సేవలు ఉన్నతం.. సౌకర్యాలు అవసరం
ఆరోగ్య రక్షణలో మూత్రపిండాల పాత్ర అత్యంత కీలకం. ఇవి ఏమాత్రం దెబ్బతిన్నా కష్టాలు తప్పవు. మూత్రపిండాల రోగులు తప్పని సరిగా రక్తశుద్ధిని చేయించుకోవాల్సి ఉంటుంది. వారానికి మూడుసార్లు వారు ఆసుపత్రికి రావాలి.
న్యూస్టుడే, వికారాబాద్ మున్సిపాలిటీ, తాండూరు పట్టణం
వికారాబాద్ ఆసుపత్రిలో ...
ఆరోగ్య రక్షణలో మూత్రపిండాల పాత్ర అత్యంత కీలకం. ఇవి ఏమాత్రం దెబ్బతిన్నా కష్టాలు తప్పవు. మూత్రపిండాల రోగులు తప్పని సరిగా రక్తశుద్ధిని చేయించుకోవాల్సి ఉంటుంది. వారానికి మూడుసార్లు వారు ఆసుపత్రికి రావాలి. గతంలో ఇలాంటి వారికి స్థానికంగా డయాలసిస్ కేంద్రం అందుబాటులో లేక హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చేది. ఇదెంతో కష్టంతో కూడిన పని. వీరి అవస్థలను గుర్తించిన ప్రభుత్వం వికారాబాద్లో, తాండూరులో రక్తశుద్ధి కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది. తద్వారా వారికి అత్యంత ఖరీదైన సేవలు ఉచితంగానే లభిస్తున్నాయి. ఇదే సమయంలో వైద్యు సంఖ్యను, ఆధునిక యంత్రాలను సమకూర్చాల్సి ఉంది. దీనికి సంబంధించి ‘న్యూస్టుడే’ పరిశీలనాత్మక కథనం.
2017లో ఏర్పాటు: * వికారాబాద్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో రక్త శుద్ధి (డయాలసిస్) కేంద్రాన్ని 2017 నవంబర్ 27న రోజున ప్రారంభించారు. అలాగే తాండూరులోనూ ఇదే ఏడాది అందుబాటులోకి తెచ్చారు. * కొడంగల్లో ఇటీవలే మంత్రి హరీశ్రావు కొత్త కేంద్రానికి ప్రారంభోత్సవం చేశారు. పరిగిలో త్వరలో అందుబాటులోకి తెస్తామన్నారు. * ప్రస్తుతం వికారాబాద్ పరిసర మండలాలతో పాటు పరిగి, కుల్కచర్ల, బొంరాస్పేట, నవాబ్పేట, మర్పల్లి, చేవెళ్ల ప్రాంతాల నుంచి వచ్చిన రోగులకు వీటి రాకతో హైదరాబాద్ వెళ్లే సమస్య తప్పింది. * వికారాబాద్ రక్త శుద్ధి కేంద్రంలో 5 పడకలున్నాయి. 5 పరికరాలను ఏర్పాటు చేశారు. ఒక్కో విడతలో 5 మందికి అవకాశం కల్పిస్తున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు, హెల్త్కార్డు ఉన్న వారికి, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి లేఖ ఉన్నట్లయితే వైద్యంతోపాటు మందులూ ఉచితమే. * వికారాబాద్ కేంద్రంలో రోగుల సంఖ్యకు తగినట్లుగా మరిన్ని వసతులు సమకూర్చాల్సి ఉంది. వైద్య సిబ్బందిని పెంచాల్సి ఉంది. మందుల కొరత ఏర్పడకుండా ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షణ అవసరమని రోగులు పేర్కొంటున్నారు.
సర్జన్ను నియమిస్తే మరింత ప్రయోజనం
తాండూరు పట్టణంలో 8 పడకలతో డయాలసిస్ కేంద్రం పనిచేస్తోంది. రోజుకు మూడు విడతల్లో రక్త శుద్ధి చికిత్సలు అందిస్తున్నారు. ఒక్కోసారి రోజుకు 32 మందికి మందికి సేవలు చేస్తున్నారు. రక్త శుద్ధి చేసేందుకు రోగులకు ఏవీ పిస్తుల(ఆర్టీరియో వెన్యూ పిస్తుల)ను అమర్చాల్సి ఉంటుంది. ఈ పరికరం ఇక్కడలేక రోగులు హైదరాబాద్లోని నిమ్స్ లేదా గాంధీ ఆస్పత్రికి వెళ్లి అమర్చుకుని రావాల్సి వస్తుంది. దీనికి ప్రైవేటులో రూ.30 నుంచి రూ.50 వేల దాకా తీసుకుంటారు. ఇక్కడికి వచ్చేదంతా పేద వారే కావడంతో అంత ఖర్చు భరించ లేక 110 కిలో మీటర్ల దూరంలోని రాజధానికి వెళ్లక తప్పడంలేదు. ఏవీ పిస్తుల సౌకర్యం కల్పించాలంటే వాస్కోలర్ సర్జన్ను నియమించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.
* జిల్లా ఆస్పత్రిలో పై అంతస్తులో డయాలసిస్ కేంద్రం ఉండటంతో బాధితులు పైకి ఎక్కటానికి ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి కేంద్రాన్ని కిందికి మార్చాలని బాధితులు కోరుతున్నారు. ఇక్కడ సిబ్బంది కొరత కూడా నెలకుంది.
ప్రభుత్వానికి గతంలోనే విన్నవించాం : డా. రవిశంకర్, జిల్లా ఆస్పత్రి పర్యవేక్షకుడు, తాండూరు
జిల్లా ఆసుపత్రిలో వైద్యుల కొరత, పరికరాల సమకూర్పు తదితర అంశాలపై ప్రభుత్వానికి గతంలోనే విన్నవించాం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వసతులతోనే సేవలు అందిస్తున్నాం. రోగులకు మరిన్ని సేవలు అందించేందుకు కృషి చేస్తాం.
50 మందికి వైద్యం చేస్తున్నాం : : మహ్మద్ రిజ్వాన్ ఇన్ఛార్జి రక్తశుద్ధి కేంద్రం, వికారాబాద్
ఈ కేంద్రంలో ప్రస్తుతం 50 మందికి డయాలసిస్ చికిత్స చేస్తున్నాం. ముందుగా పేరు నమోదు చేసుకుని దరఖాస్తు చేసుకోవాలి. ప్రతి రోగికి నెలకు నాలుగు రక్తానికి సంబంధించిన ఇంజక్షన్లు, ఐరన్ ఇంజక్షన్లు రెండు ఇస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ముఠా అరెస్టు
[ 26-04-2024]
సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ముఠాను దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. -
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
[ 26-04-2024]
భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులను హెచ్ఎండీఏ పరిధిలో ఇక నుంచి ఏకగవాక్ష పద్ధతిలో జారీ చేయనున్నారు. గతంలో అందుబాటులోకి తెచ్చిన తెలంగాణ స్టేట్ లేఅవుట్ అండ్ బిల్డింగ్ పర్మిషన్ ఆమోదం, స్వీయ ధ్రువీకరణ వ్యవస్థ(టీఎస్బీపాస్) ద్వారానే అనుమతులు మంజూరు చేస్తారు. -
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
[ 26-04-2024]
ఎన్నికలంటే ఎప్పుడైనా సందడే.. ఓటర్లను కూడగట్టడం ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న పని. ప్రస్తుత ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కు ఎంతో ప్రతిష్ఠాత్మకమని భావిస్తున్నారు. -
కూకట్పల్లిలో హత్యాచారం కేసు.. 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
[ 26-04-2024]
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
నేతలు రోడ్డెక్కె.. ప్రచారం వేడెక్కె
[ 26-04-2024]
రాజధానిలో లోక్సభ ఎన్నికల్లో ప్రచారం వేడెక్కింది. మొన్నటివరకు అభ్యర్థులు ఖరారు కాకపోవడం.. ఎండలు మండిపోతుండటంతో జనంలోకి వెళ్లడానికి నేతలు వెనకాముందాడారు. ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో పార్టీల్లో కదలిక వచ్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
కేరింతలతో హోరెత్తె..
[ 26-04-2024]
సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్కు క్రికెట్ అభిమానులు భారీగా తరలివచ్చారు. పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. -
నగరాన.. సీఎం సుడిగాలి పర్యటన
[ 26-04-2024]
సీఎం రేవంత్రెడ్డి గురువారం నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. ఇటీవల మధుయాస్కి తల్లి మృతి చెందడంతో ఉదయం హయత్నగర్లోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. -
స్మార్ట్గా ఓటర్లకు చేరువ
[ 26-04-2024]
ఎన్నికలంటే పార్టీలు, అభ్యర్థుల పాటలతో బస్తీలు మార్మోగేవి. కార్యకర్తలు, అభిమానులు పార్టీ జెండాలు, కండువాలతో పెద్దఎత్తున ఇంటింటి ప్రచారం నిర్వహించేవారు. -
దోమా దోమ.. ఇం‘ధనం ఏదమ్మా’?
[ 26-04-2024]
జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం దోపిడీకి చిరునామాగా మారింది. ఫాగింగ్ పేరుతో కొందరు జోనల్ స్థాయి అధికారులు డీజిల్ను అమ్మేసుకుంటున్నారు. -
ముగిసిన మొదటి పర్వం
[ 26-04-2024]
రాజధానిలోని నాలుగు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. చివరి రోజు కావడంతో నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. -
రూ.వంద కోట్లు దాటినా.. ఇచ్చింది సున్నా
[ 26-04-2024]
శివార్లలో మురుగు నిర్వహణకు సంబంధించి నిధుల విడుదలలో బల్దియా జాప్యంతో జలమండలి మల్లగుల్లాలు పడుతోంది. 13 నెలలుగా ఒక్క పైసా కూడా బల్దియా నుంచి జలమండలి ఖాతాకు జమ కావడంలేదని అధికారులు వాపోతున్నారు. -
జేఈఈ మెయిన్స్లో సత్తా
[ 26-04-2024]
ఇంజినీర్ కావడానికి ఐఐటీల్లోనే చదవాలన్న సంకల్పంతో రెండేళ్లు వారు అహర్నిశలు కష్టపడ్డారు. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతో జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో సత్తా చాటారు. వంద శాతం పర్సంటైల్ సాధించి ప్రతిభ కనబరిచారు. -
శేషగిరికి కన్నీటి వీడ్కోలు
[ 26-04-2024]
విధుల్లో ఉన్న సమయంలో ఏకే-47 తుపాకీ ప్రమాదవశాత్తు పేలడంతో మృతిచెందిన సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరి(47)కు నగరవాసులు కన్నీటి వీడ్కోలు పలికారు. -
తలసరి ఆదాయమేకాదు.. కరెంట్ వినయోగంలోనూ టాప్
[ 26-04-2024]
ఐటీ సంస్థలు.. ఏరో సెజ్లు.. డాటా కేంద్రాలు, అంతర్జాతీయ విమానాశ్రయం.. పరిశ్రమలు.. ఈ-మొబిలిటీ వ్యాలీ.. ఆకాశహార్మ్యాలు... కన్వెన్షన్ సెంటర్లు.. వినోద కేంద్రాలు.. విద్యాసంస్థలు.. వ్యవసాయ ఉత్పత్తులకు నిలయంగా ఉన్న రంగారెడ్డి జోన్ పరిధిలో అత్యధిక కరెంట్ డిమాండ్ ఉంటోంది. -
ఐపీఎల్ టికెట్ల గోల్మాల్పై చర్యలకు డిమాండ్
[ 26-04-2024]
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్ల గోల్మాల్, బ్లాక్ దందాపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి డిమాండ్ చేశారు. -
మంగళ్ ‘హాట్ ఠాణా’
[ 26-04-2024]
శాంతిభద్రతలపరంగా మంగళ్హాట్ ఠాణా అతి సున్నితమైంది. పోలీస్ స్టేషన్లో కొందరు అధికారులు, సిబ్బంది అవినీతి, అక్రమాలతో అప్రతిష్ఠ మూటగట్టుకుంటోంది. -
నినాదాల హోరు.. కాంగ్రెస్ శ్రేణుల జోరు
[ 26-04-2024]
రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్లో గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహించిన రోడ్డుషో సందడిగా సాగింది. ఉప్పర్పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. -
అధ్యాపకుల కొరత.. అసౌకర్యాల వెత
[ 26-04-2024]
జిల్లాలో ఈసారి ఇంటర్ ద్వితీయ ఫలితాలు ఒక మెట్టు కిందకే ఉండటం అటు అధ్యాపకులను, ఇటు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. అదే సమయంలో ప్రథమ సంవత్సరంలో మాత్రం మెరుగైన ఫలితం రావడం అందరికీ సంతోషదాయకంగా ఉంది. -
దేవాదాయ భూముల రక్షణకు సమష్టి కృషి
[ 26-04-2024]
దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు అన్యాక్రాంతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు పాలనాధికారి లింగ్యానాయక్ అన్నారు. -
న్యాయమూర్తులకు ఘనంగా వీడ్కోలు
[ 26-04-2024]
ఉద్యోగ జీవితంలో బదిలీలు అనివార్య ప్రక్రియ అని రంగారెడ్డి జిల్లా కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎస్.శశిధర్రెడ్డి అన్నారు. -
ముగిసిన చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు
[ 26-04-2024]
వారం రోజులుగా అట్టహాసంగా కొనసాగిన చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలు గురువారం చక్రస్నానం, ధ్వజావరోహణంతో ముగిశాయి. -
‘అభివృద్ధి మరిచి తిట్లతో పాలిస్తున్నారు’
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి తిట్ల పురాణంతో పాలన సాగిస్తుందని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. -
రేవంత్రెడ్డి సభలో స్పృహ తప్పిన కార్యకర్త
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం అత్తాపూర్లో నిర్వహించిన రోడ్డుషోలో ప్రసంగిస్తుండగా ఆయన ముందున్న కార్యకర్తల్లో ఒకరు స్పృహ తప్పి పడిపోయారు. -
రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి: రోనాల్డ్ రాస్
[ 26-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బంది, అధికారుల రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్రాస్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!