logo

నరేంద్రమోదీ నాయకత్వానికి అండగా నిలవాలి: కిషన్‌రెడ్డి

భారత్‌ కీర్తిప్రతిష్ఠలను ప్రపంచానికి చాటిచెప్పిన నరేంద్రమోదీ నాయకత్వానికి ఈ దఫా ఎన్నికల్లోనూ ప్రజలు అండగా నిలవాలని కేంద్ర మంత్రి, భాజపా సికింద్రాబాద్‌ అభ్యర్థి కిషన్‌రెడ్డి కోరారు.

Updated : 10 May 2024 05:44 IST

ప్రజలకు అభివాదం చేస్తున్న కిషన్‌రెడ్డి. చిత్రంలో ఎన్‌.గౌతంరావు, కృష్ణాయాదవ్‌, కె.ఉమారాణి తదితరులు

బర్కత్‌పుర, నల్లకుంట, విద్యానగర్‌: భారత్‌ కీర్తిప్రతిష్ఠలను ప్రపంచానికి చాటిచెప్పిన నరేంద్రమోదీ నాయకత్వానికి ఈ దఫా ఎన్నికల్లోనూ ప్రజలు అండగా నిలవాలని కేంద్ర మంత్రి, భాజపా సికింద్రాబాద్‌ అభ్యర్థి కిషన్‌రెడ్డి కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం బర్కత్‌పుర లింగంపల్లిలోని రాఘవేంద్రస్వామి ఆలయం నుంచి  బైక్‌ ర్యాలీ చేపట్టారు. బర్కత్‌పుర చమన్‌, రత్నానగర్‌, ఫీవర్‌ ఆసుపత్రి చౌరస్తా, తిలక్‌నగర్‌ కూడలి ప్రాంతాల మీదుగా కొనసాగింది. ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్‌, భారాస నేతల గిమ్మిక్కులను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. పుదుచ్చేరి ఎమ్మెల్యే జాన్‌కుమార్‌, భాజపా హైదరాబాద్‌ సెంట్రల్‌ జిల్లా అధ్యక్షుడు గౌతంరావు, మాజీ మంత్రి సి.కృష్ణాయాదవ్‌, కార్పొరేటర్లు కె.ఉమారాణి, వై.అమృత,  ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జి.ఆనంద్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని