logo

చంద్రబాబుతోనే రాష్ట్రానికి భవిష్యత్తు: బీవీ

రాష్ట్రంలో యువత ఉద్యోగాలు, అభివృద్ధి సాధించాలంటే చంద్రబాబుతోనే సాధ్యమని, ప్రతి ఒక్కరూ తెదేపాను గెలిపించాలని ఎమ్మిగనూరు తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు.

Published : 20 Apr 2024 05:18 IST

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: రాష్ట్రంలో యువత ఉద్యోగాలు, అభివృద్ధి సాధించాలంటే చంద్రబాబుతోనే సాధ్యమని, ప్రతి ఒక్కరూ తెదేపాను గెలిపించాలని ఎమ్మిగనూరు తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఎమ్మిగనూరు పట్టణంలో 9వ వార్డు, కబరస్థాన్‌ కొట్టాలలో ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో ఐదేళ్ల వైకాపా పాలనలో కనీసం రోడ్లు వేయలేకపోయారని పేర్కొన్నారు. గుంతలుపడ్డ దారులకు మరమ్మతులు చేపట్టకుండా ఎమ్మెల్యే నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. వైకాపా పాలనలో ఎమ్మిగనూరు పట్టణం 20 ఏళ్ల అభివృద్ధి వెనుకబడిపోయిందన్నారు. తెదేపా నాయకులు రాజేంద్ర, ఇబ్రహీం, రాందాస్‌గౌడు, సుందరరాజు, దయాసాగర్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని