కాంగ్రెస్ అసమర్థ పాలనతో రైతులకు కష్టాలు: మాజీమంత్రి
కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలనతో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కష్టాల కడలిలో చిక్కుకున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జి.జగదీశ్రెడ్డి అన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి జగదీశ్రెడ్డి, వేదికపై నాయకులు కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి,
అభ్యర్థి క్యామ మల్లేశం, జడ్పీ ఛైర్మన్ సందీప్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్
భువనగిరి, భువనగిరి గంజ్, న్యూస్టుడే: కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలనతో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కష్టాల కడలిలో చిక్కుకున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జి.జగదీశ్రెడ్డి అన్నారు. ప్రజల గోస చూడలేక ప్రశ్నించి.. ప్రజా క్షేత్రంలోకి వెళ్లిన కేసీఆర్పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు తీర్చే భారాస గెలుపునకు ప్రతి కార్యకర్త కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. భారాస భువనగిరి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం సాయి కన్వెన్షన్ హాల్లో సోమవారం జరిగింది. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో భారాస జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్, జడ్పీ ఛైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య తదితరులు హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. పదేళ్ల కాలంలో మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో సాగు-తాగు నీటికి ఇబ్బందులు లేకుండా, 24 గంటల కరెంట్ ఇచ్చి తెలంగాణను అన్నపూర్ణగా మార్చితే.. నాలుగు నెలల్లోనే పాలన చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా మార్చిందని దుయ్యబట్టారు. భారాస అభ్యర్థులు గెలిస్తే ప్రభుత్వం మెడలు వంచి హామీలను నెరవేర్చే శక్తి వస్తుందన్నారు. ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్ మాట్లాడుతూ.. ఎంపీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు గుణపాఠం చెప్పేందుకు సిద్ధమయ్యారన్నారు. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి మాట్లాడుతూ.. గతంలో జరిగిన పొరపొట్లు లేకుండా ఎంపీ ఎన్నికల్లో పనిచేయాలన్నారు. జడ్పీ ఛైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి మాట్లాడుతూ.. కార్యకర్తలు నిరుత్సాహ పడొద్దని, ఎంపీ ఎన్నికల తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఉంటాయని, వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ మాట్లాడుతూ.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి జిల్లాకు చేసిందేమీ లేదన్నారు.
- కార్యక్రమంలో సీనియర్ నాయకుడు చింతల వెంకటేశ్వర్రెడ్డి, చెరుకు సుధాకర్, బీబీనగర్ ఎంపీపీ సుధాకర్గౌడ్, కొల్పుల అమరేందర్, గాదె నరేందర్రెడ్డి, బీరుమల్లయ్య, ఆకుల ప్రభాకర్, మాడుగుల ప్రభాకర్రెడ్డి, ఏవీ కిరణ్కుమార్, రచ్చ శ్రీనివాస్రెడ్డి, జనగాం పాండు, అఫ్జల్, సిద్దుల పద్మ, రత్నపురం పద్మ, పడమటి మమత తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏటీఎం చోరీకి యత్నం.. షార్ట్ సర్క్యూట్తో నగదు దగ్ధం
[ 29-04-2024]
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండలోని ఓ ఏటీఎంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా రూ.8 లక్షల నగదు దగ్ధం అయ్యింది. -
భువనగిరి బరిలో 39 మంది
[ 29-04-2024]
భువనగిరి పార్లమెంటు స్థానానికిగాను 12 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకోగా పోటీలో 39 మంది మిగిలారు. -
పోటీ నుంచి తప్పుకునే ప్రసక్తే లేదు
[ 29-04-2024]
భువనగిరి బరి నుంచి తాము తప్పుకునే ప్రసక్తే లేదని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు స్పష్టం చేశారు. -
గెలుపు వ్యూహం..!
[ 29-04-2024]
ఉమ్మడి జిల్లాలోని నల్గొండ, భువనగిరి లోక్సభ నియోజకవర్గాల్లో గెలుపు కోసం భాజపా వ్యూహాలు రచిస్తోంది. -
సాగు ప్రణాళిక ఖరారు.. విత్తనాలకు ప్రతిపాదనలు
[ 29-04-2024]
నల్గొండ జిల్లా వానాకాలం పంటల సాగుపై వ్యవసాయశాఖ దృష్టి సారించింది. సాగును అంచనా వేసి అవసరమైన విత్తనాలు కోసం జిల్లాలో ప్రణాళిక సిద్ధం చేసింది. -
భానుడు భగ్గుమనె..!
[ 29-04-2024]
ఉమ్మడి జిల్లాపై ఆదివారం భానుడు నిప్పులు చెరిగాడు. ఏడు మండలాల్లో 45 డిగ్రీల సెల్సియస్కు పైగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
నిబంధనలకు నీళ్లు..!
[ 29-04-2024]
కోదాడ పట్టణంలో సుమారు 30 వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. వీటిలో పురపాలిక నుంచి అనుమతి తీసుకున్నవి ఐదు మాత్రమే. -
మడిగల్లోనే దశాబ్దాలుగా..!
[ 29-04-2024]
దేవరకొండ రెవెన్యూ డివిజన్, నియోజకవర్గ కేంద్రం, పురపాలికలో ఏ దుకాణాలు అద్దెకు తీసుకోవాలన్నా.. రూ.వేలు అద్దె చెల్లించాల్సిన పరిస్థితి. -
నల్లబజార్కు భారత్ సరకులు..!
[ 29-04-2024]
మార్కెట్లో నిత్యావసరాల ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎనిమిది నెలలుగా రాయితీపై సరఫరా చేస్తున్న ‘భారత్ దాల్’ను మిర్యాలగూడ కేంద్రంగా కొందరు అక్రమార్కులు ప్యాకెట్లు చింపి.. బస్తాల్లో నింపి ఏపీలోని పలు జిల్లాలకు తరలిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. -
ద్వితీయ శ్రేణి.. గుంభనం వీడదేమీ!
[ 29-04-2024]
అసెంబ్లీ ఎన్నికలకు.. లోక్సభ ఎన్నికలకు ప్రచారంలో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అగ్రనాయకుల హడావుడి తప్ప కిందిస్థాయి నాయకుల్లో ఇంకా ఎన్నికల ఉత్సాహం కనిపించడం లేదు. -
ఒక్కొక్కరికి ఒక్కోలా.. అందరూ వినియోగించుకునేలా
[ 29-04-2024]
ఓటును అందరూ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఉపయోగించుకోలేరు. ఎన్నికల విధుల్లో ఉన్నవారు, సైనికులు, గుఢాచారి వ్యవస్థల్లో పనిచేసే వారు తమ ఓటును ఉపయోగించుకునేందుకు వివిధ మార్గాలను ఎన్నికల సంఘం కల్పించింది. -
రఘువీర్ 44.. నర్సయ్య 65
[ 29-04-2024]
ఉమ్మడి జిల్లాలోని నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాల నుంచి బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ 44 ఏళ్లలో అతి చిన్న వయస్కుడిగా నిలవగా... భువనగిరి భాజపా అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ 65 ఏళ్లతో అత్యధిక వయస్కుడిగా నిలిచారు. -
ప్రేమజంట బలవన్మరణం
[ 29-04-2024]
ఆరేళ్లుగా ప్రేమించుకుంటూ.. పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఓ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడిన ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం తుమ్మలపెన్పహాడ్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. -
ఓటెత్తేలా.. స్ఫూర్తి చాటేలా..!
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంపొందించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. -
700 ఏళ్ల నాటి సంకెళ్ల బావి
[ 29-04-2024]
అది చరిత్ర పుటల్లో శిథిలమైన మహానగరం.. చుట్టూ అడవి.. ఎతైన కొండలు..కోటలు.. ఇంకొంచెం తొంగిచూస్తే మరెన్నో చారిత్రక విశేషాలు. -
త్వరలో భారాస కనుమరుగు: రాజగోపాల్రెడ్డి
[ 29-04-2024]
భారాస త్వరలో కనుమరుగవుతుందని కాంగ్రెస్ భువనగిరి లోక్సభ ఎన్నికల ఇన్ఛార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి జోస్యం చెప్పారు. -
ఆమె కోసం..!
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల్లో మహిళా శక్తే ప్రాధాన్యంగా కనిపిస్తోంది. అభ్యర్థులు, నాయకుల దృష్టి మహిళా ఓటర్లపైన పడింది. -
డిజిటల్ లావాదేవీలపై నిఘా..
[ 29-04-2024]
ఆలేరుకు చెందిన ఓ ఖాతాదారుడు భువనగిరిలో నివాసం ఉంటున్నాడు. ప్రైవేట్ బ్యాంకు నుంచి అధికారులు ఫోన్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం
-
సొంతగడ్డపై చెలరేగిన కోల్కతా.. దిల్లీపై ఘన విజయం
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!