logo

Bandi Sanjay: బండి సంజయ్‌ పాదయాత్రలో ఉద్రిక్తత

భాజపా తెలంగాణ శాఖ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నిర్వహిస్తు్న్న ‘ప్రజా సంగ్రామ పాదయాత్ర’ను

Updated : 18 Apr 2022 15:27 IST

ఇటిక్యాల: భాజపా తెలంగాణ శాఖ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నిర్వహిస్తున్న ‘ప్రజా సంగ్రామ పాదయాత్ర’లో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెరాస శ్రేణులు పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశాయి. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం వేముల వద్ద కొందరు తెరాస కార్యకర్తలు బండి సంజయ్‌ను అడ్డుకునేందుకు యత్నించగా పోలీసులు నిలువరించారు. తెరాస కార్యకర్తలను అడ్డుకుని వేరే ప్రదేశానికి తరలించారు. తెరాస కార్యకర్తలు తమ పాదయాత్రను అడ్డుకునేందుకు యత్నించడంపై భాజపా శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా భాజపా కార్యకర్తలు నినాదాలు చేశారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని