logo

పీవీ ఎక్స్‌ప్రెస్‌ వేపై ప్రమాదం: ఒకరి దుర్మరణం

పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై శుక్రవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. రాజేంద్రనగర్‌ ఎస్సై సమరంరెడ్డి తెలిపిన వివరాల మేరకు... మహ్మద్‌ అమీదుద్దీన్‌(45)  అంబర్‌పేట్లో

Published : 23 Jan 2022 03:09 IST

రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై శుక్రవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. రాజేంద్రనగర్‌ ఎస్సై సమరంరెడ్డి తెలిపిన వివరాల మేరకు... మహ్మద్‌ అమీదుద్దీన్‌(45)  అంబర్‌పేట్లో నివసిస్తున్నాడు. కరీంనగర్‌లో నివసించే తన బావ కుమారుడు విదేశాలకు వెళ్తుండటంతో శుక్రవారం రాత్రి వారికి వీడ్కోలు పలికేందుకు తన కుమారుడు ఫైసుద్దీన్‌(12)తో కలిసి విమానాశ్రయానికి వెళ్లాడు. రాత్రి 8.30గంటలు కావడం.. చలిగా ఉండటంతో కుమారుడిని బంధువుల కారు ఎక్కించి అమీనుద్దీన్‌ వెనుక బైక్‌పై బయలుదేరాడు. ఆరాంఘర్‌ దగ్గర కారు పీవీఎక్స్‌ప్రెస్‌ వే పైకి ఎక్కింది. నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్రవాహనాన్ని కూడా అమీదుద్దీన్‌ ఎక్స్‌ప్రెస్‌వే పైకి ఎక్కించాడు. కొద్దిదూరం ప్రయాణించగానే వాహనం స్కిడ్‌ అయి కిందపడ్డాడు. హెల్మెట్ ఊడిపోవడంతో తలకు గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని