సైకో ముఖ్యమంత్రికి ఓటుతో బుద్ధి చెప్పండి
సైకో ముఖ్యమంత్రికి ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే, తెదేపా అభ్యర్థి బీసీ జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ‘ప్రజాగళం’లో భాగంగా పట్టణంలోని బీసీ కాలనీలో ఆయన పర్యటించారు.
బనగానపల్లి, న్యూస్టుడే: సైకో ముఖ్యమంత్రికి ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే, తెదేపా అభ్యర్థి బీసీ జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ‘ప్రజాగళం’లో భాగంగా పట్టణంలోని బీసీ కాలనీలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయిదేళ్లలో అరాచకపాలన తప్ప చేసేందేమి లేదని అన్నారు. వంద పడకల ఆసుపత్రిని కట్టించినా పూర్తిస్థాయిలో పరికరాలు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నిత్యావసరాల ధరలు పెరగడంతో పేద, మధ్యతరగతి ప్రజలు అవస్థలపాలవుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,035 మంది దళితులపై దాడులు జరిగాయన్నారు. వంగల పరమేశ్వరరెడ్డి, కె.మల్లికార్జునరెడ్డి, టంగుటూరి శీనయ్య, బొబ్బల గోపాల్రెడ్డి, బురానుద్దీన్, అల్తాఫ్, ఖాదర్, దస్తగిరి, రాయలసీమ సలాం, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
జగన్ను ఇంటికి పంపేందుకు జనం సిద్ధంగా ఉన్నారు
ఆత్మకూరు, న్యూస్టుడే : రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని ఇంటికి పంపేందుకు జనం సిద్ధంగా ఉన్నారని శ్రీశైలం నియోజకవర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డా రాజశేఖర్రెడ్డి పేర్కొన్నారు. ఆత్మకూరులోని వెంగళరెడ్డి కాలనీ, 3వ వార్డులో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైకాపా ప్రభుత్వంలో నిత్యావసర వస్తువులతో పాటు అన్ని ధరలు పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎన్నికల ముందు ఇంట్లో చదువుకునే వారందరికి అమ్మఒడి ఇస్తామని చెప్పిన జగన్ ఇంట్లో ఒక్కరికే పరిమితం చేశారన్నారు. పింఛన్ల కోత విధించారన్నారు. తెదేపా పాలనలో మైనార్టీలకు అభివృద్ధి జరిగితే ప్రస్తుత ప్రభుత్వంలో అన్యాయం జరిగిందని వివరించారు. 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తీసుకువస్తానని చెప్పి ఆ ఊసే ఎత్తలేదన్నారు. పట్టణంలో గంజాయి విచ్చలవిడిగా దొరకడంతో యువకులు దానికి బానిసలయ్యారని దీనికి కారణం వైకాపానే అని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా గెలిస్తే పింఛన్ రూ.4 వేలకు పెంచుతామన్నారు. చంద్రబాబు మొదటి సంతకం డీఎస్సీపైనే చేస్తారని వివరించారు. నాయకులు కలీముల్లా, వేణుగోపాల్, శివప్రసాదరెడ్డి, నాగూర్ఖాన్, పస్పిల్ మున్నా, రాజారెడ్డి పాల్గొన్నారు.
పార్టీ గెలుపునకు కృషి చేయాలి: కోట్ల
బోయవాండ్లపల్లె(ప్యాపిలి), న్యూస్టుడే: డోన్ నియోజకవర్గంలో తెదేపా విజయం సాధించడానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని డోన్ నియోజకవర్గ తెదేపా ఉమ్మడి అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్రెడ్డి పేర్కొన్నారు. ‘బాబు స్యూరిటీ..భవిష్యత్తుకు గ్యారంటీ’ని మండలంలోని రాచవాండ్లపల్లె, బోయవాండ్లపల్లె, డి.రంగాపురం, జక్కసానికుంట్ల గ్రామాల్లో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెదేపా హయాంలోనే బీసీలకు రాజకీయంగా ఉన్నత స్థానాలు కల్పించినట్లు తెలిపారు. ఇంటింటికీ వెళ్లి మ్యానిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. రాష్ట్ర కార్యదర్శి వై.నాగేశ్వరరావుయాదవ్, టి.శ్రీనివాసులు, పుల్లారెడ్డి పాల్గొన్నారు.
జక్కసానికుంట్ల (ప్యాపిలి), న్యూస్టుడే: రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం తెదేపాతోనే సాధ్యమని నంద్యాల పార్లమెంటు అభ్యర్థి బైరెడ్డి శబరి, డోన్ అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్రెడ్డి పేర్కొన్నారు. జక్కసానికుంట్లలో ‘బాబు స్యూరిటీ...భవిష్యత్తుకు గ్యారంటీ’ని బుధవారం నిర్వహించి మాట్లాడారు. జగన్మోహన్రెడ్డి ఎన్నికల ముందు రామరాజ్యం తెస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక రాక్షసరాజ్యం తెచ్చారని తెలిపారు. ఒక్కసారి ఛాన్స్ అడిగితే ప్రజలు నమ్మి జగన్ను గెలిపించారని, అయిదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. వై.నాగేశ్వరరావుయాదవ్, ధర్మవరం సుబ్బారెడ్డి, జయరాముడు, దేవేంద్ర, ఆదిరెడ్డి, గంగిరెడ్డి, మహేశ్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యేనైతే గేటు వసూళ్లుండవ్
ఆళ్లగడ్డ, న్యూస్టుడే: తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఆళ్లగడ్డలో గేటు వసూలు లేకుండా చేస్తానని ఆళ్లగడ్డ తెదేపా అభ్యర్థి భూమా అఖిలప్రియ అన్నారు. బుధవారం ఆమె నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ పురపాలక పరిధిలో ఆర్యవైశ్యులు, వ్యాపారులతో తాను సమావేశమైనప్పుడు గేటు వసూలు అక్రమాలపై ఫిర్యాదులు వచ్చాయని, అందుకే అవి లేకుండా చేస్తానని, అవసరమైతే ఆ మొత్తాన్ని తానే చెల్లించేందుకు ముందుకు వస్తానన్నారు. లారీ డ్రైవర్లతో సమావేశమయ్యానని, గ్రీన్ ట్యాక్స్, ఎఫ్సీ, ఇతర ధ్రువీకరణ పత్రాల జారీ రుసుములు, లోడ్ జరిమానాలు విపరీతంగా ఈ ప్రభుత్వం పెంచేసిందన్నారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏడాదిలోపే ఆళ్లగడ్డ, శిరివెళ్లలో ఆటోనగర్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆళ్లగడ్డ పట్టణంలో ఆటోడ్రైవర్ల కోసం మూడుచోట్ల ఆటోస్టాండ్లు ఏర్పాటు చేస్తానన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాలో చేరికలు
[ 30-04-2024]
మండలంలోని పెద్దమర్రివీడు, ఐరన్ బండ, ఎన్నె కండ్ల, పిల్లిగుండ్ల తదితర గ్రామాల నుంచి 200 కుటుంబాలు తెదేపాలో చేరినట్లు మండల కన్వీనర్ నజీర్ సాహెబ్ మంగళవారం తెలిపారు. -
తెదేపాతోనే అభివృద్ధి సాధ్యం
[ 30-04-2024]
తెదేపా అధికారంలోకి రావడం వల్ల అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయని కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. -
ఓటర్ చైతన్య ర్యాలీ
[ 30-04-2024]
ఆదోని పట్టణంలో మంగళవారం ఓటరు చైతన్య ర్యాలీ నిర్వహించారు. -
అండర్ 19 క్రికెట్ ఎంపిక పోటీలు
[ 30-04-2024]
మే 5న కర్నూలు డీఎస్సీ స్టేడియంలో అండర్ 19 బాలుర క్రికెట్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి దేవేందర్ గౌడ్ తెలిపారు. -
చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం
[ 30-04-2024]
చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని మండల తెదేపా నాయకులు రామాంజనేయులు తిరుపతయ్య, రంగముని, రహంతుల్లా అన్నారు. -
ఎన్నికల సమయంలో గొడవలు సృష్టిస్తే కేసులే..
[ 30-04-2024]
ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో గ్రామాల్లో గొడవలు సృష్టిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని గోనెగండ్ల సీఐ రామకృష్ణయ్య అన్నారు. -
ముస్లింలకు జగన్ ధోకా
[ 30-04-2024]
తెదేపా హయాంలో ముస్లిం మైనార్టీలకు న్యాయం చేశాం.. ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశాం. ఉర్దూను రెండో భాషగా గుర్తించాం.. దుకాన్ మకాన్, దుల్హన్ లాంటి పథకాలు తెచ్చాం.. రంజాన్ తోఫా ఇచ్చి అండగా నిలిచా.. ఈ పథకాలన్నీ జగన్రెడ్డి రద్దు చేసి మైనార్టీలకు అన్యాయం చేశారు. -
పండుటాకులతో జగన్ పింఛనాట
[ 30-04-2024]
సామాజిక పింఛన్ల వ్యవహారంలో జగన్నాటకం కొనసాగుతోంది.. ఇంటింటికీ వెళ్లి పింఛను పంపిణీ చేయకుండా ఉండేందుకు ఎన్ని రకాలు కుట్రలు, కుతంత్రాలు పన్నాలో అన్నింటినీ అమలు చేస్తున్నారు. -
జలం కోసం జనం ఆందోళన
[ 30-04-2024]
మండలంలోని కులుమాల గ్రామంలో నెలలు తరబడిగా వేధిస్తున్న తాగునీటి సమస్యను తీర్చాలని గ్రామస్థులు సోమవారం గోనెగండ్లలోని మండల పరిషత్తు కార్యాలయాన్ని ముట్టడించారు. -
అసెంబ్లీ బరిలో 126 మంది
[ 30-04-2024]
జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల బరిలో 126 మంది అభ్యర్థులు నిలిచారు. నంద్యాల పార్లమెంటు స్థానానికి 31 మంది పోటీలో ఉన్నారు. -
పరిహారం ఇచ్చే వరకు పనులు ఆపండి
[ 30-04-2024]
మండలంలోని పిన్నాపురం గ్రామంలో గ్రీన్కో సంస్థ చేపట్టిన విద్యుదుత్పత్తి ప్రాజెక్టు నిర్మాణ పనులను రైతులు అడ్డుకున్నారు. -
1 వరకు దరఖాస్తుకు గడువు
[ 30-04-2024]
ఎన్నికల ఏజెంట్లుగా నియమించుకోవాలనుకునేవారు ఫామ్-8 ఇవ్వడంతోపాటు వ్యయ నిర్వహణ కోసం ఒకరిని ఏర్పాటుచేసుకోవాలని పాణ్యం ఆర్వో, జేసీ నారపురెడ్డి మౌర్య అన్నారు. -
రాక్షస పాలనను తరిమేద్దాం
[ 30-04-2024]
రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, దీనికి త్వరలోనే చరమగీతం పాడాలని పాణ్యం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి, తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ అన్నారు. -
5 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ
[ 30-04-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొనే పీవో, ఏపీవో, ఓపీవోలు, అత్యవసర సర్వీసుల్లో విధులు నిర్వహిస్తున్న వారికి పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును ఎన్నికల సంఘం కల్పించింది. -
స్వతంత్ర అభ్యర్థికి గ్లాస్ టంబ్లర్ గుర్తు
[ 30-04-2024]
కర్నూలు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే బరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థి భరత్.ఎన్కు అధికారులు గ్లాస్ టంబ్లర్ గుర్తు కేటాయించారు. -
ఫైనాన్స్ సంస్థకు మొట్టికాయ
[ 30-04-2024]
నిబంధనలు పాటించని మణిప్పురం ఫైనాన్స్ సంస్థకు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ మొట్టికాయ వేసింది. -
వంతెనలు కూలుతున్నా.. కునుకు వీడరా!
[ 30-04-2024]
వైకాపా పాలనలో భూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి కనిపించదు అని చెప్పడానికి ఈ చిత్రాలే నిదర్శనం. వంకలు, నదులపై నిర్మించిన వంతెనలు, కల్వర్టులు దెబ్బతిన్నా జగన్ ఐదేళ్ల పాలనలో కనీసం వాటి మరమ్మతుకు అడుగు ముందుకు పడలేదు. -
జగనన్నా.. న్యాయం ఏదన్నా..
[ 30-04-2024]
మహిళలకు రక్షణ కల్పించేందుకు దిశా పోలీసుస్టేషన్లు ఏర్పాటుచేస్తున్నట్లు ముఖ్యమంత్రి గొప్పలు చెప్పారు. వీటిద్వారా మహిళలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. -
ప్రతి ఎకరాకు నీరందిస్తాం
[ 30-04-2024]
తాను ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రతి ఎకరాకు నీరందిస్తామని శ్రీశైలం నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డా రాజశేఖర్రెడ్డి హామీ ఇచ్చారు. -
ఉమ్మడి కూటమితోనే ఏపీలో అభివృద్ధి సాధ్యం
[ 30-04-2024]
ఉమ్మడి కూటమితోనే ఏపీ అన్ని విధాలా అభివృద్ధి పథంలో నడుస్తుందని నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. -
అనుమానాస్పద స్థితిలో విలేకరి మృతి
[ 30-04-2024]
ఆత్మకూరుకు చెందిన నెత్తికొప్పుల మహేష్(48) సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం విలేకరిగా పని చేస్తున్న మహేశ్ పట్టణ శివారులోని ఆర్డీటీ కాలనీలో నివాసం ఉంటున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
విడాకులు తీసుకున్న కుమార్తెను ఘనంగా ఇంటికి ఆహ్వానించిన తండ్రి
-
ఓటీటీలో సిద్ధార్థ్ రాయ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
వరుణుడి అడ్డంకి.. బంగ్లాదేశ్పై భారత్ విజయం
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి