కాంగిరేసు అభ్యర్థులు వీరే
ఆసాంతం ఆసక్తిని కలిగిస్తూ సాగిన కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. అధిష్ఠానం ఆదివారం ప్రకటించిన తొలి జాబితాలో జిల్లాకు సంబంధించి ఒక్క తాండూరు మినహా కొడంగల్, పరిగి, వికారాబాద్ స్థానాలకు ముందునుంచి ఊహించినట్లుగానే అభ్యర్థుల ఎంపిక వెల్లడైంది.
ఆసాంతం ఆసక్తిని కలిగిస్తూ సాగిన కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. అధిష్ఠానం ఆదివారం ప్రకటించిన తొలి జాబితాలో జిల్లాకు సంబంధించి ఒక్క తాండూరు మినహా కొడంగల్, పరిగి, వికారాబాద్ స్థానాలకు ముందునుంచి ఊహించినట్లుగానే అభ్యర్థుల ఎంపిక వెల్లడైంది. దీంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపించింది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల రాజకీయ ప్రస్థానంపై ‘న్యూస్టుడే’ కథనం. - న్యూస్టుడే, కొడంగల్, పరిగి, వికారాబాద్.
కొండగల్ బరిలో రేవంత్రెడ్డి
ఎనుముల రేవెంత్రెడ్డి మొట్టమొదటిసారి 2009లో కొడంగల్ నుంచి తెదేపా అభ్యర్థిగా బరిలోకి దిగారు. ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి గురునాథ్రెడ్డిపై 6975 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2014లో తెదేపా నుంచి రేవంత్రెడ్డి, కాంగ్రెస్ నుంచి విఠల్రావు, తెరాస అభ్యర్తిగా గురునాథ్రెడ్డి నిలబడగా రేవంత్రెడ్డి 14614 ఓట్ల మెజార్టీతో గెలిచారు. దీంతో టీడీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంటుగా బాధ్యతలు చేపట్టారు. అదే హోదాలో 17 అక్టోబర్ 2017లో టీడీపీకి రాజీనామా చేశారు. 20 జూన్ 2018లో కాంగ్రెస్లో చేరి అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినా భారాస నుంచి పట్నం నరేందర్రెడ్డి చేతిలో 9,319 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. 7 జూన్ 2021లో టీపీసీసీ అధ్యక్షుడుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం కొడంగల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు.
తాండూరు ఎవరికో..
తాండూరు, తాండూరు గ్రామీణ: తాండూరు నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎవరు పోటీ చేస్తారనే విషయం తేలలేదు. అధిష్ఠానం ప్రకటించిన తొలి జాబితాలో తాండూరు అభ్యర్థి ఎవరనేది వెల్లడవుతుందని పార్టీ శ్రేణులు భావించాయి. తీరా జాబితాలో తాండూరు అభ్యర్థిని ప్రకటించక పోవడంతో సర్వత్రా రాజకీయ చర్చకు దారి తీసింది. తాండూరు అభ్యర్థిత్వం కోసం మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, డీసీసీబీ ఛైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి పోటీ పడుతున్నారు.
టీఆర్ఆర్కు వరుసగా మూడోసారి
పరిగి నియోజకవర్గం నుంచి తమ్మన్నగారి రామ్మోహన్రెడ్డి (టీఆర్ఆర్)కే కాంగ్రెస్ టికెట్ మూడోసారీ వరించింది. 2009లో పార్టీ టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా కొప్పుల హరీశ్వర్రెడ్డిపై పోటీ చేసి ఓటమిపాలయ్యారు. నిరాశ చెందక పార్టీకోసమే పనిచేస్తూ వచ్చారు. ఆయన సేవలను గుర్తించిన అధిష్ఠానం 2014 ఎన్నికల్లో మొదటిసారి టికెట్ ఇచ్చింది. హరీశ్వర్రెడ్డిపై 5000 పైచిలుకు పైగా ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.
2018 ఎన్నికల్లో హరీశ్వర్రెడ్డి తనయుడు కొప్పుల మహేష్రెడ్డికి, టీఆర్ఆర్కు మధ్య జరిగిన పోటీలో 16,400 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. 2020లో పార్టీ జిల్లా అధ్యక్షునిగా నియామకమయ్యారు. భారత్ జోడో యాత్ర లాజిస్టిక్ కమిటీ ఛైర్మన్గా కూడా వ్యవహరించారు. 2018లో రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా, 2014లో సీఎల్పీ కార్యదర్శిగా పనిచేశారు. ఇక ప్రచారంపై దృష్టి సారించనున్నారు.
అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు
వికారాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గడ్డం ప్రసాద్కుమార్ అధిష్ఠానం ఐదోసారి రంగంలోకి దించుతోంది. వికారాబాద్ నియోజకవర్గానికి 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో అనూహ్యంగా కాంగ్రెస్ టికెట్ దక్కించుకొని సమీప ప్రత్యర్థి, తెదేపా అభ్యర్థి సంజీవరావుపై 28 వేల పైచిలుకు మెజార్టీతో విజయం సాధించారు. 2009లో మరోమారు 4,700 ఓట్ల మెజార్టీతో సమీప ప్రత్యర్థి తెరాస అభ్యర్థి డాక్టర్ ఎ.చంద్రశేఖర్పై విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానంపై తిరుగుబాటు చేసి మంత్రి పదవి కోల్పోయిన శంకర్రావు స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన ప్రసాద్కుమార్ మంత్రివర్గంలో చేరి రాష్ట్ర చేనేత, జౌళి, లఘు పరిశ్రమల శాఖామంత్రిగా కొనసాగారు. 2014లో ముచ్చటగా మూడోసారి వికారాబాద్ కాంగ్రెస్ టికెట్ దక్కించుకొని పోటీ చేసి తెరాస అభ్యర్థి సంజీవరావు చేతిలో 10 వేల పైచిలుకు, 2018 ఎన్నికల్లో తెరాస అభ్యర్థి డాక్టర్ ఆనంద్ చేతిలో 3,526 ఓట్ల మెజార్టీతో పరాజితులయ్యారు. ప్రసాద్కుమార్ ఓటమి పాలైనా పల్లె పల్లెకు ప్రసాదన్న కార్యక్రమం పేరిట నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఐదోమారు బరిలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు
[ 29-04-2024]
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. ట్రాప్ కెమెరాలతో పాటు బోన్లను అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. -
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
[ 29-04-2024]
భారాసకు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్ కాంగ్రెస్లో చేరారు. -
బెట్టింగ్ భూతం.. దా‘రుణాలు’ అనంతం
[ 29-04-2024]
బెట్టింగ్ వ్యసనం ప్రాణాలు తీస్తోంది. అప్పులపాలై కొందరు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. ఇంకొందరు బరితెగించి చోరీలు, హత్యలు చేస్తున్నారు. -
కారు రూపురేఖలు మార్చి.. భయభ్రాంతులకు గురిచేస్తూ..
[ 29-04-2024]
రూపురేఖలు మార్చిన ఓ కారుతో రహదారులపై శబ్దాలు చేస్తూ తోటి వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
రాజాసింగ్.. రాస్తా అలగ్: ప్రచారానికి దూరంగా భాజపా ఎమ్మెల్యే
[ 29-04-2024]
ఆయన ఎవరి మాట వినరు.. ఆయన మాట పార్టీ వినదు. అందుకేనేమో ఆయన కొద్ది కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. -
అరచేతిలో ఏఐ..ప్రచారానికి సై
[ 29-04-2024]
మేము గెలిస్తే కూడళ్లను అభివృద్ధి చేస్తాం.. రహదారులను విస్తరిస్తాం.. గ్రామాలు, పట్టణాలను సుందరీకరిస్తాం.. ఎన్నికల ప్రచారంలో నేతలు ఇలా హామీలు ఇస్తుంటారు. -
ఎందుకీ నిర్లిప్తత.. ఓటేద్దాం పదపద
[ 29-04-2024]
ప్రతి ఎన్నికల్లో రాజధానిలో పోలింగ్ శాతం తగ్గుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రకరకాల కారణాలు ఇందుకు దోహదం చేస్తున్నా ఓటర్ల నిర్లిప్తత సైతం దీనికి తోడవుతోంది. -
ఎండలు సలసల.. మీటర్లు గిరగిరా
[ 29-04-2024]
నగరంలో విద్యుత్తు డిమాండ్ 4వేల మెగావాట్లను దాటింది. ఇందులో పావువంతు ఒక్క మేడ్చల్ జోన్ పరిధిలోనే ఉంటోంది. వెయ్యి మెగావాట్లకు ఈ జోన్ డిమాండ్ చేరువైంది. -
నీటి ట్యాంకర్లకు ట్రాకింగ్
[ 29-04-2024]
ఫుడ్ డెలివరీ యాప్స్లో ఏదైనా ఆర్డర్ చేసిన తర్వాత డెలివరీ బాయ్ ఎక్కడ ఉన్నాడు.. ఎన్ని నిమిషాల్లో మన ఇంటికి చేరుకుంటాడో ఇట్టే తెలుకోవచ్చు. -
అభ్యర్థుల తరపున అన్నీ తామై..
[ 29-04-2024]
చోటామోటా నాయకులు అని కొట్టి పారేయకండి.. ఎన్నికల వేళ వాళ్లే నేతలకు అండాదండా అవుతున్నారు. బూత్ స్థాయిలో ఎవరు ఎవరికి ఓటేస్తారో కచ్చితంగా చెప్పేయగలరు. -
ఓటు మన ప్రాథమిక హక్కు
[ 29-04-2024]
ఓటుని వినియోగించుకోవడం మన ప్రాథమిక హక్కని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవీదేవి అన్నారు. బంజారాహిల్స్లోని కేబీఆర్ ఉద్యానవనం వద్ద ఆదివారం ఉదయం -
ఓట్ల పండగకు దూరంగా ఉంటే ఎలా?
[ 29-04-2024]
చట్టసభలకు ప్రాతినిథ్యం వహించే ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న Ëపోలింగ్ ప్రక్రియలో మేధావులు, విద్యావేత్తలు, యువకులు, విద్యార్థులు సరిగా పాల్గోవడం లేదు. -
ఓటు సమ్మేళనాలు
[ 29-04-2024]
ఎన్నికల్లో గెలవాలంటే అన్ని వర్గాల ఓటర్లను ప్రసన్నంచేసుకోవాలి. శాసనసభ ఎన్నికల్లో ఇంటింటి ప్రచారం చేస్తారు. అదే లోక్సభ ఎన్నికల్లో.. -
ఫలితాల్లో.. పత్తాలేని కొత్త పార్టీలు
[ 29-04-2024]
ప్రధాన పార్టీలు మినహాయిస్తే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వేర్వేరు పార్టీల అభ్యర్థులు కనీస పోటీ ఇవ్వడం లేదు. 1శాతం ఓట్లను పొందలేక చతికిలపడుతున్నారు. -
అంకురాల ప్రోత్సాహానికి స్టార్టప్ మిక్సర్
[ 29-04-2024]
అంకుర సంస్థలు ప్రారంభించాలన్న ఆలోచన ఉన్నా మనసును తొలిచే మొదటి ప్రశ్న పెట్టుబడి ఎలా? ఆ తర్వాత మార్కెటింగ్, బ్రాండింగ్ పెంచుకోవడం, -
పుడమికి బలం.. జగతికి జీవాధారం
[ 29-04-2024]
తాగునీటి ఎద్దడి నివారణకు, భూగర్భ జలాల పెంపుదలకు ‘ఇంకుడు గుంతలకు’ మించిన చక్కటి మార్గం మరొకటి లేదు. -
రసవత్తరం..చేవెళ్ల పోరు
[ 29-04-2024]
చేవెళ్ల లోక్సభ ఎన్నికలు ప్రతిసారీ రసవత్తరంగా సాగుతాయి. ముఖ్యంగా మూడు ప్రధాన పార్టీల మధ్య మాత్రమే పోటీ నెలకొంటుంది. -
ఓటు.. ఐదు రూపాలు
[ 29-04-2024]
ఓటు హక్కు ఉన్న ప్రతి వ్యక్తి ఓటును నేరుగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి వేస్తారు. అయితే ఓటును ఐదు విధాలుగా వినియోగించుకునే అవకాశం భారత ఎన్నికల సంఘం కల్పించింది. -
పోలీసుల అదుపులో ద్విచక్ర వాహనాల దొంగ
[ 29-04-2024]
తాండూరు పట్టణంలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. -
వివాహిత ఆత్మహత్యాయత్నం.. కాపాడిన కానిస్టేబుల్
[ 29-04-2024]
వివాహం జరిగి ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టడం లేదని మనస్తాపానికి గురైన ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. హుస్సేన్సాగర్లో దూకేందుకు ప్రయత్నించగా కానిస్టేబుల్, మరికొందరు -
వేసవిలో నగరానికి అదనపు జలాలు
[ 29-04-2024]
గ్రేటర్ వ్యాప్తంగా ఎక్కడా తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు జలమండలి తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో నీటి సరఫరాకు డిమాండ్ పెరిగిందని.. -
క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పేరిట మోసం
[ 29-04-2024]
క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పేరిట నలుగురి నుంచి రూ.65,36,590 మేర కొల్లగొట్టిన వ్యక్తిపై కేసు నమోదైంది. ఎస్సార్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇజ్రాయెల్ అధికారుల్లో.. ‘ఐసీసీ’ అరెస్టు వారెంట్ల గుబులు!
-
బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?
-
ఏటీఎం చోరీకి యత్నం.. షార్ట్ సర్క్యూట్తో నగదు దగ్ధం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
యూపీఐ వచ్చినా క్యాషే కింగ్.. పెరిగిన ఏటీఎం విత్డ్రాలు!
-
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు