logo

Hyderabad: క్రికెట్‌ ఆడుతుండగా గుండెపోటు.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కాశిరెడ్డి సంజయ్‌ భార్గవ్‌(24).. క్రికెట్‌ ఆడుతుండగా గుండెపోటుతో మృతి చెందాడు. మహేశ్వరం ఎస్సై వెంకట్రెడ్డి కథనం ప్రకారం.. విశాఖ జిల్లా పెద్దగంట్యాడ మండలం మీంది గ్రామానికి చెందిన కాశిరెడ్డి సంజయ్‌ భార్గవ్‌.. గచ్చిబౌలిలోని గౌలిదొడ్డి వద్ద ప్రైవేటు హాస్టల్‌లో ఉంటూ టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు.

Updated : 04 Mar 2024 07:51 IST

మహేశ్వరం, న్యూస్‌టుడే: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కాశిరెడ్డి సంజయ్‌ భార్గవ్‌(24).. క్రికెట్‌ ఆడుతుండగా గుండెపోటుతో మృతి చెందాడు. మహేశ్వరం ఎస్సై వెంకట్రెడ్డి కథనం ప్రకారం.. విశాఖ జిల్లా పెద్దగంట్యాడ మండలం మీంది గ్రామానికి చెందిన కాశిరెడ్డి సంజయ్‌ భార్గవ్‌.. గచ్చిబౌలిలోని గౌలిదొడ్డి వద్ద ప్రైవేటు హాస్టల్‌లో ఉంటూ టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. ఘట్టుపల్లిలోని కేసీఆర్‌ క్రికెట్‌ స్టేడియంలో వారాంతంలో స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతుంటాడు. శనివారం ఉదయం 11.30 గంటలకు గచ్చిబౌలి నుంచి దిలీప్‌, బాలప్రదీప్‌, అజయ్‌, తేజకిరణ్‌, ఆదిత్య, స్నేహితులతో కలిసి సంజయ్‌ భార్గవ్‌ స్టేడియానికి వచ్చాడు. క్రికెట్‌ ఆడుతుండగా మధ్యాహ్నం 3 గంటల సమయంలో తలనొప్పిగా ఉందని ఆట మధ్యలో పక్కకు వచ్చి కూర్చొన్న కొద్దిసేపటికే అక్కడే కుప్పకూలి పోయాడు. వెంటనే ఫిట్స్‌ రావడంతో ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి.. అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు తేల్చారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని