అడుగడుగునా అడ్డంకులే..
సీతారామ ప్రధాన కాలువ నీటిని వైరా జలాశయానికి అనుసంధానం చేసే కాలువ పనులకు అడగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి.
కదలని అనుసంధానం పనులు
హిమాంనగర్లో సర్వే అడ్డుకునేందుకు వచ్చిన రైతులు (పాత చిత్రం)
ఏన్కూరు, న్యూస్టుడే: సీతారామ ప్రధాన కాలువ నీటిని వైరా జలాశయానికి అనుసంధానం చేసే కాలువ పనులకు అడగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. మార్చి 13న వైరాలో నలుగురు మంత్రులు ఈ పనులకు శంకుస్థాపన చేసిన విషయం విదితమే. తమకు కచ్చితమైన హామీలు ఇవ్వడం లేదని భూములు కోల్పోతున్న రైతులు అడ్డుకోవడంతో పనులకు ఆలస్యం జరుగుతుంది. కాలువ తవ్వకాలలో ఎక్కువగా చిన్న, సన్నకారు రైతులే ఉండటంతో తమకున్న జీవనాధారం కోల్పోతున్నామని, ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని పట్టుబడుతున్నారు. మరోవైపు ఎకరానికి కచ్చితమైన పరిహారం ప్రకటించకుండానే సర్వేలు చేపట్టడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భూములిచ్చేందుకు నిరాకరణ..
జూలూరుపాడు మండలం వినోభానగర్ వద్ద సీతారామ ప్రధాన కాలువ నుంచి నీటిని ఏన్కూరులోని ఎన్నెస్పీ ఎడమ కాలువలోకి మళ్లించేందుకు లింక్ కెనాల్ నిర్మాణం చేపడుతున్నారు. ఏన్కూరు, హిమాంనగర్, నాచారం, టీఎల్పేట రెవెన్యూ గ్రామాల నుంచి 106.20 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో గ్రామసభలు, అభిప్రాయాల సేకరణ చేపట్టగా ఆ గ్రామాల రైతులు నిరాకరిస్తూ తమ భూములు ఇవ్వబోమంటూ తేల్చిచెప్పారు. కాలువ వల్ల తమకు లాభం లేదని, ఏళ్లుగా ఉన్న విలువైన భూములు కోల్పోతున్నామన్నారు. ప్రభుత్వం ప్రకటించిన పరిహారం చాలా తక్కువని, తిరిగి భూమి కొనాలంటే కష్టమని తెలిపారు. ఎలాంటి ప్రకటన చేయకుండానే కొన్నిరోజులుగా పొలాల్లో యంత్రాలు దింపడంతో అడ్డుకుంటున్నారు.
మా గోడు పట్టించుకోరా..
ఏన్కూరు నుంచి హిమాంనగర్ వరకు అధికారులు సర్వే చేపడుతుండగా రైతులు అడ్డుకుంటున్నారు. కొంతమంది రైతులు తమకున్న భూమి మొత్తం కాలువకు పోతుందని తామెలా బతకాలంటూ అధికారుల ఎదుట ఆవేదన చెందుతున్నారు. భూముల్లోని బోర్లు, మోటర్లు పోతున్నాయని మరికొందరు చెబుతున్నారు. సుమారు వారం క్రితం హిమాంనగర్లో రైతులు మూకుమ్మడిగా సర్వేను అడ్డుకోవడంతో ఎస్ఈ శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ శేషగిరిరావు అక్కడికి చేరుకున్నారు. సర్వేకు సహకరించాలని కోరగా పరిహారం ప్రకటించకుండా సర్వే ఎలా చేస్తారని రైతులు ప్రశ్నించారు. ఏన్కూరులో 1970కు పూర్వం నుంచి ఉన్న భూములకు పట్టాలుండగా వారికి రైతుబంధు సాయం అందుతుంది. భూములు కోల్పోయి తిరిగి కొనుగోలు చేస్తే గిరిజనేతురులకు పట్టాలు చేసే అవకాశం ఉండదని వాటిపై స్పష్టత ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. కలెక్టర్ ఈ ప్రాంతాన్ని సందర్శించి తమకు స్పష్టమైన హామీ ఇవ్వాలని, అప్పటివరకు తాము భూములు ఇచ్చే ప్రసక్తే లేదని తెగేసి చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సార్వత్రిక సమరం.. కసరత్తు ముమ్మరం
[ 06-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు అధికార యంత్రాంగం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. -
కరుగుతున్న గుట్టలు
[ 06-05-2024]
జిల్లా సరిహద్దు మండలాలైన జూలూరుపాడు, ఏన్కూరు ప్రాంతాల నుంచి మట్టి రవాణా జోరందుకుంది. కొత్తగూడెం, పాల్వంచ చుట్టు పక్కల ప్రాంతాలకు సైతం రవాణా అవుతోంది. -
వేసవి తాపం.. మారిన షిఫ్ట్ సమయం
[ 06-05-2024]
సింగరేణి ఉపరితల గనుల్లో షిఫ్ట్ వేళలు మారాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఉదయం, రెండో షిఫ్ట్ సమయాల్లో యాజమాన్యం మార్పులు చేసింది. -
అభివృద్ధిని కాంక్షించి కాంగ్రెస్ను గెలిపించండి: తుమ్మల
[ 06-05-2024]
తాను మంత్రిగా గతంలో కల్లూరును అన్నిరంగాల్లో అభివృద్ధి చేశానని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. -
రాజకీయాలకు అతీతంగా అండగా నిలుస్తా: నామా
[ 06-05-2024]
రాజకీయాలకు అతీతంగా ప్రజలకు అండగా ఉంటానని ఖమ్మం లోక్సభ స్థానం భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. -
ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పాలన: మంత్రి పొంగులేటి
[ 06-05-2024]
ప్రజల ఆలోచనలకు అనుగుణంగా కాంగ్రెస్ పాలన సాగిస్తుందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. -
భాజపాలో పలువురి చేరిక
[ 06-05-2024]
అసెంబ్లీ ఎన్నికల్లో కారు షెడ్డుకు పోయిందని, హామీలు నెరవేర్చక కాంగ్రెస్ పని ఖతమయ్యిందని ఖమ్మం లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. -
‘ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి సీఎం సానుకూలం’
[ 06-05-2024]
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని మాజీ ఎమ్మెల్సీలు బి.మోహన్రెడ్డి, పూల రవీందర్ పిలుపునిచ్చారు. -
గాలివాన బీభత్సంతో గాఢాంధకారం
[ 06-05-2024]
ఈదురుగాలులు, పిడుగులతో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. -
బ్రహ్మోత్సవాల రాబడి.. తేలేదెప్పుడండీ..?
[ 06-05-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఏప్రిల్ 9 నుంచి 23 వరకు శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా నిర్వహించినా ఈ క్రతువుపై వచ్చిన ఆదాయం ఎంతన్నది ఇప్పటికీ తేలలేదు. -
వాడి తగ్గని దండా
[ 06-05-2024]
ఎన్నికల్లో గెలుపోటములు ప్రధానం కాదని, ప్రజలను చైతన్యం చేయడమే లక్ష్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు భారత విప్లవకారుల సమైక్యతా కేంద్రం(మార్క్సిస్ట్, లెనినిస్ట్)(యూసీసీఆర్ఐ-ఎంఎల్) ఖమ్మం లోక్సభ అభ్యర్థి దండా లింగయ్య. -
భారాస గెలిస్తేనే రాష్ట్రానికి మేలు
[ 06-05-2024]
భారాస కార్యకర్తల కృషి, ఐదు నెలల్లోనే కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతతో తాను మరోసారి విజయం సాధిస్తానని ఖమ్మం లోక్సభ స్థానం భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. -
అతివల చేతిలో ఓటు చైతన్యం
[ 06-05-2024]
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికలను పురస్కరించుకుని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలు ఓటరు చైతన్యంపై వినూత్న ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. -
కోడి ధరకు రెక్కలు
[ 06-05-2024]
వేసవి ఎండల ప్రభావానికి కోళ్ల సరఫరా తగ్గడంతో ఉమ్మడి జిల్లాలో మాంసం ధరలు అమాంతం పెరిగాయి. -
బాలికలే సాధకులు
[ 06-05-2024]
తల్లిదండ్రులు బాలురతో సమానంగా బాలికలను ప్రోత్సహిస్తున్నారు. ఇంట్లో ఇద్దరు, ముగ్గురు బాలికలున్నా వేసవి సెలవుల్లో వారిని వెన్నుతట్టి నడిపిస్తున్నారు. -
వైభవంగా రాములోరికి అభిషేక
[ 06-05-2024]
భద్రాచలం రామాలయ క్యూలైన్లు ఆదివారం భక్తులతో కిటకిటలాడాయి. ప్రధాన కోవెలలో అర్చకులు సుప్రభాత సేవ చేసి అభిషేక మహోత్సవాన్ని కొనసాగించారు. -
7న సినీ నటుడు వెంకటేశ్ రాక
[ 06-05-2024]
ఖమ్మం లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి వియ్యంకుడు సినీ నటుడు విక్టరీ వెంకటేష్ ఈనెల 7న ఖమ్మం రానున్నట్లు ప్రోగ్రాం సమన్వయకర్త తుంబూరు దయాకర్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. -
దంపతులను బలిగొన్న టిప్పర్
[ 06-05-2024]
టిప్పర్ ఢీకొని భార్యాభర్తలు దుర్మరణం పాలయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో ఈ ఘటన ఆదివారం చోటుచేసుకొంది.