చిత్రసీమలో నడిగడ్డ బిడ్డలు
కేటీదొడ్డి మండలం కుచినెర్ల గ్రామానికి చెందిన సురేశ్ (సూరి) యంఏ బీఎడ్ వరకు చదివారు. చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా పిచ్చి. చిరంజీవి, పవన్ కల్యాణ్ మ్యానరిజం అంటే చాలా ఇష్టం.
రెయిన్ స్టార్ బిరుదు సాధించాలని ఉంది
గబ్బర్సింగ్ కవర్సాంగ్ చిత్రీకరణలో సురేశ్
గద్వాల గ్రామీణం, న్యూస్టుడే : సినిమాల్లో నటించడమంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే. అందులో నిలదొక్కుకోవడం కొందరికే సాధ్యమవుతుంది. నటనాపరంగా నవరసాలు పండించగలిగితేనే వెండితెరపై రాణించగలుగుతారు. తెలుగు చిత్రసీమలో నడిగడ్డ నుంచి ఆంజనేయ ప్రసాద్ (అంజి దేవేండ్ల), అంజి వల్గుమాన్ తమకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. వీరితో పాటు యూట్యూబ్ స్టార్ కుచినెర్ల సురేశ్ రెయిన్ కవర్సాంగ్స్ చేస్తూ ఆదరణ పొందుతున్నారు. వీరి గురించి ‘న్యూస్టుడే’ కథనం.
కేటీదొడ్డి మండలం కుచినెర్ల గ్రామానికి చెందిన సురేశ్ (సూరి) యంఏ బీఎడ్ వరకు చదివారు. చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా పిచ్చి. చిరంజీవి, పవన్ కల్యాణ్ మ్యానరిజం అంటే చాలా ఇష్టం. 2021లో గ్యాంగ్లీడర్ సినిమాలోని సండే అననురా మండే అననురా..కవర్ సాంగ్ను ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి నుంచి విడుదల చేయించారు. భీమ్లానాయక్, టైటిల్సాంగ్తో సమాజానికి సందేశమిస్తూ చేసిన కవర్సాంగ్కు మంచి ఆదరణ లభించింది. ఘరానా మొగుడు చిత్రంలోని ‘కిటుకులు తెలిసిన’, మెకానిక్ అల్లుడు చిత్రంలోని ‘గురువా గురువా..’ వంటి పాటలతో గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు రెయిన్ సాంగ్స్ మాషప్ కూడా చేశారు. అచ్చంగా వెండితెర సినిమా సాంగ్స్కి ఏమాత్రం తగ్గకుండా కవర్సాంగ్స్తో ప్రజల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు. రెయిన్ స్టార్ బిరుదు సాధించాలని ఉందని సురేశ్ తెలిపారు.
క్యారెక్టర్ ఆర్టిస్ట్గా గుర్తింపు
జమ్మిచేడు గ్రామానికి చెందిన అంజి వల్గుమాన్ డిగ్రీ వరకు చదువుకున్నారు. చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తితో 2006లో హైదరాబాద్కు వెళ్లిన అంజి అప్పటి నుంచి సినిమాల్లో నటించాలని గట్టిగా ప్రయత్నాలు చేశారు. 2006లో థియేటర్ ఆర్ట్స్ (రంగస్థల కళలు)లో ప్రవేశం పొంది ఇప్పటివరకు 300కు పైగా నాటకాల్లో నటించారు.
స్వయంగా రాసి దర్శకత్వం వహించిన వినాశి, బ్లాక్ అండ్ వైట్ వంటి రెండు నాటకాలను రవీంద్రభారతిలో ప్రదర్శించారు. 2009లో ‘ఈటీవీలో కామెడీ గ్యాంగ్’ షోలో ఉత్తమ ప్రదర్శన ఇచ్చి బెస్ట్ విన్నర్ అయ్యారు. అనంతరం కొన్ని ధారావాహికల్లో నటించిన అంజి 2013లో ఈటీవీ జబర్దస్త్లో చమ్మక్ చంద్ర, పటాస్ ప్రకాశ్ టీమ్లలో సుమారు 80కి పైగా ఎపిసోడ్లో కామెడీ స్కిట్లు చేశారు. మహాత్మ, సారాయి వీర్రాజు, పైసా, ఏబీసీడీ, లవర్, బిలాల్పూర్ పోలీస్ స్టేషన్, స్కైలాబ్, సురాపానం, బలగం సినిమాల్లో నటించారు. ఓటీటీ వచ్చేసరికి మెయిల్, కొత్తపోరడు వంటివి చేశారు. ఇంటింటి రామాయణం, పరేషాన్, భీమ దేవరపల్లి బ్రాంచి, రామన్న యూత్ వంటి సినిమాలు చిత్రీకరణ పూర్తి అయి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. దగ్గుపాటి రానా సమర్పణలో పరేషాన్, సీనియర్ యాక్టర్ నరేశ్కు తమ్ముడిగా నటించిన ఇంటింటి రామాయణం చిత్రాలు జూన్ 2న విడుదల కానున్నాయి. నటనాపరంగా కళాకారులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్న అంజి తనకంటూ ఒక మంచి పేరు మోసిన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా గుర్తింపు పొందాలని లక్ష్యం పెట్టుకున్నారు.
దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకోవాలి..
గద్వాల పాతహౌసింగ్బోర్డు కాలనీకి చెందిన ఆంజనేయ ప్రసాద్ (అంజి దేవేండ్ల)కు మొదటగా స్రవంతి ధారావాహికలో అవకాశం వచ్చింది. అందులో 70 ఎపిసోడ్లలో నారిగాడు పాత్రలో నటించారు. బంధం, వైశాలి, శుభలేఖ, ఆడపిల్ల, శ్రీ శ్రీమతి కల్యాణం, మంచుపల్లకి ధారావాహికల్లో ప్రధాన ప్రాత పోషించారు. అదే సమయంలో సినిమాల అవకాశాలు వచ్చాయి. డాన్ సినిమాతో సినీ ప్రస్థానం ప్రారంభమైంది. కేడీ, ఢమరుకం, రాజన్న, రాఖీ, ఊసరవెల్లి, రభస, హ్యాపీ, రేసుగుర్రం, అన్నవరం, ఖతర్నాక్, మహాత్మ, అల్లరి పిడుగు, శౌర్యం, శంఖం, ఒంటరి, దొంగలబండి, సుడిగాడు, నువ్విలా, సారాయి వీర్రాజు ఇలా ఇప్పటివరకు 60 సినిమాల్లో నటించారు. వెండితెరపై దర్శకుడిగా చిత్రసీమలో మంచిపేరు, గుర్తింపు తెచ్చుకోవాలన్న లక్ష్యం దిశగా కృషి చేస్తున్నారు.
దర్శకత్వం వహిస్తున్న ఆంజనేయ ప్రసాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా ఎలక్షన్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమం
[ 10-05-2024]
జోగులంబ గద్వాల జిల్లా అయిజ పట్టణ భాజపా కార్యాలయంలో బూత్ అధ్యక్షుడు, పోలింగ్ బూత్ ఏజెంట్ల సమావేశం నిర్వహించారు. -
భారాస విస్తృత ప్రచారం
[ 10-05-2024]
రాజోలి మండలంలోని పచ్చర్ల గ్రామంలో భారాస నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. -
ఘనంగా బసవ జయంతి
[ 10-05-2024]
జంగమ వీరశైవ సమాజం ఆధ్వర్యంలో శుక్రవారం మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో బసవ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. -
మేనత్తను అవమానిస్తే ఆనందిస్తారా?: కాంగ్రెస్ ఎమ్మెల్యేపై డీకే అరుణ ఫైర్
[ 10-05-2024]
కాంగ్రెస్ నాయకులు అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని భాజపా మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. -
తరాలు చూసినా తరగని స్ఫూర్తి
[ 10-05-2024]
దేశ భవితకు చుక్కాని అని చెప్పే యువతలో చాలామందికి ఓట్లేయడం అంటే బద్ధకం... రాజకీయాలను విశ్లేషించే మధ్య వయస్కులు, విద్యావంతుల్లో కొందరు పోలింగ్కు వెళ్లడానికి పూట కేటాయించడానికి ఆలోచిస్తారు. -
పాఠ్య పుస్తకాలొస్తున్నాయ్!
[ 10-05-2024]
బడులు తెరిచే నాటికి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించే లక్ష్యంతో రాష్ట్ర విద్యాశాఖ పంపిణీ ప్రక్రియ ప్రారంభించింది. -
భాజపా గెలిస్తే ప్రజాస్వామ్యానికి ముప్పు: సురేఖ
[ 10-05-2024]
కేంద్రంలో మరోమారు భాజపాను గెలిపిస్తే ప్రజాస్వామ్యానికి పెనుముప్పేనని కాంగ్రెస్తోనే దేశాభివృద్ధి సాధ్యమని ఏఐసీసీ నియోజకవర్గ సమన్వయకర్త సురేఖ అన్నారు. -
పాలమూరులో ప్రచార హోరు
[ 10-05-2024]
షెడ్యూల్ వచ్చిన తర్వాత భాజపా అగ్రనేతలు ఎవరూ కూడా ఉమ్మడి మహబూబ్నగర్లో పర్యటించలేదు. మహబూబ్నగర్కు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామీ, నాగర్కర్నూల్కు గుజరాత్ సీఎం భూపేంద్రపటేల్ వచ్చారు -
రాముడి పేరుతో భాజపా ఓట్ల వేట: వంశీచంద్
[ 10-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే దేశాభివృద్ధి సాధ్యమని మహబూబ్నగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి అన్నారు. -
గెలిపిస్తే రైల్వే లైన్ ఏర్పాటుకు కృషి చేస్తా
[ 10-05-2024]
ఎంపీగా తనను గెలిపిస్తే నాగర్కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గానికి రైల్వే లైను తీసుకొస్తానని భాజపా అభ్యర్థి భరత్ ప్రసాద్ అన్నారు. -
ఓటు వేసి సోనియాగాంధీ రుణం తీర్చుకుందాం
[ 10-05-2024]
ఎంత మంది వ్యతిరేకించినా సోనియా గాంధీ సాహస నిర్ణయంతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధ్యపడిందని కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి రుణం తీర్చుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. -
కాంగ్రెస్ పాలనలో ప్రజలకు కష్టాలు: చల్లా
[ 10-05-2024]
అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే విజయుడిని గెలిపించినట్లే లోక్సభ ఎన్నికల్లో భారాస అభ్యర్థి ఆర్ఎస్.ప్రవీణ్కుమార్ను అంతకంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి కోరారు. -
ఆసుపత్రి ఎదుట మృతదేహంతో ధర్నా
[ 10-05-2024]
ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే యువకుడు మృతి చెందాడని ఆరోపిస్తూ గురువారం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వద్ద బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు. -
అక్షింతల రాజకీయం చేస్తున్న భాజపాకు బుద్ధి చెప్పాలి: జూపల్లి
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికల్లో భాజపా రాముడి అంక్షితల పేరిట రాజకీయం చేస్తోందని ఈనెల 13న జరగనున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. -
పోలింగ్ శాతం పెంపే లక్ష్యం
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికల నిర్వహణ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎన్నికల నిర్వహణ ప్రక్రియకు కొన్ని గ్రామాలు తలనొప్పిగా మారాయి. -
ప్రధాని పర్యటనకు పటిష్ఠ బందోబస్తు
[ 10-05-2024]
ప్రధాని మోదీ నారాయణపేట జిల్లా పర్యటన సందర్భంగా పోలీసుశాఖ ఆధ్వర్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ యోగేశ్గౌతం తెలిపారు. -
బాదేపల్లి మార్కెట్లో మొక్కజొన్న బస్తాలు నింపిన డీసీఎంకు మంటలు
[ 10-05-2024]
మహబూబ్నగర్ జిల్లా బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ బయట దుకాణాల ముందు మొక్కజొన్న బస్తాలతో నిలిపి ఉన్న డీసీఎంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఖలిస్థానీ నేత అమృత్పాల్ సింగ్ నామినేషన్ దాఖలకు సహకరించాం: పంజాబ్ ప్రభుత్వం
-
వరుస నష్టాలకు బ్రేక్.. 260 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
గాయమా? వ్యూహమా? ధోనీ ‘9’లో రావడంపై ఫ్లెమింగ్ స్పందన ఇదీ!
-
గో డిజిట్ ఐపీఓ.. ధరల శ్రేణి, లాట్ సైజ్ వివరాలు ఇవే..
-
సంజు టైమొచ్చింది!.. ప్రపంచకప్ ముంగిట కేరళ కుర్రాడి డ్రీమ్ ఫామ్
-
పాక్లోని ‘సోనల్’ కోసం.. సైనిక సమాచారం లీక్ చేసిన ఇంజినీర్..!