అమెరికా ఆర్మీ అధికారినంటూ రూ.23 లక్షలు స్వాహా
అమెరికా ఆర్మీలో మహిళా అధికారినంటూ నమ్మించి 80 ఏళ్ల విశ్రాంత శాస్త్రవేత్తనుంచి సైబర్ నేరగాళ్లు రూ.23.59 లక్షలు కాజేశారు. తనవద్ద ఉన్న డాలర్లను భద్రపరిస్తే కమీషన్ ఇస్తానని చెప్పిన ఆమె..
ఈనాడు- హైదరాబాద్: అమెరికా ఆర్మీలో మహిళా అధికారినంటూ నమ్మించి 80 ఏళ్ల విశ్రాంత శాస్త్రవేత్తనుంచి సైబర్ నేరగాళ్లు రూ.23.59 లక్షలు కాజేశారు. తనవద్ద ఉన్న డాలర్లను భద్రపరిస్తే కమీషన్ ఇస్తానని చెప్పిన ఆమె.. తర్వాత దిల్లీ కస్టమ్స్ విభాగంలో సుంకం చెల్లించాలంటూ ఆయన నుంచి సొమ్ము కొట్టేశారు. సోమవారం బాధితుడి ఫిర్యాదుతో నగర సైబర్క్రైమ్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. నగరానికి చెందిన విశ్రాంత శాస్త్రవేత్తకు ఇటీవల వాట్సాప్కాల్ వచ్చింది. తనపేరు మిక్ బ్రౌన్ అని, అమెరికా ఆర్మీలో పనిచేస్తున్నట్లు పరిచయం చేసుకుంది. ఐరాస శాంతిదళం మిషన్లో భాగంగా సిరియాలో పనిచేస్తున్నానని, ఇటీవల కొందరు విప్లవకారులు భారీగా అమెరికా డాలర్లు పోగొట్టుకున్నారని, అవి తనకు దొరికాయని చెప్పింది. ఈ డబ్బును భద్రపరిస్తే మూడో వంతు కమీషన్ లెక్కన ఇస్తానని చెప్పింది. శాస్త్రవేత్త అంగీకరించారు. రెండ్రోజుల తర్వాత ఆయనకి మరో ఫోన్ వచ్చింది. తాను దిల్లీ కస్టమ్స్ అధికారుల వద్ద ఉన్నానని, డబ్బు విడుదలకావాలంటే కస్టమ్స్ సుంకం రూ.23.59 లక్షలు కట్టాలంది. నమ్మిన శాస్త్రవేత్త ఆమె చెప్పిన ఖాతాకు నగదు బదిలీచేశారు. తర్వాత ఆమె నుంచి స్పందన లేకపోవడంతో ఇదంతా మోసమని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదుచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓయూలో నీటి సెగలు.. విద్యుత్తు వెతలు
[ 30-04-2024]
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నీటికొరత సెగలు.. విద్యుత్తు కోతల వెతలతో సోమవారం ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. -
ఈత కొలనులో అవినీతి మేత
[ 30-04-2024]
ప్రజాధనాన్ని ప్రణాళికాబద్ధంగా దోచేయడంలో జీహెచ్ఎంసీలోని కొందరు అధికారులు సిద్ధహస్తులు. ఒకే ప్రణాళికను కొన్నేళ్లుగా అమలు చేస్తూ.. ఏటా రూ.3 కోట్లకు పైగా నిధులను దోచేస్తున్నారు. -
కొత్త పంథాలో రాజకీయ దావత్లు!
[ 30-04-2024]
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో తలమునకలవుతున్నాయి. ఆయా పార్టీల నేతలు, అభ్యర్థులు ఎవరికి వారు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. -
మల్కాజిగిరి ఎంపీగా రేవంత్రెడ్డి చేసిందేమీ లేదు
[ 30-04-2024]
రేవంత్రెడ్డిని ఎంపీగా చేసింది, టీపీసీసీ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చింది, చివరికి ముఖ్యమంత్రిని చేసింది సైతం మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలే అనీ.. అలాంటి నియోజకవర్గ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఏం చేశారో చెప్పాలని మాజీమంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. -
ఇక సమరమే..!
[ 30-04-2024]
చేవెళ్ల లోక్సభ ఎన్నికలకు బరిలో దిగే అభ్యర్థుల లెక్క తేలింది. సోమవారం ఉపసంహరణల అంకం ముగియడంతో ఇక ప్రచారం హోరెత్తించేందుకు వారంతా వ్యూహాలకు పదునెక్కించే పనిలో పడ్డారు. -
మోదీకి దివ్యాంగులు అండగా నిలవాలి
[ 30-04-2024]
కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం పదేళ్ల వ్యవధిలో దివ్యాంగులకు అన్నిరకాలుగా చేయూతనందించిందని, ఈ నేపథ్యంలో వారంతా మరోసారి భాజపాకు అండగా నిలవాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కోరారు. -
దేశం భాజపానే కోరుకుంటోంది: విశ్వేశ్వర్రెడ్డి
[ 30-04-2024]
చేవెళ్ల భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. పరిగి, కుల్కచర్ల, పూడూరు మండలాలతోపాటు వికారాబాద్లో జరిగిన వివిధ సభల్లో ఆయన పాల్గొన్నారు. -
ఓటరు సౌలభ్యతే లక్ష్యం
[ 30-04-2024]
లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, ఉపసంహరణ కొలిక్కి వచ్చాయి. ఒక అంకం పూర్తి కావటంతో అధికార యంత్రాంగం సజావుగా ఎన్నికల నిర్వహణ సాగేందుకు అన్ని విధాలా సమాయత్తమవుతోంది. -
ఖర్చు చేసే ప్రతి రూపాయి అభ్యర్థుల ఖాతాలో వేస్తాం
[ 30-04-2024]
ఎన్నికలలో అభ్యర్థుల తరఫున ప్రచారానికి ఖర్చు చేసే ప్రతిరూపాయిని లెక్కిస్తామని, వ్యయం విషయంలో అభ్యర్థులు జాగ్రత్తగా వ్యవహరించాలని చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ శశాంక సూచించారు. -
పతుల విజయానికి సతుల పిలుపు
[ 30-04-2024]
కాంగ్రెస్ పార్టీతోనే పేదల సంక్షేమం సాధ్యమని చేవెళ్ల లోక్సభ అభ్యర్థి రంజిత్రెడ్డి సతీమణి సంగీతారెడ్డి, ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి భార్య ఉమారెడ్డి, టీఆర్ఆర్ అన్నారు. -
అమ్మను పిలిచి.. మృత్యుంజయుడై..
[ 30-04-2024]
అపార్ట్మెంట్ పార్కింగ్ స్థలంలో ఆడుకుంటున్న జంపన ఉజ్వల్ కుమార్(4) హఠాత్తుగా ‘అమ్మా’ అని కేక వేశాడు. పెద్దగా అరవటంతో కంగారుపడిన తల్లి బయటికి వచ్చింది. -
కవల పిల్లలకు జన్మనిచ్చి బాలింత మృతి
[ 30-04-2024]
ఆస్పత్రిలో కవల పిల్లలకు జన్మనిచ్చిన మహిళ గుండె సంబంధిత వ్యాధితో మరణించిన సంఘటన బోరబండ ఠాణా పరిధిలో జరిగింది. -
విద్యుత్తుకు రికార్డు డిమాండ్
[ 30-04-2024]
గ్రేటర్లో విద్యుత్తు డిమాండ్ రికార్డు స్థాయిలో నమోదవుతోంది. 42-43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో కరెంట్ వాడకం విపరీతంగా పెరిగింది. సోమవారం గరిష్ఠ డిమాండ్ 4133 మెగావాట్లకు చేరింది. -
తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారాల ప్రకటన
[ 30-04-2024]
తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో ఉత్తమ గ్రంథాలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2022 ఏడాదికిగాను సాహితీ పురస్కారాలను ప్రకటించింది. -
ప్లాట్ల అభివృద్ధి పేరుతో మోసం
[ 30-04-2024]
ఫోర్జరీ, నకిలీ పత్రాలతో రియల్టర్ను మోసగించి రూ.3.13 కోట్లు వసూలు చేసిన ముగ్గురిని సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు అరెస్టు చేశారు. -
గుజరాతీ.. సందడి మస్తీ
[ 30-04-2024]
అయిదు నెలలుగా రాష్ట్రంలో అట్టహాసంగా సాగిన గుజరాతీ ఏక్తా మహోత్సవ్ ఘనంగా ముగిసింది. శంషాబాద్ మున్సిపల్ పరిధి సాతంరాయిలోని ఓ ఫంక్షన్ హాల్లో సోమవారం రాత్రి నిర్వహించిన మిస్ గుజరాతీ, తెలంగాణ-2024 పోటీలు అలరించాయి. -
రాష్ట్రంలో రెండంకెల స్థానాల్లో గెలుస్తాం: భాజపా
[ 30-04-2024]
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో భాజపా రెండంకెల స్థానాలు కైవసం చేసుకుంటుందని రాష్ట్ర ఎన్నికల కమిటీ ప్రముఖ్, గీతామూర్తి పేర్కొన్నారు. -
మోదీ హయాంలో ముస్లింలను అనుమానిస్తున్నారు
[ 30-04-2024]
దేశంలో నేడు ముస్లింలను అనుమానపు దృష్టితో చూస్తున్నారని, అలాంటి పరిస్థితిని ప్రధాని మోదీ తీసుకొచ్చారని మజ్లిస్ హైదరాబాద్ అభ్యర్థి, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!