పల్లెలపై కాలుష్యం పడగ.. పర్యవేక్షణ పడక
ఐదేళ్ల క్రితం ఆత్కూరు ఆటవీ ప్రాంతంలో సర్వే సంఖ్య 19లో భారీగా వ్యర్థ రసాయనాలు బయట పడ్డాయి. కంకర తవ్వకాలు చేపట్టిన ప్రదేశంలో రహస్యంగా వీటిని నిల్వ చేశారు. సంగారెడ్డి సమీపంలోని ఓ ఔషధ పరిశ్రమలో మిగిలిన వ్యర్థ
పొలాల మధ్యన జిప్సం తయారీ పరిశ్రమ
న్యూస్టుడే, పెద్దేముల్
రంగు మారిన సుద్ద మట్టి
* ఐదేళ్ల క్రితం ఆత్కూరు ఆటవీ ప్రాంతంలో సర్వే సంఖ్య 19లో భారీగా వ్యర్థ రసాయనాలు బయట పడ్డాయి. కంకర తవ్వకాలు చేపట్టిన ప్రదేశంలో రహస్యంగా వీటిని నిల్వ చేశారు. సంగారెడ్డి సమీపంలోని ఓ ఔషధ పరిశ్రమలో మిగిలిన వ్యర్థ రసాయనాలను ఇక్కడికి తెచ్చి పారబోసినట్లు అప్పట్లో పోలీసుల విచారణలో తేలింది. ఘాటైన దుర్వాసన రావడంతో విషయం బయటకు వచ్చింది. ప్రతి ట్యాంకరుకు రూ.20 వేల చొప్పున చెల్లించి వీటిని అటవీ ప్రాంతాల్లో పారబోసినట్లు పోలీసులు గుర్తించారు. బాధ్యులపై చర్యలు తీసుకున్నారు.
* కందనెల్లి రెవెన్యూ శివారులో గల వ్యవసాయ క్షేత్రంలో అటవీ ప్రాంతానికి పక్కనే వ్యర్థ రసాయనాలతో జిప్సం తయారీ చేస్తున్నారు. దీని తయారీతో ప్రజలు ఊపిరి తీసుకోని పరిస్థితులు ఏర్పడ్డాయి. రాత్రి సమయంలో చిన్నారులు, వృద్ధులు దుర్వాసన భరించలేక అస్వస్థతకు గురవుతున్నారు. పరిశ్రమను మూసివేయాలని గిరిజనులు కోరుతుంటే నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారు.
వికారాబాద్ జిల్లా ఒకప్పుడు పచ్చందాలకు పెట్టింది పేరు. కాలక్రమంలో యథేచ్ఛగా చెట్లను కొట్టేయడం, రోజురోజుకు నిర్మాణాలు పెరుగుతుండటం తదితర కారణాలతో పచ్చదనం తరిగిపోతోంది. దీనికితోడు కోరలుచాస్తున్న కాలుష్యం.. ప్రధానంగా సంగారెడ్డి, హైదరాబాద్ నగరాల చుట్టూ నెలకొన్న ఔషధ పరిశ్రమల్లో మిగిలిన వ్యర్థ రసాయనాలను జిల్లాలోని పల్లెలు, అటవీ ప్రాంతాలు, చెట్ల పొదలతో నిండిన పొలాల్లో పారబోసి కంపెనీలు చేతులు దులిపేసుకుంటున్నాయి. తద్వారా ఘాటైన వాసనలు పల్లె ప్రజలను అనారోగ్యం పాలుచేస్తున్నాయి. దీనికి సంబంధించి ‘న్యూస్టుడే’ కథనం.
నిల్వ చేసిన వ్యర్థ రసాయనాలు
అసలు ఏం జరుగుతోంది
కందనెల్లి గ్రామ రెవెన్యూ శివారు కందనెల్లి తండా సమీపంలో మూడేళ్ల క్రితం జిప్సం పరిశ్రమను నెలకొల్పారు. పొలాల మధ్యన ఏం జరుగుతుందో ఎవరికీ అర్ధం కాదు. సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రదేశం ఉంది. అత్యంత రహస్యంగా జిప్సంను తయారు చేస్తున్నారు. ట్యాంకర్లలో వచ్చే రసాయనాలను తొట్ల మాదిరిగా ఉండే వాటిల్లో పారబోస్తున్నారు. దానికి స్థానికంగా లభించే నాపరాతి పొడిని మిశ్రమంగా కలిపేస్తున్నారు. మట్టిలో ఇలా రోజుల తరబడి నిల్వ చేసి ఆ తర్వాత ముద్దలు ముద్దలుగా లారీల్లో తరలిస్తున్నారు.
నిరసన తెలిపినా హామీలతో సరి
జిప్సం తయారీ నిబంధనలకు విరుద్ధంగా ఉంది. ఏ రసాయనాలు వాడుతున్నారనే విషయాన్ని ఏ ఒక్క అధికారి పరిశీలించలేదు. అనేక సార్లు బాధిత ప్రజలు పరిశ్రమలోకి వెళ్లి నిరసనలు వ్యక్తం చేశారు. తాజాగా స్థానికులు తీవ్ర ఆందోళన చేయడంతో పరిశ్రమను మూసేయిస్తామంటూ అధికారులు హామీలతో సరిపెట్టారు.
ఎన్నెన్నో కష్టాలు..
* జిప్సం తయారీ పరిశ్రమ అటవీ ప్రాంతం పక్కనే ఉంది. ఘాటైన వాసనలతో అడవి జంతువులు సైతం ఊపిరి తీసుకోలేని స్థితి ఏర్పడింది.
* అంతారం పెద్ద చెరువు, జంతి కుంట, అటవీ ప్రాంతంలోని చిన్న కుంటలు, చెక్ డ్యాంలు ఉన్నాయి. ఎగువ ప్రాంతంలో ఉన్న పరిశ్రమ నుంచి రసాయనాలు దిగువన ఉన్న చెరువు నీటిలో కలిసి కలుషితం అవుతున్నాయి.
* వ్యర్థ రసాయనాలతో తయారు చేస్తున్న జిప్సం వల్ల తాండూరు మండలం అంతారం, అంతారం తండా, పెద్దేముల్ మండలం కందనెల్లి తండా, గొట్లపల్లి గ్రామాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
గర్భస్రావాలు అధికం అయ్యాయి
భజనీబాయి, కందనెల్లి తండా
ఈ పరిశ్రమ కారణంగా మహిళల ఆరోగ్య పరిస్థితి సరిగా ఉండటం లేదు. గర్భస్రావాలను అవుతున్నాయి. ఇప్పటికే తండాలో నలుగురికి పిండం ఎదగకపోవడం వల్ల గర్భస్రావం చేయించారు.
గింజ ఇంటికి రాలేదు
శంకర్, కందనెల్ల్లి తండా
ఏళ్లుగా పంటను సాగు చేసి జీవనం సాగిస్తున్నాం. మూడేళ్లుగా పరిస్థితి మారిపోయింది. పరిశ్రమ ఏర్పాటుతో మా బతుకులలో మట్టి పోశారు. గింజ ఇంటికి రావడం లేదు.
పోరాటం కొనసాగుతుంది
మధులత, మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు, పెద్దేముల్
నా సొంత రెవెన్యూ గ్రామంలో పరిశ్రమ నుంచి ప్రజలకు కలుగుతున్న ఇబ్బందుల గురించి అధికారులకు రాత పూర్వకంగా తెలియజేశాను. రెవెన్యూ అధికారులు విచారణ జరిపి మధ్యలోనే వదిలేశారు. పూర్తి స్థాయిలో పరిశ్రమను మూసివేసే వరకు ప్రజల తరపున మా పోరాటం కొనసాగుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
[ 26-04-2024]
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ముఠా అరెస్టు
[ 26-04-2024]
సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ముఠాను దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. -
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
[ 26-04-2024]
భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులను హెచ్ఎండీఏ పరిధిలో ఇక నుంచి ఏకగవాక్ష పద్ధతిలో జారీ చేయనున్నారు. గతంలో అందుబాటులోకి తెచ్చిన తెలంగాణ స్టేట్ లేఅవుట్ అండ్ బిల్డింగ్ పర్మిషన్ ఆమోదం, స్వీయ ధ్రువీకరణ వ్యవస్థ(టీఎస్బీపాస్) ద్వారానే అనుమతులు మంజూరు చేస్తారు. -
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
[ 26-04-2024]
ఎన్నికలంటే ఎప్పుడైనా సందడే.. ఓటర్లను కూడగట్టడం ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న పని. ప్రస్తుత ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కు ఎంతో ప్రతిష్ఠాత్మకమని భావిస్తున్నారు. -
కూకట్పల్లిలో హత్యాచారం కేసు.. 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
[ 26-04-2024]
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
నేతలు రోడ్డెక్కె.. ప్రచారం వేడెక్కె
[ 26-04-2024]
రాజధానిలో లోక్సభ ఎన్నికల్లో ప్రచారం వేడెక్కింది. మొన్నటివరకు అభ్యర్థులు ఖరారు కాకపోవడం.. ఎండలు మండిపోతుండటంతో జనంలోకి వెళ్లడానికి నేతలు వెనకాముందాడారు. ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో పార్టీల్లో కదలిక వచ్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
కేరింతలతో హోరెత్తె..
[ 26-04-2024]
సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్కు క్రికెట్ అభిమానులు భారీగా తరలివచ్చారు. పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. -
నగరాన.. సీఎం సుడిగాలి పర్యటన
[ 26-04-2024]
సీఎం రేవంత్రెడ్డి గురువారం నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. ఇటీవల మధుయాస్కి తల్లి మృతి చెందడంతో ఉదయం హయత్నగర్లోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. -
స్మార్ట్గా ఓటర్లకు చేరువ
[ 26-04-2024]
ఎన్నికలంటే పార్టీలు, అభ్యర్థుల పాటలతో బస్తీలు మార్మోగేవి. కార్యకర్తలు, అభిమానులు పార్టీ జెండాలు, కండువాలతో పెద్దఎత్తున ఇంటింటి ప్రచారం నిర్వహించేవారు. -
దోమా దోమ.. ఇం‘ధనం ఏదమ్మా’?
[ 26-04-2024]
జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం దోపిడీకి చిరునామాగా మారింది. ఫాగింగ్ పేరుతో కొందరు జోనల్ స్థాయి అధికారులు డీజిల్ను అమ్మేసుకుంటున్నారు. -
ముగిసిన మొదటి పర్వం
[ 26-04-2024]
రాజధానిలోని నాలుగు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. చివరి రోజు కావడంతో నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. -
రూ.వంద కోట్లు దాటినా.. ఇచ్చింది సున్నా
[ 26-04-2024]
శివార్లలో మురుగు నిర్వహణకు సంబంధించి నిధుల విడుదలలో బల్దియా జాప్యంతో జలమండలి మల్లగుల్లాలు పడుతోంది. 13 నెలలుగా ఒక్క పైసా కూడా బల్దియా నుంచి జలమండలి ఖాతాకు జమ కావడంలేదని అధికారులు వాపోతున్నారు. -
జేఈఈ మెయిన్స్లో సత్తా
[ 26-04-2024]
ఇంజినీర్ కావడానికి ఐఐటీల్లోనే చదవాలన్న సంకల్పంతో రెండేళ్లు వారు అహర్నిశలు కష్టపడ్డారు. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతో జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో సత్తా చాటారు. వంద శాతం పర్సంటైల్ సాధించి ప్రతిభ కనబరిచారు. -
శేషగిరికి కన్నీటి వీడ్కోలు
[ 26-04-2024]
విధుల్లో ఉన్న సమయంలో ఏకే-47 తుపాకీ ప్రమాదవశాత్తు పేలడంతో మృతిచెందిన సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరి(47)కు నగరవాసులు కన్నీటి వీడ్కోలు పలికారు. -
తలసరి ఆదాయమేకాదు.. కరెంట్ వినయోగంలోనూ టాప్
[ 26-04-2024]
ఐటీ సంస్థలు.. ఏరో సెజ్లు.. డాటా కేంద్రాలు, అంతర్జాతీయ విమానాశ్రయం.. పరిశ్రమలు.. ఈ-మొబిలిటీ వ్యాలీ.. ఆకాశహార్మ్యాలు... కన్వెన్షన్ సెంటర్లు.. వినోద కేంద్రాలు.. విద్యాసంస్థలు.. వ్యవసాయ ఉత్పత్తులకు నిలయంగా ఉన్న రంగారెడ్డి జోన్ పరిధిలో అత్యధిక కరెంట్ డిమాండ్ ఉంటోంది. -
ఐపీఎల్ టికెట్ల గోల్మాల్పై చర్యలకు డిమాండ్
[ 26-04-2024]
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్ల గోల్మాల్, బ్లాక్ దందాపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి డిమాండ్ చేశారు. -
మంగళ్ ‘హాట్ ఠాణా’
[ 26-04-2024]
శాంతిభద్రతలపరంగా మంగళ్హాట్ ఠాణా అతి సున్నితమైంది. పోలీస్ స్టేషన్లో కొందరు అధికారులు, సిబ్బంది అవినీతి, అక్రమాలతో అప్రతిష్ఠ మూటగట్టుకుంటోంది. -
నినాదాల హోరు.. కాంగ్రెస్ శ్రేణుల జోరు
[ 26-04-2024]
రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్లో గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహించిన రోడ్డుషో సందడిగా సాగింది. ఉప్పర్పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. -
అధ్యాపకుల కొరత.. అసౌకర్యాల వెత
[ 26-04-2024]
జిల్లాలో ఈసారి ఇంటర్ ద్వితీయ ఫలితాలు ఒక మెట్టు కిందకే ఉండటం అటు అధ్యాపకులను, ఇటు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. అదే సమయంలో ప్రథమ సంవత్సరంలో మాత్రం మెరుగైన ఫలితం రావడం అందరికీ సంతోషదాయకంగా ఉంది. -
దేవాదాయ భూముల రక్షణకు సమష్టి కృషి
[ 26-04-2024]
దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు అన్యాక్రాంతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు పాలనాధికారి లింగ్యానాయక్ అన్నారు. -
న్యాయమూర్తులకు ఘనంగా వీడ్కోలు
[ 26-04-2024]
ఉద్యోగ జీవితంలో బదిలీలు అనివార్య ప్రక్రియ అని రంగారెడ్డి జిల్లా కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎస్.శశిధర్రెడ్డి అన్నారు. -
ముగిసిన చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు
[ 26-04-2024]
వారం రోజులుగా అట్టహాసంగా కొనసాగిన చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలు గురువారం చక్రస్నానం, ధ్వజావరోహణంతో ముగిశాయి. -
‘అభివృద్ధి మరిచి తిట్లతో పాలిస్తున్నారు’
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి తిట్ల పురాణంతో పాలన సాగిస్తుందని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. -
రేవంత్రెడ్డి సభలో స్పృహ తప్పిన కార్యకర్త
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం అత్తాపూర్లో నిర్వహించిన రోడ్డుషోలో ప్రసంగిస్తుండగా ఆయన ముందున్న కార్యకర్తల్లో ఒకరు స్పృహ తప్పి పడిపోయారు. -
రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి: రోనాల్డ్ రాస్
[ 26-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బంది, అధికారుల రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్రాస్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?