నిర్వహణ భారం.. కమీషన్లో కోత
కేంద్రాల నిర్వహణ భారంగా మారగా.. వచ్చిన కమీషన్లో కోత విధించడంతో నిర్వాహకులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి.
అవస్థల మధ్య ధాన్యం సేకరణ
న్యూస్టుడే, సారంగాపూర్
ధాన్యం సేకరణలో నిర్వాహకులు
కేంద్రాల నిర్వహణ భారంగా మారగా.. వచ్చిన కమీషన్లో కోత విధించడంతో నిర్వాహకులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. పదేశ్లుగా అందించే కమీషన్ ఇప్పటికీ అదే కొనసాగిస్తుండడం, ప్రతి సీజన్లో కొనుగోలు కేంద్రాల నిర్వహణ వ్యయం పెరుగుతున్నప్పటికీ అందుకు అనుగుణంగా కమీషన్ సకాలంలో విడుదల కాకపోవడంతో సమస్య తలెత్తుతోంది. గత రెండు సీజన్ల కమీషన్ ఇటీవల విడుదల చేసినప్పటికీ మంజూరైన వాటిలో కేవలం 70శాతం మాత్రమే సహకార, సెర్ప్కు జమ చేయడంతో నష్టాలు రానున్నాయని నిర్వాహకులు వాపోతున్నారు. ధాన్యం సేకరణలో రాష్ట్రంలోనే జిల్లా ఆదర్శంగా నిలుస్తున్నప్పటికీ నిర్వహణ వ్యయం సంఘాలపై పడుతోంది.
జిల్లా వ్యాప్తంగా గత యాసంగిలో(2022-23) 144 కొనుగోలు కేంద్రాల ద్వారా 12,56,923 క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరించగా కమీషన్ రూ.4.04 కోట్లు రావాల్సి ఉండగా రూ.2.80 కోట్లు, ఖరీఫ్(2022-23)లో 133 కొనుగోలు కేంద్రాల ద్వారా 11,61,872 క్వింటాళ్ల ధాన్యానికి రూ.3.66 కోట్లకు గానూ రూ.2.56కోట్లు మాత్రమే సెర్ప్కు జమ చేస్తున్నారు. సహకార సంఘాల ఆధ్వర్యంలో 275 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా 26,18,566 క్వింటాళ్లు, యాసంగిలో 270 కొనుగోలు కేంద్రాల ద్వారా 29,49,347 క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరించారు. రెండు పంటలకు గాను సెర్ప్, సహకార సంఘాలకు దాదాపు రూ.25.57 కోట్ల కమీషన్ రావాల్సి ఉంది. ఇందులో కేవలం 70 శాతం ఆయా సంఘాలకు జమ చేస్తున్నారు. అలాగే 2023-24 ఖరీఫ్లో సహకార, సెర్ప్ ద్వారా 3,73,575 క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరించగా దీనికి సంబంధించి దాదాపు రూ.8 కోట్ల మేర కమీషన్ విడుదల కావాల్సి ఉంది.
ఆరకొర కమీషన్తో నెట్టుకొస్తున్న సంఘాలకు గన్నీ సంచుల భారం మీద పడుతోంది. కేంద్రానికి అందించిన గన్ని సంచులు తిరిగి పూర్తిగా అందించాల్సి ఉంటుంది. అయితే మిల్లర్ల ద్వారా అందించే పాత గన్నీ సంచులు పూర్తిగా చెడిపోయినవి రావడమే కాకుండా సంచులు తక్కువగా ఉండడంతో సంఘాలు భరించాల్సిన పరిస్థితి. ఒక్క సారంగాపూర్ సహకార సంఘం పరిధిలో 60వేల సంచుల భారం పడగా జిల్లా వ్యాప్తంగా లక్షల్లో ఉంటుంది. అదే విధంగా సేకరించే ధాన్యానికి క్వింటాలుకు రూ.32 చొప్పున కమీషన్ చెల్లిస్తున్నారు. అయితే ఇందులో రూ.13 మాత్రమే నిర్వహణకు వ్యయం చేయాల్సి ఉంటుంది. ఇందులో 5వేల క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరిస్తే రూ.లక్ష నుంచి రూ.1.20 లక్షల వరకు వ్యయం చేస్తుంటే కేవలం రూ.60వేలు మాత్రమే చెల్లించేందుకు అనుమతి ఉంది. ఇందులో మహిళల రోజువారీ కూలీ కనీసం రూ.33 వేలు, ట్యాబ్, రికార్డుల అపరేటర్ల వేతనాల కోసం రూ.25వేలు, వాచ్మెన్ కోసం రూ.8వేలు, అంతేకాకుండా సుతిలీ, ఇతరత్రా రూ.15 నుంచి రూ.20వేల వరకు అదనంగా ఉంటున్నాయి. తక్కువ మొత్తంలోనే వ్యయం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయడంతో నిర్వహణ ఖర్చు సరిపోవడం లేదు. దీనికి తోడు వచ్చిన కమీషన్లో 30 శాతం కోత విధించడంతో నిర్వహణ భారంగా మారిందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సంఘాల్లో జమవుతున్నాయి
- మల్లేశం, డీపీఎం
రెండు పంటలకు సంబంధించిన కమీషన్ ఇటీవల విడుదల కావడంతో ఆయా సంఘాలలో జమ చేస్తున్నారు. ఇందులో ప్రస్తుతం ఆయా సంఘాలకు 70 శాతం మేర జమవుతున్నాయి. ఖరీఫ్ పంట కమీషన్ రావాల్సి ఉంది. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యాన్ని సేకరిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దారి పొడవునా గులాబీ దండు!
[ 06-05-2024]
భారాస అధినేత బస్సు యాత్రతో గులాబీ దండులో జోష్ నెలకొంది. కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో కొనసాగిన యాత్రకు అపూర్వ స్పందన లభించింది. -
ఆటలు ఆడుకోవాలని ఉంది!
[ 06-05-2024]
‘వేసవి సెలవుల్లో ఆడుకోవాలని తహతహలాడాం. మా తల్లిదండ్రుల అనుమతి కూడా తీసుకున్నాం. కరీంనగర్ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఏటా అంబేడ్కర్ స్టేడియంలో ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను అట్టహాసంగా నిర్వహించేవారు. -
హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ మోసం
[ 06-05-2024]
శాసనసభ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పార్లమెంటు ఎన్నికల్లో మరోసారి ప్రజలను మోసగించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ ముందుకు వస్తున్నారని భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇష్టం లేదా?
[ 06-05-2024]
కరీంనగర్ ఎంపీలుగా బోయినపల్లి వినోద్కుమార్, బండి సంజయ్లు నియోజకవర్గానికి చేసిందేమి లేదని, -
ప్రశాంత ఎన్నికలే లక్ష్యంగా.. నిరంతర నిగా
[ 06-05-2024]
స్వేచ్ఛాయుత, సమర్థవంత ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం సాంకేతిక విధానాన్ని అమలు చేస్తోంది. ఎలాంటి ఘర్షణలు, అల్లర్లకు తావు లేకుండా ప్రశాంత వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. -
క్షేమంగా వెళ్లి వారంలోపే రండి!
[ 06-05-2024]
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలకు మరో వారం రోజులే ఉంది. ఈ నెల 13న పోలింగ్ నిర్వహణకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. -
అస్త్రం సంధించి.. ఆదర్శంగా నిలిచి..
[ 06-05-2024]
ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత శక్తిమంతమైన ఓటు అస్త్రాన్ని సంధించడంలో పల్లెలు ముందు వరుసలో నిలుస్తున్నాయి. -
నిజామాబాద్లోనే పసుపు బోర్డు..
[ 06-05-2024]
కేంద్రం పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిందని.. ఎంపీ ధర్మపురి అర్వింద్ కృషి వల్లే ఇది సాధ్యమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఏళ్లుగా ఇక్కడి రైతుల డిమాండ్గా ఉన్న బోర్డును సాధించటం కోసం మోదీ వెంటపడి సాధించారన్నారు. -
భాజపాకు బుద్ధి చెప్పాలి
[ 06-05-2024]
శాసనసభ ఎన్నికల్లో భారాసను ఓడించినట్లే పార్లమెంట్ ఎన్నికల్లో భాజపాకు బుద్ధి చెప్పాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. -
ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన
[ 06-05-2024]
కోరుట్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఓ వ్యక్తి మృతి చెందాడంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టి, ఆసుపత్రి ఫర్నిచర్ ధ్వంసం చేయడంతోపాటు వైద్యుడు, సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. -
జిల్లాల పునర్విభజన నిర్ణయాన్ని మానుకోవాలి
[ 06-05-2024]
జిల్లాల పునర్విభజన నిర్ణయాన్ని ప్రభుత్వం మానుకోవాలని జిల్లా పరిరక్షణ కమిటీ నాయకుడు బొల్లి రామ్మోహన్ కోరారు. -
చిన్నబోయిన బొంకూర్
[ 06-05-2024]
వారంతా రోజూవారీ వ్యవసాయ కూలీలు.. రెక్కాడితేనే కుటుంబం గడిచే పరిస్థితి.. ఎప్పటిలాగే కూలీకి వెళ్లి శ్రమించారు. పనులు పూర్తి చేసుకొని చిరునవ్వులతో ఇళ్లకు తిరుగుపయనమయ్యారు. -
పురలో మారిన ముఖచిత్రం
[ 06-05-2024]
గడిచిన నాలుగేళ్ల జగిత్యాల పురపాలనలో వివిధ పార్టీల కౌన్సిలర్ల బలాబలాలు మారిపోయాయి. అధ్యక్ష పీఠంలో అనూహ్య మార్పులు, పాలకవర్గం కూర్పులో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ నేతలకు సవాల్గా మారాయి. -
పెళ్లి కాలేదని యువకుడి ఆత్మహత్య
[ 06-05-2024]
మండలంలోని కోర్కల్కు చెందిన పూదరి కుమార్(38) పెళ్లి కాదేమోననే బెంగతో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు వీణవంక ఎస్ఐ తిరుపతి తెలిపారు. -
అగ్నిగుండం
[ 06-05-2024]
ఈ వేసవి సీజన్లో తొలిసారిగా ఆదివారం జగిత్యాల జిల్లాలోని వెల్గటూరులో 47.1 డిగ్రీల సెల్సియస్ రాష్ట్ర స్థాయి అత్యధిక గరిష్ఠ పగటి ఉష్ణోగ్రత నమోదైంది.