కొత్త హంగులతో ఎన్నికల ఏర్పాట్లు
ఎన్నికల ఏర్పాట్లకు కొత్త హంగులు జోడించి అటు అభ్యర్థులకు, ఇటు ఓటర్లకు సౌకర్యాలు కల్పిస్తున్నారు.
హుజూర్నగర్, హుజూర్నగర్ గ్రామీణం, న్యూస్టుడే: ఎన్నికల ఏర్పాట్లకు కొత్త హంగులు జోడించి అటు అభ్యర్థులకు, ఇటు ఓటర్లకు సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఎక్కువ ఓటింగ్ శాతం నమోదు కావడమే లక్ష్యంగా పలు నూతన పద్ధతులను అవలంబించనున్నారు. ఈనెల 18న ఎన్నికల ప్రకటన వెలువడనున్న క్రమంలో అధికారులు అన్ని ఏర్పాట్లపై దృష్టి సారించారు.
ఇంటి వద్ద ఓటు..
మొదటిసారి లోక్సభ ఎన్నికల్లో ఇంటి వద్దే ఓటు వేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. నడవలేని వృద్ధులు, దివ్యాంగులు, వివిధ జబ్బులతో కదల్లేని ఓటర్లు తమ ఓటు హక్కును ఇంటి వద్దే వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నారు. ముందస్తుగా ఇంటి వద్ద ఓటు వేయాలనుకునేవారు ఫారం-12డి తో దరఖాస్తు చేసుకోవాలి. వారికి అధికారులు ఎన్నికలకు ముందుగానే ఇంటికి వచ్చి బ్యాలెట్ పేపరు ద్వారా ఓటు వేసే అవకాశం కల్పిస్తారు.
ఆన్లైన్లో నామినేషన్ల దాఖలు..
ఈసారి లోక్సభ ఎన్నికల నామినేషన్లు ఆన్లైన్లోనూ దాఖలు చేయవచ్చు. మామూలుగా ఆర్వో కార్యాలయంలో నామినేషన్లు వేస్తుంటారు. ఎన్నికల కమిషన్ అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్లో నామినేన్లు వేసుకునే అవకాశం కల్పించారు. ఇలా నామినేషన్లు వేసిన వారు ధ్రువపత్రాలను ఆర్వో కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది.
ఆధునికీకరించిన సీ-విజిల్ యాప్..
సీ-విజిల్ యాప్ పాతదే. దాన్ని పూర్తిగా ఆధునికీకరించి అందుబాటులోకి తీసుకువచ్చారు. మొదట ఈ యాప్ 2014 ఎన్నికల్లో తీసుకువచ్చారు. నగదు, మద్యం, వివిధ రకాల కానుకలు ఇస్తూ ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమాలు ఏం జరిగినా ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు అందిన 100 నిమిషాల్లోనే అధికారులు చర్యలు తీసుకుని అక్రమాలను అరికట్టేందుకు చర్యలు తీసుకొంటారు.
పెరిగిన నమూనా పోలింగ్ కేంద్రాలు..
ఓటింగ్ శాతం పెంచేందుకు ఓటర్లకు మరింత సౌకర్యవంతమైన కేంద్రాలు ఏర్పాటు చేస్తూ ఎన్నికల కమిషన్ ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఒక లోక్సభ నియోజకవర్గంలోని ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మహిళలకు ప్రత్యేకంగా ఐదు పోలింగ్ కేంద్రాలు, ఐదు ఆదర్శ పోలింగ్ కేంద్రాలు, దివ్యాంగులకు ఒక పోలింగ్ కేంద్రం, నూతన ఓటర్లు, యువకులకు ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు వీటి సంఖ్య పెంచారు.
సువిధ పోర్టల్ ద్వారా అనుమతులు..
రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రచారం కోసం సభలు, సమావేశాలు, ర్యాలీలు, లౌడ్ స్పీకర్లు, వాహనాల్లో ప్రచారం తదితర వాటికి సువిధ పోర్టల్ ద్వారా అనుమతులు తీసుకునే అవకాశం కల్పించారు. ప్రత్యేకంగా అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఈ పోర్టల్ ద్వారా అనుమతులు తీసుకుని వాటి పత్రాలు దగ్గర పెట్టుకుని తనిఖీ అధికారులు వచ్చినప్పుడు చూపించవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏటీఎం చోరీకి యత్నం.. షార్ట్ సర్క్యూట్తో నగదు దగ్ధం
[ 29-04-2024]
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండలోని ఓ ఏటీఎంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా రూ.8 లక్షల నగదు దగ్ధం అయ్యింది. -
భువనగిరి బరిలో 39 మంది
[ 29-04-2024]
భువనగిరి పార్లమెంటు స్థానానికిగాను 12 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకోగా పోటీలో 39 మంది మిగిలారు. -
పోటీ నుంచి తప్పుకునే ప్రసక్తే లేదు
[ 29-04-2024]
భువనగిరి బరి నుంచి తాము తప్పుకునే ప్రసక్తే లేదని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు స్పష్టం చేశారు. -
గెలుపు వ్యూహం..!
[ 29-04-2024]
ఉమ్మడి జిల్లాలోని నల్గొండ, భువనగిరి లోక్సభ నియోజకవర్గాల్లో గెలుపు కోసం భాజపా వ్యూహాలు రచిస్తోంది. -
సాగు ప్రణాళిక ఖరారు.. విత్తనాలకు ప్రతిపాదనలు
[ 29-04-2024]
నల్గొండ జిల్లా వానాకాలం పంటల సాగుపై వ్యవసాయశాఖ దృష్టి సారించింది. సాగును అంచనా వేసి అవసరమైన విత్తనాలు కోసం జిల్లాలో ప్రణాళిక సిద్ధం చేసింది. -
భానుడు భగ్గుమనె..!
[ 29-04-2024]
ఉమ్మడి జిల్లాపై ఆదివారం భానుడు నిప్పులు చెరిగాడు. ఏడు మండలాల్లో 45 డిగ్రీల సెల్సియస్కు పైగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
నిబంధనలకు నీళ్లు..!
[ 29-04-2024]
కోదాడ పట్టణంలో సుమారు 30 వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. వీటిలో పురపాలిక నుంచి అనుమతి తీసుకున్నవి ఐదు మాత్రమే. -
మడిగల్లోనే దశాబ్దాలుగా..!
[ 29-04-2024]
దేవరకొండ రెవెన్యూ డివిజన్, నియోజకవర్గ కేంద్రం, పురపాలికలో ఏ దుకాణాలు అద్దెకు తీసుకోవాలన్నా.. రూ.వేలు అద్దె చెల్లించాల్సిన పరిస్థితి. -
నల్లబజార్కు భారత్ సరకులు..!
[ 29-04-2024]
మార్కెట్లో నిత్యావసరాల ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎనిమిది నెలలుగా రాయితీపై సరఫరా చేస్తున్న ‘భారత్ దాల్’ను మిర్యాలగూడ కేంద్రంగా కొందరు అక్రమార్కులు ప్యాకెట్లు చింపి.. బస్తాల్లో నింపి ఏపీలోని పలు జిల్లాలకు తరలిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. -
ద్వితీయ శ్రేణి.. గుంభనం వీడదేమీ!
[ 29-04-2024]
అసెంబ్లీ ఎన్నికలకు.. లోక్సభ ఎన్నికలకు ప్రచారంలో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అగ్రనాయకుల హడావుడి తప్ప కిందిస్థాయి నాయకుల్లో ఇంకా ఎన్నికల ఉత్సాహం కనిపించడం లేదు. -
ఒక్కొక్కరికి ఒక్కోలా.. అందరూ వినియోగించుకునేలా
[ 29-04-2024]
ఓటును అందరూ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఉపయోగించుకోలేరు. ఎన్నికల విధుల్లో ఉన్నవారు, సైనికులు, గుఢాచారి వ్యవస్థల్లో పనిచేసే వారు తమ ఓటును ఉపయోగించుకునేందుకు వివిధ మార్గాలను ఎన్నికల సంఘం కల్పించింది. -
రఘువీర్ 44.. నర్సయ్య 65
[ 29-04-2024]
ఉమ్మడి జిల్లాలోని నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాల నుంచి బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ 44 ఏళ్లలో అతి చిన్న వయస్కుడిగా నిలవగా... భువనగిరి భాజపా అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ 65 ఏళ్లతో అత్యధిక వయస్కుడిగా నిలిచారు. -
ప్రేమజంట బలవన్మరణం
[ 29-04-2024]
ఆరేళ్లుగా ప్రేమించుకుంటూ.. పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఓ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడిన ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం తుమ్మలపెన్పహాడ్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. -
ఓటెత్తేలా.. స్ఫూర్తి చాటేలా..!
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంపొందించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. -
700 ఏళ్ల నాటి సంకెళ్ల బావి
[ 29-04-2024]
అది చరిత్ర పుటల్లో శిథిలమైన మహానగరం.. చుట్టూ అడవి.. ఎతైన కొండలు..కోటలు.. ఇంకొంచెం తొంగిచూస్తే మరెన్నో చారిత్రక విశేషాలు. -
త్వరలో భారాస కనుమరుగు: రాజగోపాల్రెడ్డి
[ 29-04-2024]
భారాస త్వరలో కనుమరుగవుతుందని కాంగ్రెస్ భువనగిరి లోక్సభ ఎన్నికల ఇన్ఛార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి జోస్యం చెప్పారు. -
ఆమె కోసం..!
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల్లో మహిళా శక్తే ప్రాధాన్యంగా కనిపిస్తోంది. అభ్యర్థులు, నాయకుల దృష్టి మహిళా ఓటర్లపైన పడింది. -
డిజిటల్ లావాదేవీలపై నిఘా..
[ 29-04-2024]
ఆలేరుకు చెందిన ఓ ఖాతాదారుడు భువనగిరిలో నివాసం ఉంటున్నాడు. ప్రైవేట్ బ్యాంకు నుంచి అధికారులు ఫోన్ చేశారు.