పెరుగుతున్న పసిడి ధరలు... తగ్గుతున్న వ్యాపారం
బంగారం ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకి వెళుతున్నాయి. గతంలో పెళ్లి ముహూర్తాల సమయంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టేవి. దీనికి భిన్నంగా మార్కెట్లో ప్రస్తుతం పసిడి ధర పది గ్రాములు(తులం) రూ.76,000 వరకు పలుకుతోంది.
న్యూస్టుడే, జ్యోతినగర్(మార్కండేయకాలనీ): బంగారం ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకి వెళుతున్నాయి. గతంలో పెళ్లి ముహూర్తాల సమయంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టేవి. దీనికి భిన్నంగా మార్కెట్లో ప్రస్తుతం పసిడి ధర పది గ్రాములు(తులం) రూ.76,000 వరకు పలుకుతోంది. రోజురోజుకీ ధరల్లో హెచ్చుతగ్గులు ఉండటంతో కొనుగోలుదారులు, విక్రయదారులు, ఆభరణాలు చేసే స్వర్ణకారులు ఆందోళన చెందుతున్నారు. ఈనెల 26వ తేదీ వరకే శుభ ముహూర్తాలున్నాయని పండితులు చెబుతున్నారు. ప్రస్తుతం పెరుగుతున్న బంగారం ధరల కారణంగా శుభకార్యాలు నిర్వహించే వారు ఆలోచించాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. నూతన వధూవరుల కోసం బంగారు ఆభరాణాలు తయారు చేయించే విషయంలో తమ ఆర్థిక అంచనాలు తలకిందులవుతున్నాయని పలువురు వాపోతున్నారు.
కొనాలంటే.. భయపడుతున్నారు
మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కుటుంబాల వారి ఇంట్లో ప్రస్తుతం పెళ్లి సంబంధం కుదిరితే బంగారం కొనుగోలు విషయంలో భయపడుతున్నారు. పెరిగిన ధరల కారణంగా పుస్తె, మెట్టెలు కొనాలన్నా సుమారు రూ.40 వేలు అవుతుంది. ఆభరణాలు చేయించాలంటే రూ.లక్షకు పైగా ఖర్చు చేయాల్సిందే. కొంత మంది ధర తగ్గితే బంగారం కొనుగోలు చేద్దామని నెల రోజులుగా ఎదురుచూస్తున్నారు. రోజురోజుకీ ధర పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. భవిష్యత్తులో బంగారం కొనగలమా అనే సందేహం కొనుగోలు దారులు, స్వర్ణకారుల్లో నెలకొంటోంది.
కజాంపురం రాకేష్, బంగారం వ్యాపారి
రానున్న రోజుల్లో ఇబ్బందులు
పసిడి ధరల్లో అనూహ్య పెరుగుదల వల్ల కొనుగోలుదారులతో పాటు స్వర్ణకారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గత ఏడాది పది గ్రాముల బంగారం ధర రూ.62 వేలు ఉంటే ప్రస్తుతం రూ.76 వేల పైచిలుకు చేరింది. గత ఏడాది పెళ్లిళ్ల సీజన్లో రోజుకు ఐదు తులాల విక్రయాలు చేశాం. ఈసారి రోజుకు తులం కూడా విక్రయించడం గగనంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వర్ణకారులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలి. ధరలు ఇలాగే పెరిగితే రానున్న రోజుల్లో ఇబ్బందులు తప్పవు.
గుగ్గిళ్ల రవీంద్రచారి, జ్యువెల్లర్స్ బులియన్ మర్చంట్, రామగుండం అధ్యక్షుడు
అంతర్జాతీయ పరిణామాలతో..
అంతర్జాతీయ అనిశ్చితి కారణంగా పుత్తడి ధరలు పెరుగుతున్నాయి. పేద, మధ్యతరగతి వర్గాలకు అందనంత దూరం వెళ్తోంది. చాలామంది శుభ కార్యాలకు బంగారం తప్పనిసరిగా కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుత ధరల నేపథ్యంలో తక్కువ పరిమాణంలో ఆభరణాలు కొంటున్నారు. సీజన్లో ఈ ప్రాంతం మార్కెట్లో గతేడాది నిత్యం 20 కిలోల బంగారం అమ్మకాలు జరిగేవి. ప్రస్తుతం 10-12 కిలోలు కూడా విక్రయించడం లేదు. కొనుగోలు, అమ్మకందారులపై తీవ్ర ప్రభావం పడుతోంది.
శ్రీనివాస్, స్వర్ణకార సంఘం జిల్లా అధ్యక్షుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోస్టల్ ఓట్లు..అభ్యర్థుల పాట్లు
[ 03-05-2024]
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కోసం అభ్యర్థులు పాట్లు పడుతున్నారు. ఓ వైపు సాధారణ ఓటర్ల మద్దతును కూడగట్టేందుకు ప్రచారాన్ని సాగిస్తూనే ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులపై దృష్టి పెట్టారు. -
ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి మూడు ఏసీలు
[ 03-05-2024]
కరీంనగర్ మాతా, శిశు ఆసుపత్రిలో రూ.1.50 లక్షల విలువ చేసే మూడు ఏసీలను ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగుల ఇబ్బందులపై ఏప్రిల్ 20న ‘ఉక్కపోతతో తల్లీ బిడ్డల ఉక్కిరిబిక్కిరి’, -
ఓటు ఘనం.. పోటీ నామమాత్రం
[ 03-05-2024]
చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాల్సిన సమయంలో ఎన్నికల్లో పోటీ చేసే నారీమణుల సంఖ్య తగ్గుతోంది. -
యువశక్తి కీలకం.. ఉపాధితోనే ప్రోత్సాహం
[ 03-05-2024]
నిజామాబాద్ లోక్సభా స్థానం పరిధిలో 2011 లెక్కల ప్రకారం మొత్తం జనాభా 19 లక్షలు కాగా తాజాగా వెల్లడైన ఓటరు జాబితా ప్రకారం 18 ఏళ్ల నుంచి 41 ఏళ్ల వయసు యువత 8.39 లక్షల మంది ఉన్నారు. -
వేములవాడ ఆలయ హుండీ ఆదాయం రూ. 1.52 కోట్లు
[ 03-05-2024]
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ హుండీని గురువారం లెక్కించారు. -
రైతుల చెంతకు రాజన్న కోడెలు
[ 03-05-2024]
దక్షిణకాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామికి భక్తులు సమర్పించే కోడెలను అర్హులైన రైతులకు ఉచితంగా అందించేందుకు ఆలయ అధికారులు కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. -
చోరీ కేసు నిందితుడి అరెస్టు
[ 03-05-2024]
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం అప్పారావుపేట గ్రామంలో ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన కేసులో ఒకరిని అరెస్టు చేసినట్లు సీఐ నీలం రవి తెలిపారు. -
సీఎం సభకు విస్తృత ఏర్పాట్లు
[ 03-05-2024]
ఎండపల్లి మండల పరిధిలోని రాజారాంపల్లిలో శుక్రవారం నిర్వహిస్తున్న సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల ప్రచార సభ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. -
రాజీ మార్గమే రాజ మార్గం
[ 03-05-2024]
రాజీ మార్గమే రాజ మార్గమని సీనియర్ సివిల్ జడ్జి కె.ప్రసాద్ అన్నారు. జగిత్యాల కోర్టులో 43 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆస్తి వివాదానికి గురువారం రాజీ మార్గం ద్వారా పరిష్కారం లభించింది. -
స్థిరాస్తి వ్యాపారి బరితెగింపు
[ 03-05-2024]
వేములవాడ - సిరిసిల్ల ప్రధాన రహదారిలో నిత్యం జిల్లా స్థాయి అధికారులు రాకపోకలు సాగిస్తుంటారు. వేములవాడ నందికమాన్ కూడలికి సమీపంలో రహదారి వెంబడి స్థలంతో పాటు చెట్లను ఆక్రమించినప్పటికీ అధికారులు కన్నెత్తి చూడకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
భాజపాతోనే పల్లెలు, పట్టణాల్లో ప్రగతి
[ 03-05-2024]
భాజపా పాలనలో పల్లెలు, పట్టణాలు ప్రగతి పథంలో దూసుకుపోతున్నాయని భాజపా ఎంపీ అభ్యర్థి గోమాసె శ్రీనివాస్ పేర్కొన్నారు. -
రామగిరిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం
[ 03-05-2024]
రామగిరి ఖిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
కార్మికుల కోసం ఏం చేశానో తెలుసుకోండి
[ 03-05-2024]
కార్మికుల కోసం నేను ఏంచేశానో ఒక్కసారి తెలుసుకోవాలని... మాజీ మంత్రి, భారాస ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. -
ఒకే రోజు రెండు చోట్ల ఎన్నికల విధులా..!
[ 03-05-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ ఈనెల 13న జరగనుంది. ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు ఇప్పటికే ఉద్యోగులను గుర్తించి విధులు కేటాయించారు. -
లైట్లు లేవు... ఏసీలు పనిచేయవు
[ 03-05-2024]
జగిత్యాల జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్లలో కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.