logo

నీటి సంపులో పడి బాలుడి మృతి

ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి ఓ బాలుడు మృతి చెందాడు. పేట్‌బషీరాబాద్‌ ఎస్సై మల్లేశ్వర్‌ కథనం ప్రకారం..

Published : 31 Mar 2023 02:44 IST

పేట్‌బషీరాబాద్‌, న్యూస్‌టుడే: ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి ఓ బాలుడు మృతి చెందాడు. పేట్‌బషీరాబాద్‌ ఎస్సై మల్లేశ్వర్‌ కథనం ప్రకారం.. బిహార్‌కు చెందిన హన్స్‌లాల్‌, బైటా దంపతులు జీవనోపాధి కోసం ఇటీవల శామీర్‌పేట మండలం దేవరయాంజాలకు వలస వచ్చారు. వీరికి కుమార్తె ప్రియాంక(5), కుమారుడు అంకిత్‌(3) ఉన్నారు. భార్య అనారోగ్యం బారిన పడడంతో కుమార్తె, కుమారుణ్ని ఇంటి వద్ద విడిచి గురువారం కండ్లకోయలోని సీఎంఆర్‌ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. మధ్యాహ్నం తిరిగి వచ్చేసరికి అంకిత్‌ ఇంటి దగ్గర లేడు. చుట్టూ వెతకగా ఇంటి ముందున్న నీటి సంపులో పడిపోయినట్లు గుర్తించారు. వెంటనే బయటకు తీసి కొంపల్లిలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని