logo

పేదల సంక్షేమం కాంగ్రెస్‌కే సాధ్యం

పేదల సంక్షేమం కాంగ్రెస్‌ పార్టీకే సాధ్యమని టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు రమేష్‌ మహరాజ్‌ అన్నారు. జోడో యాత్ర కార్యక్రమంలో భాగంగా మండలంలోని కందనెల్లి, మంబాపూరు, రుక్మాపూరు, రేగొండి గ్రామాల్లో సమావేశాలు నిర్వహించారు.

Published : 07 Jun 2023 04:11 IST

మాట్లాడుతున్న రమేష్‌ మహరాజ్‌

పెద్దేముల్‌, న్యూస్‌టుడే: పేదల సంక్షేమం కాంగ్రెస్‌ పార్టీకే సాధ్యమని టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు రమేష్‌ మహరాజ్‌ అన్నారు. జోడో యాత్ర కార్యక్రమంలో భాగంగా మండలంలోని కందనెల్లి, మంబాపూరు, రుక్మాపూరు, రేగొండి గ్రామాల్లో సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వం అని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. ధరణి లోపాలను సరిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్‌, మండల పార్టీ అధ్యక్షుడు గోపాల్‌, మండల వైస్‌ ఎంపీపీ మధులత, మైపూస్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని