అవకాశాలు అపారం.. నైపుణ్యాలే సోపానం
విద్యార్హత ధ్రువపత్రాలు మాత్రమే ఉంటే ఉద్యోగాలు రావు. ఇందుకు తగిన నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, సామాజిక అవగాహన, నాయకత్వ లక్షణాలు అవసరం. ఇవి లేకపోవటం వల్లనే చాలామంది అవకాశాలు అందిపుచ్చుకోలేకపోతున్నారు.
పాలమూరు విద్యావిద్యాలయంలో యూత్ ఓరియంటేషన్ కోర్సుకు శ్రీకారం
న్యూస్టుడే, పాలమూరు విశ్వవిద్యాలయం
ఒప్పంద పత్రం చూపుతున్న పీయూ ఉప కులపతి ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రాథోడ్, రిజిస్ట్రార్, ఆయిస్టర్ సంస్థ ప్రతినిధులు
విద్యార్హత ధ్రువపత్రాలు మాత్రమే ఉంటే ఉద్యోగాలు రావు. ఇందుకు తగిన నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, సామాజిక అవగాహన, నాయకత్వ లక్షణాలు అవసరం. ఇవి లేకపోవటం వల్లనే చాలామంది అవకాశాలు అందిపుచ్చుకోలేకపోతున్నారు. ఈ దిశగా విద్యార్థులను సిద్ధం చేసేందుకు పాలమూరు విశ్వవిద్యాలయం(పీయూ) కార్యాచరణ చేపట్టింది. ఇందుకు ఆయిస్టర్ అనే స్వచ్ఛంద సంస్థతో మూడేళ్ల ఒప్పందం చేసుకుంది. సంస్థ ఆసక్తి ఉన్న విద్యార్థులందరికీ సర్టిఫికెట్ కోర్సు నిర్వహిస్తుంది. ఇందులో అవగాహన కల్పించే అంశాలపై ‘న్యూస్టుడే’ కథనం.
చదువుతో పాటు విద్యార్థులకు సామాజిక అవగాహన చాలా ముఖ్యమని, సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం ద్వారా అనేక నైపుణ్యాలు పొందొచ్చని ఉస్మానియా విశ్వవిద్యాలయం(ఓయూ) పూర్వ విద్యార్థులు పలువురు ఆయిస్టర్ అనే సంస్థను నెలకొల్పారు. సంస్థ ఆధ్వర్యంలో నిజాం కళాశాల వేదికగా ‘యూత్ కమ్యూనిటీ ఓరియంటేషన్ సర్టిఫికెట్ కోర్సు’కు శ్రీకారం చుట్టారు. తర్వాత ఇతర విద్యాసంస్థలకు విస్తరించారు. ఈసారి పీయూతో ఒప్పందం చేసుకున్నారు. కోర్సులో భాగంగా సుస్థిర అభివృద్ధి, అభివృద్ధిలో స్వచ్ఛంద సంస్థల పాత్ర, ప్రజా ఉద్యమాలు, కృత్రిమ మేధ, సాంకేతిక నైపుణ్యాలు, సైబర్ సెక్యూరిటీ, విద్యాహక్కు చట్టం, సమాచార హక్కు చట్టం, సమాచార ప్రసార సాధనాలు, పరిశోధనా పద్ధతులు, పౌర హక్కులు, వినియోగదారుల హక్కులు, మహిళలు, బాలల హక్కులు, మహిళా సాధికారత, సామాజిక మార్పులో యువత, పౌరుల పాత్ర, విద్య ప్రాధాన్యం, ఆరోగ్యం, పర్యావరణ సమస్యలు - పరిష్కార మార్గాలు, ఇంకుడు గుంతలు - జల సంరక్షణ, ఓటరు చైతన్యం, వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ నైపుణ్యాలు, సేంద్రియ వ్యవసాయం ఇలా అనేక అంశాలపై నిపుణులతో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. ఇందుకు రెవెన్యూ, పోలీసు, ఆరోగ్య, వ్యవసాయం, పశుసంవర్ధక, పశుగణాభివృద్ధి తదితర శాఖల సహకారం తీసుకుంటారు. ఈ కోర్సు కాల పరిమితి మూడు నెలలు. ఇందులో భాగంగా ఇంటర్న్షిప్, క్షేత్ర సందర్శన కార్యక్రమాలు కూడా ఉంటాయి. 18 ఏళ్ల వయస్సు ఉన్న యూజీ, పీజీ చదువుతున్న విద్యార్థులందరూ ఈ కోర్సుకు అర్హులే. కోర్సులో చేరిన విద్యార్థుల్లో ప్రతిభ కనబరచిన వారికి రూ.4వేల చొప్పున ఉపకార వేతనం అందిస్తారు. ఈ కోర్సు సర్టిఫికెట్తో స్త్రీ, శిశు సంక్షేమం, సేవారంగాల్లో ఉద్యోగాల భర్తీలో ప్రాధాన్యం ఉంటుంది.
ప్రణాళికలు రూపొందించాం
- ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రాథోడ్, పీయూ ఉప కులపతి
యువత చదువుతో పాటు సామాజిక అంశాలపై కూడా దృష్టిసారించాలి. ఆలోచనా పరిధిని విస్తృతం చేసుకోవాలి. అప్పుడే పోటీ ప్రపంచంలో రాణించే అవకాశం ఉంటుంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సొంతం చేసుకోవొచ్చు. ఈ దిశగా పీయూ విద్యార్థులను సిద్ధం చేసేందుకు ఆయిస్టర్ సంస్థతో కలిసి ప్రణాళికలు రూపొందించాం.
విద్యార్థుల అభ్యున్నతే లక్ష్యం..
- సునీల్ సింగాడే, ఆయిస్టర్ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు
పేద విద్యార్థుల అభ్యున్నతే లక్ష్యంగా ఆయిస్టర్ ముందుకు సాగుతుంది. పీయూతో మూడేళ్ల ఒప్పందం చేసుకోవడం సంతోషంగా ఉంది. వెనకబడిన ప్రాంతం పాలమూరు యువత అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోయేలా కృషిచేస్తాం. కమ్యూనికేషన్, ఇంటర్వ్యూ స్కిల్స్తో పాటు అనేక అంశాలపై అవగాహన కల్పిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైభవంగా కలశ స్థాపన మహోత్సవం
[ 29-04-2024]
తుంగభద్ర నదిలో నీరు పూర్తిగా తగ్గడంతో బయటకు తేలిన రాజోలి శివారులోని శ్రీ రామేశ్వర స్వామి ఆలయంలో కలశ స్థాపన మహోత్సవం వైభవంగా నిర్వహించారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
[ 29-04-2024]
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదం ఉండవల్లి మండల పరిధిలోని అలంపూర్ చౌరస్తా ఫ్లైఓవర్పై జరిగింది. -
ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్
[ 29-04-2024]
నాగర్ కర్నూల్ పార్లమెంటు ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోమవారం ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ప్రచండ ఎండ!
[ 29-04-2024]
పాలమూరులో భానుడు విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఏప్రిల్లోనే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో చెరువులు, నదులు, వాగులు, బావులు, చెక్డ్యాంలు, నీటికుంటలు ఎండిపోతున్నాయి. -
వలస ఓటర్లపై ఆశలు!
[ 29-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో పాలమూరులోని రెండు లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని వలస ఓటర్లపై ప్రధాన పార్టీల అభ్యర్థులు దృష్టి పెట్టారు. ముంబయి, పుణె, భీమండిలో ఈ ప్రాంతానికి చెందిన ఓటర్లు అధికంగా ఉన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన వేలాది మంది ఉపాధి కోసం హైదరాబాద్లో స్థిరపడ్డారు. -
వానాకాలం సాగు ప్రణాళిక సిద్ధం
[ 29-04-2024]
వచ్చే వానాకాలంలో పంటల సాగుకు అనుకూల పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ తెలపటంతో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు కావలసిన విత్తనాలు, ఎరువుల నిల్వలపై ముందస్తు అంచనాలు తయారు చేశారు. -
దుందుభి.. దుఃఖిస్తోంది!
[ 29-04-2024]
దుందుభి వాగులో ఇష్టానుసారంగా ఇసుకను తవ్వి తరలిస్తున్నారు. రాత్రిళ్లు ఇసుక మాఫియా వాగును ఖాళీ చేస్తుండటంతో మండలంలోని కొత్తూర్, వెలుగొముల, రెడ్డిగూడ, చిల్వేరు, అయ్యవారిపల్లి, కొత్తపల్లి, వాడ్యాల గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
నేటి నుంచి రాష్ట్రస్థాయి సంస్కృత శిక్షణ శిబిరం
[ 29-04-2024]
మహబూబ్నగర్ - జడ్చర్ల రోడ్డులోని మయూరి పార్కు సమీప కేశవరెడ్డి ఉన్నత పాఠశాలలో సోమవారం నుంచి మే 5 వరకు రాష్ట్రస్థాయి సంస్కృత శిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు సంస్కృత భారతి, రామకృష్ణ సేవా సమితి ప్రతినిధులు యాదయ్య, వెంకట్రెడ్డి, రాజ్మల్లేశ్ వెల్లడించారు. -
ఈవీఎంల వయసు 35 ఏళ్లు
[ 29-04-2024]
ప్రస్తుతం ఎన్నికల్లో పోలింగ్ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఈవీఎంలను వినియోగిస్తోంది. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈవీఎంలను తొలిసారి ఎప్పుడు వినియోగించారు? దాని పుట్టు పూర్వోత్తరాలను ఒకసారి పరిశీలిద్దాం. -
ఐదేళ్లకు ఓ పూట
[ 29-04-2024]
సినిమా అంటే క్యూలో నిలుచొని టిక్కెట్లు తీసుకుని మూడుగంటలు వెచ్చిస్తారు... స్నేహితులతో ముచ్చట్లు చెప్పడానికి ఎంతో సమయం తీసుకుంటారు... సామాజిక మాధ్యమాల్లో విహరించడానికి మరెంతో టైం ఖర్చవుతుంది... -
భారాస, భాజపా మాటలు నమ్మొద్దు : మంత్రి జూపల్లి
[ 29-04-2024]
భారాస, భాజపా నాయకుల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన మండలంలోని పలు గ్రామాల్లో కార్యకర్తలతో సమావేశమయ్యారు. -
దోచుకున్న సొమ్ముతో దుబాయ్లో పెట్టుబడులు : వంశీచంద్రెడ్డి
[ 29-04-2024]
కేసీఆర్ కుటుంబం తెలంగాణలో పదేళ్ల పాటు దోచుకున్న సొమ్మంతా దుబాయ్లోని మాల్స్లో పెట్టుబడులు పెట్టిందని, అక్కడ అకాల వర్షాలతో మాల్స్ కొట్టుకుపోతే వారిలో అలజడి మొదలైందని మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి ఆరోపించారు. -
ముగిసిన శిర్సనగండ్ల రాములోరి బ్రహ్మోత్సవాలు
[ 29-04-2024]
రెండో భద్రాదిగా పేరొందిన చారకొండ మండలం శిర్సనగండ్ల శ్రీసీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం సాయంత్రం వైభవంగా ముగిసాయి. -
అలంపూర్ బేనీషా.. ప్రియం
[ 29-04-2024]
ప్రఖ్యాతి గాంచిన అలంపూర్ బేనీషా ఈ ఏడాది దొరకడం గగనమే. అత్యంత రుచికరమైన ఈ పండుకు మంచి గిరాకీ ఉంటుంది. ఈసారి వాతావరణ పరిస్థితులు అనుకూలించక తోటల్లో సగానికన్నా తక్కువ కాత కన్పిస్తోంది. -
ఎలుకా కొరకకే!
[ 29-04-2024]
నారాయణపేటలోని చిన్నపిల్లల ఆస్పత్రిలో రోగులకు ఎలుకలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వచ్చిన చిన్న పిల్లలు, కుటుంబికులు ఆందోళన చెందుతున్నారు. -
అందని ద్రాక్షగా.. టీ ఫైబర్ సేవలు
[ 29-04-2024]
గ్రామాలకు డిజిటల్ సేవలు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన టీ ఫైబర్ సేవల పథకం పడకేసింది. రెండేళ్లుగా అమలును విస్మరించడంతో గ్రామీణులకు డిజిటల్ సేవలు అందనిద్రాక్షగా మారాయి.
తాజా వార్తలు (Latest News)
-
జీవితంపై విరక్తి.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
-
అరుదైన ఘనత సాధించిన ‘పొలిమేర2’.. ఆనందంతో దర్శకుడి పోస్ట్
-
మోదీజీ.. ఇంకా మౌనమేనా?: ప్రజ్వల్ అభ్యంతరకర వీడియోలపై ప్రియాంకగాంధీ
-
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు
-
భారీ ధరకు ‘తండేల్’ ఓటీటీ రైట్స్.. చైతూ కెరీర్లో బిగ్ డీల్
-
భారత్లో నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్.. ధర, ఫీచర్లివే..!