసవరావు పిలుపునిచ్చారు. -
పరిశీలకులకు ఎన్నికల వ్యయం అభ్యర్థనలు, ఫిర్యాదులు
[ 08-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ముగ్గురు వ్యయ పరిశీలకులను జిల్లాకు కేటాయించిందని కలెక్టరు ఎం.వేణుగోపాల్రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
‘మేం ఓట్లు అమ్ముకోం.. మా ఇంటికి రావొద్దు’
[ 08-05-2024]
మరో వారంలో ఎన్నికలు జరగబోతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు ఓట్ల వేటలో నిగమ్నమయ్యాయి. -
‘రాక్షస పాలనకు ఓటుతో అంతం పలుకుదాం’
[ 08-05-2024]
రాష్ట్రంలో అయిదేళ్లుగా సాగుతున్న రాక్షస పాలనకు ప్రజలు ఓటుతో అంతం పలకాలని సినీ నటుడు నారా రోహిత్ పిలుపునిచ్చారు. చెరుకుపల్లి మండలం బలుసులపాలెం, ఆరుంబాక గ్రామాల్లో తెదేపా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మంగళవారం మాట్లాడారు. -
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పటిష్ఠ బందోబస్తు
[ 08-05-2024]
ఓటుహక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తప్పని సరిగా ఎన్నికల్లో ఓటేయాలని కలెక్టర్ రంజిత్బాషా సూచించారు. రేపల్లె మండలం పేటేరు ప్రాథమిక, ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను మంగళవారం సందర్శించారు. -
ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దాం
[ 08-05-2024]
ఈనెల 13న సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని స్వీప్(పీడబ్యూడీ) జిల్లా నోడల్ అధికారి గుణశీల అన్నారు. -
దివ్యాంగులు.. వృద్ధులకు వాహన సౌకర్యం
[ 08-05-2024]
దివ్యాంగులు, వృద్ధ ఓటర్ల కోసం ఈసీ ప్రత్యేకంగా సక్షం యాప్ను ప్రవేశపెట్టిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రంజిత్బాషా తెలిపారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ దివ్యాంగులు, వృద్ధులు ఓట్లు వేయటానికి తమ ఫోన్లలో సక్షం యాప్ను డౌన్లోడ్ చేసుకుని పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.